వైసీపీ అధినేత జగన్ తాజాగా గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అయితే.. ఆయన పర్యటనలకు భారీగా కార్యకర్తలను పోగు చేస్తుండడం.. దీంతో తొక్కిసలాటలు, వంటివి జరిగే ప్రమాదం ఉంటుందని పోలీసులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఆంక్షలు కూడా పెడుతున్నారు. అయినప్పటికీ.. జగన్ సహా వైసీపీ నాయకులు ఎవరూ కూడా ఈ ఆంక్షలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిణామమే రెంటపాళ్లలో చోటు చేసుకుని సింగయ్య అనే వైసీపీ కార్యకర్త.. ఏకంగా జగన్ కాన్వాయ్ కిందే పడి చనిపోయారు.
ఇక, ఆ తర్వాత చేపట్టిన పర్యటన ఇదే కావడం గమనార్హం. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు వివిధ కేసుల్లో అరెస్టు చేశారు. ఈయనను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. అయితే ఈ సమయంలోనూ భారీ ఎత్తున కార్యకర్తలను సమీకరించేందుకు నాయకులు ప్రయత్నించారు. కానీ, జిల్లా పోలీసులు ముందుగానే ఆంక్షలు విధించారు. అయినప్పటికీ.. పలువురు నాయకులు కార్యకర్తలకు వాట్సాప్ మెసేజ్లు పంపించి.. రెచ్చగొట్టి మరీ రప్పించే ప్రయత్నాలు చేశారు.
దీంతో వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై నిఘాను ముమ్మరం చేసిన పోలీసులు మూడు విధాలుగా వారి దూకుడు అడ్డుకట్ట వేశారు.
డ్రోన్స్ నిఘా: డ్రోన్ కెమెరాలను వినియోగించి వైసీపీ కార్యకర్తలు వస్తున్న మార్గాలను తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో మరింత మంది పోలీసులను వినియోగించి వారు రాకుండా అడ్డుకున్నారు.
కీలక నేతలను ముందుగానే హౌస్ అరెస్టు చేశారు. దీంతో పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని నిర్ణయించుకున్నవారు ఇంటికే పరిమితం అయ్యారు.
నాయకులు వస్తున్న రహదారులపై గుంతలు తవ్వించారు. దీంతో వారు కూడా రోడ్డు దాటే అవకాశం లేక వెనక్కి వెళ్లిపోయారు.
ఇలా మొత్తంగా వైసీపీ దూకుడుపై పోలీసులు తమదైన శైలిలో కళ్లెం వేశారు. దీంతో జగన్ పర్యటన పార్టీ పరంగా చప్పగా సాగినా.. శాంతి భద్రతల పరంగా ఇబ్బందులు తలెత్తలేదని పోలీసులు తెలిపారు.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…