టీడీపీ ఎమ్మెల్యే, హిందూపురం శాసన సభ్యుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ.. గురువారం అనూహ్యంగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన టీడీపీ పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి పార్లమెంటు ఆవరణకు చేరుకున్నారు. అక్కడ విజిటర్స్ పాస్ తీసుకుని లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంటు స్పీకర్కు బాలయ్యను.. టీడీపీ సభ్యులు పరిచయం చేశారు.
తొలుత పార్లమెంటు సెంట్రల్ హాల్లో అన్నగారు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన(పురందేశ్వరి మంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు) బాలయ్య.. భారీ పూల దండను సమర్పించారు. అనంతరం.. పార్టీ ఎంపీలతో కలిసి.. పార్లమెంటు ఆవరణలో కలియ దిరిగారు. ఈ సందర్భంగా సెంట్రల్ విస్టా(పార్లమెంటు) ప్రాజెక్టును చూసి ముగ్ధుడైన బాలయ్య కొన్ని సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం.. స్పీకర్ ఓం బిర్లాను కలుసుకున్నారు. కొద్ది సేపు ముచ్చటించారు. సెప్టెంబరులో ఏపీలో జరగనున్న మహిళా పార్లమెంటు విషయాన్ని ఆయనకు చెప్పారు.
దీనికి తాను హాజరు అవుతున్నట్టు ఓం బిర్లా కూడా చెప్పారు. ఈ సందర్భంగా.. బాలయ్య టీడీపీ ఎంపీలతో మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు పార్లమెంటులోనూ తాను అడుగు పెడతానని చెప్పారు. అది ఎంతో దూరంలో లేదని సరదాగా వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్టీ సింబల్ సైకిల్ పై పార్లమెంటుకు రావడాన్ని బాలయ్య ప్రశంసించారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడం అంటే.. ఇదే అంటూ.. కలిశెట్టి భుజం తట్టారు. తాను కూడా సైకిల్ ఎక్కి పార్లమెంటు ఆవరణలో ఫోటోలు దిగారు. ఇక, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావిస్తున్నారంటూ.. సభ్యులను ప్రశంసించారు. అదేవిధంగా బాలయ్య కేంద్ర మంత్రులను కలుసుకుని హిందూపురం సమస్యలను ప్రస్తావించారు. నిధులు విడుదల చేయాలని కోరారు.
This post was last modified on July 31, 2025 7:33 pm
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…