Political News

వారంతా దోపిడీ దారులు.. జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కూట‌మి ప్ర‌భుత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వారంతా దోపిడీ దారులు.. అని ప్ర‌క‌టించారు. గ‌నులు, వ‌న‌రులు.. ఇసుక‌, మ‌ద్యం, చివ‌ర‌కు.. పేద‌లు తినే బియ్యాన్ని కూడా దోచుకుంటున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి(గ‌తంలో వైసీపీ నాయ‌కుడు)పై జ‌గ‌న్ మ‌రిన్ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. స్థానికంగా గ‌నులను ఆయ‌న సీజ్ చేసేశార‌ని.. తాను చెప్పిన వారికి మాత్ర‌మే లీజులు ఇస్తున్నార‌ని చెప్పారు.

ఇలా లీజులు తీసుకున్న‌వారి నుంచి రోజువారీ వ‌సూళ్లు చేస్తున్నార‌ని లెక్క‌ల‌తో స‌హా వివ‌రించారు. ఈ సొమ్ములో కొంత వీపీఆర్ ఉంచుకుని.. మ‌రికొంత సొమ్మును చిన్న‌బాబు నారా లోకేష్‌కు, చంద్ర‌బాబుకు పంపిస్తున్నార‌ని ఆరోపించారు. ఇక‌, జిల్లాల్లో ఎక్క‌డ చూసినా.. పేకాట క్ల‌బ్బులు అధికారికంగా ఎమ్మెల్యేలు నిర్వ‌హిస్తున్నారని.. దీనిలోనూ వాటాలు పైవాళ్ల‌కు వెళ్తున్నాయ‌ని చెప్పారు. మ‌ద్యం సిండికేట్లు ప్ర‌జ‌ల‌ను దోచేస్తున్నార‌ని.. అన‌ధికార ప‌ర్మిట్ రూమ్‌ల‌లో ఎంఆర్‌పీ క‌న్నా ఎక్కువ‌కు మ‌ద్యాన్ని విక్ర‌యించి వాటాలు పంచుకుంటున్న‌ట్టు చెప్పారు.

ఇది చాల‌ద‌న్న‌ట్టుగా.. బెల్టు షాపులు నిర్వ‌హిస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. “వీధికో బెల్ట్ షాపు పాత మాట‌. ఇప్పుడు ఇంటింటికో బెల్టు షాపు న‌డుస్తావుంది. వీటిని నిర్వ‌హించేది ఎవ‌ర‌య్యా అంటే.. టీడీపీ ఎమ్మెల్యేలే. వారికి మామూళ్లు మోస్తోంది ఎవ‌ర‌య్యా అంటే.. డీఎస్పీలు, సీఐలే. వారంతా దోచుకుని.. దౌర్జన్యంగా సొమ్ములు రాబ‌ట్టి.. ప్ర‌జ‌ల నుంచి సేక‌రించి.. తాము కొంత ఉంచుకుని.. మిగిలిన దానిలో పెద్ద‌బా బు, చిన్నబాబుల‌కు వాటాలు పంచుతున్నారు. ఇదీ.. రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న‌“ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు!

ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. సూప‌ర్ 6, సూప‌ర్ 7 వంటివి ఏనాడో పోయాయ‌ని చెప్పారు. ప్ర‌జ‌లు వాటి కోసం ఎదురు చూస్తున్నార‌ని.. కానీ.. వాటి విష‌యంలో మాయ చేస్తున్నార‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేశార‌ని అన్నారు. ఈ విష‌యాల‌పై తాము ప్ర‌శ్నిస్తున్నందుకే.. వైసీపీ నేత‌ల గొంతు నొక్కి.. కేసులు పెడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు ఆట‌లు ఎన్నాళ్లో సాగ‌బోవ‌మ‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. త్వ‌ర‌లోనే త‌మ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌న్నారు.

This post was last modified on July 31, 2025 6:47 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ భ‌లే సినిమా

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మ‌హాన‌టి త‌ర్వాత…

4 hours ago

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

6 hours ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

9 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

10 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

11 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

11 hours ago