Political News

వివాదంలో జ‌న‌సేన ఎంపీ పేరు తో మోసం

ఏపీలో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున ఇద్ద‌రు నాయ‌కులు గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో మ‌చిలీ ప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి, కాకినాడ ఎంపీ ఉద‌య్ శ్రీనివాస్ ఉన్నారు. అయితే.. బాలశౌరి ఇప్పుడు వివాదంలో చిక్కుకు న్నారు. ఎంపీ లెట‌ర్ హెడ్‌లు, అప్పాయింట్‌మెంటు లెట‌ర్ల‌ను న‌కిలీవి సృష్టించి.. ఆయ‌న వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి గోపాల్ సింగ్ సుమారు 60-70 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయ‌ల వ‌ర‌కు మోస‌గించిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్య‌వ‌హారం నియోజ‌క‌వ‌ర్గంలో కాక రేపుతోంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున బాధితులు ఎంపీ కార్యాల‌యాన్ని చుట్టుముట్టారు.

ఏం జ‌రిగింది?

ఎంపీ బాల‌శౌరికి ప‌ర్స‌న‌ల్ అసిస్టెంటుగా ప‌నిచేస్తున్న గోపాల్ సింగ్.. ఎంపీ పేరుతో న‌కిలీ అప్పాయింట్‌మెంటు లెట‌ర్లు, లెట‌ర్ హెడ్‌లు సృష్టించారు. వీటిని ఆస‌రాగా చేసుకుని నిరుద్యోగుల‌ను ఆక‌ర్షించారు. కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎంపీ సిద్ధంగా ఉన్నార‌ని.. అప్ల‌యి చేసుకోవాల‌ని సోస‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు. దీనిని న‌మ్మిన 60 నుంచి 70 మంది నిరుద్యోగులు.. ఆ లెట‌ర్ హెడ్ల‌, అప్పాయింట్ల‌ను ఆధారంగా చేసుకుని ఒక్కొక్క‌రు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఫండ్ కింద చెల్లించారు. ఇలా ఇచ్చిన వారికే ఎంపీ ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ.. గోపాల్ సింగ్ ప్ర‌చారం చేయ‌డంతో వారు నిజ‌మేన‌ని నమ్మారు.

చివ‌ర‌కు ఈ నెల 1న విజ‌య‌వాడలో ఇంట‌ర్వ్యూలు ఉన్నాయ‌ని.. సొమ్ముల‌తో రావాల‌ని కొంద‌రికి గోపాల్ సింగ్ క‌బురు పెట్టారు. దీంతో అక్క‌డికి రాక‌ముందే.. వారి నుంచి ఆయ‌న ఫోన్ పే స‌హా.. ఇత‌ర మార్గాల్లో సొమ్ములు రాబ‌ట్టారు. చివ‌ర‌కు విజ‌య‌వాడ కు వ‌చ్చిన బాధిత నిరుద్యోగుల‌కు మొహం చాటేశారు. దీంతో మోస‌పోయామ‌ని గ్ర‌హించిన‌.. బాధితులు.. గోపాల్ సింగ్ ఇచ్చిన అప్పాయింట్‌మెంటు లెట‌ర్లు, లెట‌ర్ హెడ్‌లో మ‌చిలీప‌ట్నంలోని ఎంపీ కార్యాల‌యానికి చేరుకుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీనిపై ఎంపీ బాల‌శౌరి స‌హా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా స్పందించాల‌ని డిమాండ్ చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల నుంచి లెట‌ర్ హెడ్‌లు, అప్పాయింట్‌మెంటు లెట‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని న‌కిలీ ప‌త్రాలుగా గుర్తించారు. కొంద‌రు తాము చెల్లించిన న‌గ‌దుకు సంబంధించిన వివ‌రాల‌ను కూడా పోలీసుల‌కు అందించారు. కాగా.. గ‌త రెండు రోజులుగా గోపాల్ సింగ్ ఆఫీసుకు కూడా రాలేద‌ని.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుపై ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. మ‌రోవైపు.. బాల‌శౌరి ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

This post was last modified on August 2, 2025 7:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

2 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

2 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

3 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

3 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

4 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

6 hours ago