ఏపీలో జనసేన పార్టీ తరఫున ఇద్దరు నాయకులు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. వీరిలో మచిలీ పట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. అయితే.. బాలశౌరి ఇప్పుడు వివాదంలో చిక్కుకు న్నారు. ఎంపీ లెటర్ హెడ్లు, అప్పాయింట్మెంటు లెటర్లను నకిలీవి సృష్టించి.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి గోపాల్ సింగ్ సుమారు 60-70 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయల వరకు మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం నియోజకవర్గంలో కాక రేపుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున బాధితులు ఎంపీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
ఏం జరిగింది?
ఎంపీ బాలశౌరికి పర్సనల్ అసిస్టెంటుగా పనిచేస్తున్న గోపాల్ సింగ్.. ఎంపీ పేరుతో నకిలీ అప్పాయింట్మెంటు లెటర్లు, లెటర్ హెడ్లు సృష్టించారు. వీటిని ఆసరాగా చేసుకుని నిరుద్యోగులను ఆకర్షించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎంపీ సిద్ధంగా ఉన్నారని.. అప్లయి చేసుకోవాలని సోసల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిని నమ్మిన 60 నుంచి 70 మంది నిరుద్యోగులు.. ఆ లెటర్ హెడ్ల, అప్పాయింట్లను ఆధారంగా చేసుకుని ఒక్కొక్కరు రూ.2 లక్షల చొప్పున ఫండ్ కింద చెల్లించారు. ఇలా ఇచ్చిన వారికే ఎంపీ ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ.. గోపాల్ సింగ్ ప్రచారం చేయడంతో వారు నిజమేనని నమ్మారు.
చివరకు ఈ నెల 1న విజయవాడలో ఇంటర్వ్యూలు ఉన్నాయని.. సొమ్ములతో రావాలని కొందరికి గోపాల్ సింగ్ కబురు పెట్టారు. దీంతో అక్కడికి రాకముందే.. వారి నుంచి ఆయన ఫోన్ పే సహా.. ఇతర మార్గాల్లో సొమ్ములు రాబట్టారు. చివరకు విజయవాడ కు వచ్చిన బాధిత నిరుద్యోగులకు మొహం చాటేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన.. బాధితులు.. గోపాల్ సింగ్ ఇచ్చిన అప్పాయింట్మెంటు లెటర్లు, లెటర్ హెడ్లో మచిలీపట్నంలోని ఎంపీ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీ బాలశౌరి సహా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల నుంచి లెటర్ హెడ్లు, అప్పాయింట్మెంటు లెటర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని నకిలీ పత్రాలుగా గుర్తించారు. కొందరు తాము చెల్లించిన నగదుకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులకు అందించారు. కాగా.. గత రెండు రోజులుగా గోపాల్ సింగ్ ఆఫీసుకు కూడా రాలేదని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుపై ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు.. బాలశౌరి ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్పందించలేదు.
This post was last modified on August 2, 2025 7:10 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…