Political News

ఆర్ఆర్ఆర్‌ పై కేసు పెట్టి త‌ప్పుచేశా.. : కానిస్టేబుల్‌

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, ఉండి ఎమ్మెల్యే, టీడీపీ నేత ర‌ఘురామకృష్ణ‌రాజు (ఆర్ ఆర్ ఆర్‌)పై కేసు పెట్టి త‌ప్పు చేశానని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మ‌హ‌మ్మ‌ద్ ఫ‌రూక్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. ఈ కేసును కొన‌సాగించే అవ‌కాశం త‌న‌కు లేదన్నారు. అందుకే ఆయ‌న‌పై న‌మోదు చేసిన కేసు సహా కోర్టులో వేసిన పిటిషన్ల‌ను కూడా వెన‌క్కి తీసుకుంటున్నానని ఆయ‌న సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

అయితే దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంత‌రం తుది నిర్ణ‌యం వెలువ‌రిస్తామ‌ని పేర్కొంది. దీంతో ఈ కేసులో ర‌ఘురామ‌కు ఊర‌ట ల‌భించిన‌ట్టు అయింది.

ఏంటి కేసు?

ర‌ఘురామ‌కృష్ణ‌రాజు 2019 నుంచి 2024 వ‌ర‌కు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా ఉన్నారు. అయితే ఆయ‌న అప్ప‌ట్లోనే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్ర‌వర్తించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ ఆయ‌న‌ను అరెస్టు చేసి క‌స్ట‌డీలో హింసించింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అనంత‌రం ఆయ‌న బెయిల్‌పై విడుదలై హైద‌రాబాద్‌లోని బౌల్డ‌ర్ హిల్స్‌లోని స్వగృహానికి వెళ్లిపోయారు.

కానీ, వైసీపీ ప్ర‌భుత్వం అక్క‌డ కూడా ఆయ‌న‌ను వెంటాడింద‌న్న ఆరోప‌ణలు వ‌చ్చాయి. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాల మేరకు కానిస్టేబుల్ ఫ‌రూక్ మ‌ఫ్టీలో ర‌ఘురామ ఇంటి వ‌ద్ద ప‌హారా కాశారు.

దీనిని గుర్తించిన ర‌ఘురామ కుమారుడు భ‌ర‌త్ త‌మ సిబ్బందితో ఫ‌రూక్‌ను ప‌ట్టుకుని దేహశుద్ధి చేసి (అప్ప‌టికి అత‌ను కానిస్టేబుల్ అన్న విష‌యం తెలియదు) స్థానిక పోలీసులకు అప్ప‌గించారు. అలాగే త‌మ ప్రాణాలకు హాని కలిగించేందుకే ఫ‌రూక్ అక్క‌డ‌కు వచ్చార‌ని కేసులో పేర్కొన్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా న‌మోదైంది.

ఫ‌రూక్ తాను ఇంటెలిజెన్స్ పోలీసున‌ని, ఉన్న‌తాధికారుల ఆదేశాలతోనే అక్కడ ప‌హారా కాశానని చెప్పారు. త‌న‌ను కొట్టిన ర‌ఘురామ, భ‌ర‌త్‌ల‌పై ఆయ‌న ఎదురు కేసు పెట్టారు. ఈ రెండు కేసులు ఒకే పోలీస్ స్టేషన్‌లో న‌మోద‌య్యాయి.

ర‌ఘురామ వేసిన కేసును ప‌క్కన పెట్టిన అప్పటి పోలీసులు, ఫ‌రూక్ ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. దాంతో ర‌ఘురామ హైకోర్టును ఆశ్ర‌యించి త‌మ కేసును ప‌క్క‌న పెట్టడం ఎలా అని ప్రశ్నించారు. కానీ హైకోర్టు ఆయ‌న అభ్యర్థనను తోసిపుచ్చింది.

దీంతో ర‌ఘురామ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి ఫ‌రూక్ పెట్టిన కేసును స‌వాల్ చేశారు. తాజాగా విచారణ సందర్భంగా ఫ‌రూక్ త‌న న్యాయ‌వాది ద్వారా పిటిషన్ వేశారు. తాను త‌ప్పు చేశానని, ర‌ఘురామ‌, భ‌ర‌త్‌ల‌పై కేసు పెట్టే ఉద్దేశం లేద‌ని, దాన్ని వెన‌క్కి తీసుకుంటున్నానని తెలిపారు.

This post was last modified on August 4, 2025 11:03 pm

Share

Recent Posts

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

4 minutes ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

13 minutes ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

1 hour ago

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

2 hours ago

టాలీవుడ్ ఆగస్ట్ కిరీటం – ఎవరికో అవకాశం!

కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…

6 hours ago

మా పిల్లలను శిక్షించలేను… క్షమిస్తున్నాను

జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…

7 hours ago