ఏపీలో జనసేన పార్టీ తరఫున ఇద్దరు నాయకులు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. వీరిలో మచిలీ పట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. అయితే.. బాలశౌరి ఇప్పుడు వివాదంలో చిక్కుకు న్నారు. ఎంపీ లెటర్ హెడ్లు, అప్పాయింట్మెంటు లెటర్లను నకిలీవి సృష్టించి.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి గోపాల్ సింగ్ సుమారు 60-70 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయల వరకు మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం నియోజకవర్గంలో కాక రేపుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున బాధితులు ఎంపీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
ఏం జరిగింది?
ఎంపీ బాలశౌరికి పర్సనల్ అసిస్టెంటుగా పనిచేస్తున్న గోపాల్ సింగ్.. ఎంపీ పేరుతో నకిలీ అప్పాయింట్మెంటు లెటర్లు, లెటర్ హెడ్లు సృష్టించారు. వీటిని ఆసరాగా చేసుకుని నిరుద్యోగులను ఆకర్షించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎంపీ సిద్ధంగా ఉన్నారని.. అప్లయి చేసుకోవాలని సోసల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిని నమ్మిన 60 నుంచి 70 మంది నిరుద్యోగులు.. ఆ లెటర్ హెడ్ల, అప్పాయింట్లను ఆధారంగా చేసుకుని ఒక్కొక్కరు రూ.2 లక్షల చొప్పున ఫండ్ కింద చెల్లించారు. ఇలా ఇచ్చిన వారికే ఎంపీ ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ.. గోపాల్ సింగ్ ప్రచారం చేయడంతో వారు నిజమేనని నమ్మారు.
చివరకు ఈ నెల 1న విజయవాడలో ఇంటర్వ్యూలు ఉన్నాయని.. సొమ్ములతో రావాలని కొందరికి గోపాల్ సింగ్ కబురు పెట్టారు. దీంతో అక్కడికి రాకముందే.. వారి నుంచి ఆయన ఫోన్ పే సహా.. ఇతర మార్గాల్లో సొమ్ములు రాబట్టారు. చివరకు విజయవాడ కు వచ్చిన బాధిత నిరుద్యోగులకు మొహం చాటేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన.. బాధితులు.. గోపాల్ సింగ్ ఇచ్చిన అప్పాయింట్మెంటు లెటర్లు, లెటర్ హెడ్లో మచిలీపట్నంలోని ఎంపీ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీ బాలశౌరి సహా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల నుంచి లెటర్ హెడ్లు, అప్పాయింట్మెంటు లెటర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని నకిలీ పత్రాలుగా గుర్తించారు. కొందరు తాము చెల్లించిన నగదుకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులకు అందించారు. కాగా.. గత రెండు రోజులుగా గోపాల్ సింగ్ ఆఫీసుకు కూడా రాలేదని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుపై ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు.. బాలశౌరి ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్పందించలేదు.
This post was last modified on August 2, 2025 7:10 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…