తెలుగు దేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గానీ, ప్రస్తుత అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గానీ బీసీలకు అన్నింటా అగ్ర తాంబూలమే వేశారు. చంద్రబాబు ఆ సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే, నామినేటెడ్ సీట్లలో అనుకున్న దాని కంటే కూడా మెరుగైన రీతిలోనే సీట్లను ఇచ్చిన బాబు… ప్రభుత్వ పథకాల్లోనూ వారి కోటాకు ఎక్కడ కూడా చిల్లు పడనివ్వడం లేదు. అందులో భాగంగా తాజాగా ఏపీలో కొత్తగా ఏర్పాటు కానున్న బార్లలో బీసీల్లోని కల్లుగీత కార్మికులకు 10 శాతం బార్లను కేటాయించారు.
త్వరలోనే ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఈ పాలసీ ప్రకారం ఏపీలో మొత్తంగా 840 బార్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. వీటిలో 10 శాతం అంటే… 84 బార్లను కల్లు గీత కార్మికులకు కేటాయిస్తారన్న మాట. ఈ బార్లను సదరు సామాజిక వర్గానికి చెందిన వారు అందిపుచ్చుకుని ఆర్థికంగా పుంజుకోనేందుకు బాబు సర్కారు అవకాశం కల్పిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వైన్ షాపుల్లోనూ ఇప్పటికే కల్లు గీత కార్మికులకు బాబు సర్కారు 10 శాతం వైన్ షాపులను కేటాయించిన సంగతి తెలిసింది. తాజాగా బార్లలోనూ వారికి 10 శాతం బార్లను కేటాయించి చంద్రబాబు తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.
ఈ మేరకు ఏపీలోని కూటమి సర్కారు కల్లుగీత కార్మికులకు 10 శాతం బార్లను కేటాయిస్తూ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 10 శాతం బార్లను కూడా ఎక్కడెక్కడ అన్న కేటాయించాలన్న దానిపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేయనుంది. కల్లుగీత కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల్లోని బార్లను వారికి కేటాయించే అవకాశాలున్నట్లు సమచారం. వరుసబెట్టి బీసీలకు చంద్రబాబు సర్కారు నుంచి అందుతున్న ఇలాంటి పథకాలు వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దనున్నాయన్న వాదనలు బలంగా వినిపిిస్తున్నాయి.
This post was last modified on August 4, 2025 11:34 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…