Political News

‘జ‌గ‌న్ అవినీతి శాస్త్ర‌వేత్త..’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఏపీ అధికార పార్టీ టీడీపీ, అదేవిధంగా కాంగ్రెస్ కీల‌క నాయ‌కులు ఒకే రోజు విరుచుకుప‌డ్డారు. విమ‌ర్శ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌, టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ‌మండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఏక‌కాలంలో జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగారు. ఇద్ద‌రు వేర్వేరుగా స్పందించినా.. ఒకే అంశంపై జ‌గ‌న్‌పై దుయ్య‌బ‌ట్టారు. మ‌ద్యం కుంభ‌కోణాన్ని సెంట్రిక్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు.

మాణిక్కం ఏమ‌న్నారంటే..

2019-24 మ‌ధ్య ఏపీలో దారుణ‌మైన పాల‌న సాగింద‌ని మాణిక్కం అన్నారు. జ‌గ‌న్ ఓ అవినీతి శాస్త్ర‌వేత్త అని వ్యాఖ్యానించారు. అవినీతి ఎలా చేయాలో.. సొమ్మును ఎక్క‌డ దాచాలో.. ఎలా దారి మ‌ళ్లించాలో.. జ‌గ‌న్‌కు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌ని వ్యాఖ్యానించారు. అవినీతి ముఠాను మంత్రులుగా చేసుకుని రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను కూడా దోచుకున్నార‌ని ఆరోపించారు. మ‌ద్యం కేసులో 11 కోట్ల రూపాయ‌లు ల‌భించాయ‌ని.. ఇవి జ‌గ‌న్‌కు అందాల్సిన సొమ్ముగానే తాము భావిస్తున్నామ‌న్నారు.

ఈ మ‌ద్యం కేసులో 3500 కోట్ల అవినీతి జ‌రిగింద‌న్నారు. ఈ సొమ్ము ఎక్క‌డెక్క‌డికి మ‌ళ్లించారో తేల్చాల్సిన బాధ్య‌త ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) పైనే ఉంద‌న్నారు. ఈ సొమ్ముతోనే సినిమాలు తీశార‌ని.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశార‌ని.. పెట్టుబ‌డులు పెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. జ‌గ‌న్ అవినీతి శాస్త్ర‌వేత్త కాబ‌ట్టే.. ఆయ‌న అవినీతిలో ఆరితేరిపోయార‌ని మాణిక్కం చెప్పారు.

ఇక‌, టీడీపీ సీనియ‌ర్ నేత‌ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మ‌రో అడుగు ముందుకు వేశారు. మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అస‌లు దోషి జ‌గ‌నేన‌ని చెప్పారు. ప‌ట్టుకుని నాలుగు త‌గిలిస్తే.. అన్ని నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి అంటూ.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దొంగ‌ల‌ను ప‌రామ‌ర్శిస్తున్న జ‌గ‌న్‌.. త‌న అవినీతి పాపానికి బ‌లై జైలు పాలైన వారి కుటుంబాల‌ను ఎందుకు ప‌రామ‌ర్శించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ వారి ఇళ్ల‌కు వెళ్తే.. మ‌హిళ‌లు చీప‌ర్లు, చాట‌లు తిర‌గేస్తార‌ని ఆరోపించారు.

Kumar

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

45 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago