Political News

‘రోజా.. 20 రోజుల్లో జైలుకే!`

మ‌రో ఇర‌వై రోజుల్లో వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని టీడీపీ నాయ‌కుడు, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ‌(శాప్‌) చైర్మ‌న్ రవి నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. అడ్డంగా ఆమె దోచుకున్నార‌ని చెప్పారు. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర‌ పేరుతో కోట్ల రూపాయ‌ల‌ను వెనుకేసుకున్నార‌ని ఆరోపించారు. నాటి శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్‌తో క‌లిసి రోజా కుట్ర‌లు ప‌న్నార‌ని చెప్పారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో దోచుకుందాం ఆంధ్ర‌ ను నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళ్లార‌ని విమ‌ర్శించారు.

రోజాపై ఇప్ప‌టికే అంత‌ర్గ‌త విచార‌ణ జ‌రుగుతోంద‌న్నారు. ఆనాటి ఆడుదాం ఆంధ్ర‌ ద్వారా కొనుగోలు చేసిన ఆట వ‌స్తువుల్లో ఏమాత్రం నాణ్య‌త లేద‌న్న ర‌వినాయుడు.. వీటిని కొనేందుకు.. భారీ ఎత్తున ఖ‌ర్చు చూపించార‌ని.. ఆయా త‌యారీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నార‌ని వ్యాఖ్యానించారు. మ‌ద్యం కుంభ‌కోణం ఎలా అయితే జ‌రిగిందో.. ఆడుదాం ఆంధ్ర‌లోనూ అలానే జ‌రిగింద‌ని ఆరోపించారు. రోజా ఇక‌, రోజులు లెక్క‌బెట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఎవ‌రెవ‌రికి ముడుపులు ఇచ్చారో.. ఎంతెంత దోచారో.. అంత‌ర్గ‌త విచార‌ణ సాగుతోంద‌ని.. ఇది ఒక కొలిక్కి వ‌చ్చింద‌ని చెప్పారు.

మ‌రో 20 రోజుల్లోనే రోజాకు అరెస్టు వారెంటు ఇష్యూ అవుతుంద‌ని ర‌వినాయుడు తెలిపారు. క్రీడా మంత్రిగా ఆమె ప్ర‌జ‌ల సొమ్ము తో ఆడుకున్నార‌న్నారు. రోజా లాంటి వారు.. స‌మాజానికి, ప్ర‌జ‌ల‌కు కూడా భార‌మేన‌ని.. తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. జైలుకు వెళ్లేం దుకు ఆమె రెడీగా ఉండాల‌న్నారు. ఆమెతోపాటు… సిద్ధార్థ్ రెడ్డి కూడా సిద్ధం కావాల‌ని ర‌వినాయుడు సూచించారు. ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో ఇప్పుడే చెప్ప‌లేమ‌న్నారు. కానీ.. విచార‌ణ‌లో మాత్రం సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తున్నాయ న్నారు. ప్ర‌తి విష‌యాన్నీ ఆధారాల‌తో స‌హా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు ర‌వినాయుడు చెప్పారు.

లిక్క‌ర్‌కి.. దీనికి లింకేంటి?

వైసీపీ హ‌యాంలో లిక్క‌ర్ కుంభ‌కోణం జ‌రిగింద‌ని అధికారులు తేల్చి చెప్పారు. నాసిర‌కం మ‌ద్యాన్ని ఎక్కువ ధ‌ర‌ల‌కు ప్ర‌జ‌ల‌కు విక్ర‌యించి.. అలా వ‌చ్చిన ఎక్కువ సొమ్మును కంపెనీల నుంచి కోట్ల రూపాయ‌లు ముడుపులుగా పుచ్చుకున్నార‌న్న‌ది ఈ కేసు ప్ర‌ధాన సారాంశం. అలానే.. ర‌వినాయుడు చెప్పిన‌ట్టు ఆడుదాం ఆంధ్ర లో భాగంగా నాసిర‌కం క్రీడా వ‌స్తువులు ఎక్కువ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేసి.. స‌ద‌రు కంపెనీల నుంచి మార్జిన్లు, క‌మీష‌న్ల‌ను రోజా, సిద్ధార్థ్ రెడ్డి పోగేసుకున్నార‌ని ఆయ‌న అంటున్నారు. దీనిపైనే ఇప్పుడు విచార‌ణ జ‌రుగుతోంద‌న్నారు.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

35 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

43 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago