Political News

వివాదంలో జ‌న‌సేన ఎంపీ పేరు తో మోసం

ఏపీలో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున ఇద్ద‌రు నాయ‌కులు గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో మ‌చిలీ ప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి, కాకినాడ ఎంపీ ఉద‌య్ శ్రీనివాస్ ఉన్నారు. అయితే.. బాలశౌరి ఇప్పుడు వివాదంలో చిక్కుకు న్నారు. ఎంపీ లెట‌ర్ హెడ్‌లు, అప్పాయింట్‌మెంటు లెట‌ర్ల‌ను న‌కిలీవి సృష్టించి.. ఆయ‌న వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి గోపాల్ సింగ్ సుమారు 60-70 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయ‌ల వ‌ర‌కు మోస‌గించిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్య‌వ‌హారం నియోజ‌క‌వ‌ర్గంలో కాక రేపుతోంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున బాధితులు ఎంపీ కార్యాల‌యాన్ని చుట్టుముట్టారు.

ఏం జ‌రిగింది?

ఎంపీ బాల‌శౌరికి ప‌ర్స‌న‌ల్ అసిస్టెంటుగా ప‌నిచేస్తున్న గోపాల్ సింగ్.. ఎంపీ పేరుతో న‌కిలీ అప్పాయింట్‌మెంటు లెట‌ర్లు, లెట‌ర్ హెడ్‌లు సృష్టించారు. వీటిని ఆస‌రాగా చేసుకుని నిరుద్యోగుల‌ను ఆక‌ర్షించారు. కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎంపీ సిద్ధంగా ఉన్నార‌ని.. అప్ల‌యి చేసుకోవాల‌ని సోస‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు. దీనిని న‌మ్మిన 60 నుంచి 70 మంది నిరుద్యోగులు.. ఆ లెట‌ర్ హెడ్ల‌, అప్పాయింట్ల‌ను ఆధారంగా చేసుకుని ఒక్కొక్క‌రు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఫండ్ కింద చెల్లించారు. ఇలా ఇచ్చిన వారికే ఎంపీ ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ.. గోపాల్ సింగ్ ప్ర‌చారం చేయ‌డంతో వారు నిజ‌మేన‌ని నమ్మారు.

చివ‌ర‌కు ఈ నెల 1న విజ‌య‌వాడలో ఇంట‌ర్వ్యూలు ఉన్నాయ‌ని.. సొమ్ముల‌తో రావాల‌ని కొంద‌రికి గోపాల్ సింగ్ క‌బురు పెట్టారు. దీంతో అక్క‌డికి రాక‌ముందే.. వారి నుంచి ఆయ‌న ఫోన్ పే స‌హా.. ఇత‌ర మార్గాల్లో సొమ్ములు రాబ‌ట్టారు. చివ‌ర‌కు విజ‌య‌వాడ కు వ‌చ్చిన బాధిత నిరుద్యోగుల‌కు మొహం చాటేశారు. దీంతో మోస‌పోయామ‌ని గ్ర‌హించిన‌.. బాధితులు.. గోపాల్ సింగ్ ఇచ్చిన అప్పాయింట్‌మెంటు లెట‌ర్లు, లెట‌ర్ హెడ్‌లో మ‌చిలీప‌ట్నంలోని ఎంపీ కార్యాల‌యానికి చేరుకుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీనిపై ఎంపీ బాల‌శౌరి స‌హా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా స్పందించాల‌ని డిమాండ్ చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల నుంచి లెట‌ర్ హెడ్‌లు, అప్పాయింట్‌మెంటు లెట‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని న‌కిలీ ప‌త్రాలుగా గుర్తించారు. కొంద‌రు తాము చెల్లించిన న‌గ‌దుకు సంబంధించిన వివ‌రాల‌ను కూడా పోలీసుల‌కు అందించారు. కాగా.. గ‌త రెండు రోజులుగా గోపాల్ సింగ్ ఆఫీసుకు కూడా రాలేద‌ని.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుపై ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. మ‌రోవైపు.. బాల‌శౌరి ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

Satya

Recent Posts

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…

12 minutes ago

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

2 hours ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

4 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

5 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

5 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

5 hours ago