Political News

ఆర్ఆర్ఆర్‌ పై కేసు పెట్టి త‌ప్పుచేశా.. : కానిస్టేబుల్‌

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, ఉండి ఎమ్మెల్యే, టీడీపీ నేత ర‌ఘురామకృష్ణ‌రాజు (ఆర్ ఆర్ ఆర్‌)పై కేసు పెట్టి త‌ప్పు చేశానని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మ‌హ‌మ్మ‌ద్ ఫ‌రూక్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. ఈ కేసును కొన‌సాగించే అవ‌కాశం త‌న‌కు లేదన్నారు. అందుకే ఆయ‌న‌పై న‌మోదు చేసిన కేసు సహా కోర్టులో వేసిన పిటిషన్ల‌ను కూడా వెన‌క్కి తీసుకుంటున్నానని ఆయ‌న సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

అయితే దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంత‌రం తుది నిర్ణ‌యం వెలువ‌రిస్తామ‌ని పేర్కొంది. దీంతో ఈ కేసులో ర‌ఘురామ‌కు ఊర‌ట ల‌భించిన‌ట్టు అయింది.

ఏంటి కేసు?

ర‌ఘురామ‌కృష్ణ‌రాజు 2019 నుంచి 2024 వ‌ర‌కు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా ఉన్నారు. అయితే ఆయ‌న అప్ప‌ట్లోనే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్ర‌వర్తించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ ఆయ‌న‌ను అరెస్టు చేసి క‌స్ట‌డీలో హింసించింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అనంత‌రం ఆయ‌న బెయిల్‌పై విడుదలై హైద‌రాబాద్‌లోని బౌల్డ‌ర్ హిల్స్‌లోని స్వగృహానికి వెళ్లిపోయారు.

కానీ, వైసీపీ ప్ర‌భుత్వం అక్క‌డ కూడా ఆయ‌న‌ను వెంటాడింద‌న్న ఆరోప‌ణలు వ‌చ్చాయి. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాల మేరకు కానిస్టేబుల్ ఫ‌రూక్ మ‌ఫ్టీలో ర‌ఘురామ ఇంటి వ‌ద్ద ప‌హారా కాశారు.

దీనిని గుర్తించిన ర‌ఘురామ కుమారుడు భ‌ర‌త్ త‌మ సిబ్బందితో ఫ‌రూక్‌ను ప‌ట్టుకుని దేహశుద్ధి చేసి (అప్ప‌టికి అత‌ను కానిస్టేబుల్ అన్న విష‌యం తెలియదు) స్థానిక పోలీసులకు అప్ప‌గించారు. అలాగే త‌మ ప్రాణాలకు హాని కలిగించేందుకే ఫ‌రూక్ అక్క‌డ‌కు వచ్చార‌ని కేసులో పేర్కొన్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా న‌మోదైంది.

ఫ‌రూక్ తాను ఇంటెలిజెన్స్ పోలీసున‌ని, ఉన్న‌తాధికారుల ఆదేశాలతోనే అక్కడ ప‌హారా కాశానని చెప్పారు. త‌న‌ను కొట్టిన ర‌ఘురామ, భ‌ర‌త్‌ల‌పై ఆయ‌న ఎదురు కేసు పెట్టారు. ఈ రెండు కేసులు ఒకే పోలీస్ స్టేషన్‌లో న‌మోద‌య్యాయి.

ర‌ఘురామ వేసిన కేసును ప‌క్కన పెట్టిన అప్పటి పోలీసులు, ఫ‌రూక్ ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. దాంతో ర‌ఘురామ హైకోర్టును ఆశ్ర‌యించి త‌మ కేసును ప‌క్క‌న పెట్టడం ఎలా అని ప్రశ్నించారు. కానీ హైకోర్టు ఆయ‌న అభ్యర్థనను తోసిపుచ్చింది.

దీంతో ర‌ఘురామ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి ఫ‌రూక్ పెట్టిన కేసును స‌వాల్ చేశారు. తాజాగా విచారణ సందర్భంగా ఫ‌రూక్ త‌న న్యాయ‌వాది ద్వారా పిటిషన్ వేశారు. తాను త‌ప్పు చేశానని, ర‌ఘురామ‌, భ‌ర‌త్‌ల‌పై కేసు పెట్టే ఉద్దేశం లేద‌ని, దాన్ని వెన‌క్కి తీసుకుంటున్నానని తెలిపారు.

This post was last modified on August 4, 2025 11:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

3 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

3 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

4 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

4 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

5 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

7 hours ago