Political News

వివాదంలో జ‌న‌సేన ఎంపీ పేరు తో మోసం

ఏపీలో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున ఇద్ద‌రు నాయ‌కులు గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో మ‌చిలీ ప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి, కాకినాడ ఎంపీ ఉద‌య్ శ్రీనివాస్ ఉన్నారు. అయితే.. బాలశౌరి ఇప్పుడు వివాదంలో చిక్కుకు న్నారు. ఎంపీ లెట‌ర్ హెడ్‌లు, అప్పాయింట్‌మెంటు లెట‌ర్ల‌ను న‌కిలీవి సృష్టించి.. ఆయ‌న వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి గోపాల్ సింగ్ సుమారు 60-70 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయ‌ల వ‌ర‌కు మోస‌గించిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్య‌వ‌హారం నియోజ‌క‌వ‌ర్గంలో కాక రేపుతోంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున బాధితులు ఎంపీ కార్యాల‌యాన్ని చుట్టుముట్టారు.

ఏం జ‌రిగింది?

ఎంపీ బాల‌శౌరికి ప‌ర్స‌న‌ల్ అసిస్టెంటుగా ప‌నిచేస్తున్న గోపాల్ సింగ్.. ఎంపీ పేరుతో న‌కిలీ అప్పాయింట్‌మెంటు లెట‌ర్లు, లెట‌ర్ హెడ్‌లు సృష్టించారు. వీటిని ఆస‌రాగా చేసుకుని నిరుద్యోగుల‌ను ఆక‌ర్షించారు. కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎంపీ సిద్ధంగా ఉన్నార‌ని.. అప్ల‌యి చేసుకోవాల‌ని సోస‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు. దీనిని న‌మ్మిన 60 నుంచి 70 మంది నిరుద్యోగులు.. ఆ లెట‌ర్ హెడ్ల‌, అప్పాయింట్ల‌ను ఆధారంగా చేసుకుని ఒక్కొక్క‌రు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఫండ్ కింద చెల్లించారు. ఇలా ఇచ్చిన వారికే ఎంపీ ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ.. గోపాల్ సింగ్ ప్ర‌చారం చేయ‌డంతో వారు నిజ‌మేన‌ని నమ్మారు.

చివ‌ర‌కు ఈ నెల 1న విజ‌య‌వాడలో ఇంట‌ర్వ్యూలు ఉన్నాయ‌ని.. సొమ్ముల‌తో రావాల‌ని కొంద‌రికి గోపాల్ సింగ్ క‌బురు పెట్టారు. దీంతో అక్క‌డికి రాక‌ముందే.. వారి నుంచి ఆయ‌న ఫోన్ పే స‌హా.. ఇత‌ర మార్గాల్లో సొమ్ములు రాబ‌ట్టారు. చివ‌ర‌కు విజ‌య‌వాడ కు వ‌చ్చిన బాధిత నిరుద్యోగుల‌కు మొహం చాటేశారు. దీంతో మోస‌పోయామ‌ని గ్ర‌హించిన‌.. బాధితులు.. గోపాల్ సింగ్ ఇచ్చిన అప్పాయింట్‌మెంటు లెట‌ర్లు, లెట‌ర్ హెడ్‌లో మ‌చిలీప‌ట్నంలోని ఎంపీ కార్యాల‌యానికి చేరుకుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీనిపై ఎంపీ బాల‌శౌరి స‌హా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా స్పందించాల‌ని డిమాండ్ చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల నుంచి లెట‌ర్ హెడ్‌లు, అప్పాయింట్‌మెంటు లెట‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని న‌కిలీ ప‌త్రాలుగా గుర్తించారు. కొంద‌రు తాము చెల్లించిన న‌గ‌దుకు సంబంధించిన వివ‌రాల‌ను కూడా పోలీసుల‌కు అందించారు. కాగా.. గ‌త రెండు రోజులుగా గోపాల్ సింగ్ ఆఫీసుకు కూడా రాలేద‌ని.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుపై ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. మ‌రోవైపు.. బాల‌శౌరి ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

This post was last modified on August 2, 2025 7:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

19 seconds ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

42 minutes ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

5 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

5 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

6 hours ago