ఏపీ సీఎం చంద్రబాబు తమ కుటుంబం పై కక్ష సాధిస్తున్నారని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించి.. జైలుకు పంపించారని అన్నారు. “ఇప్పుడు చంద్రబాబు టైం నడుస్తోంది. మాకు కూడా టైం వస్తుంది. ఇంతకు ఇంత బదులు తప్పదు” అని పెద్దిరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వైసీపీ నేతలపైనా ముఖ్యంగా తమ కుటుంబంపైనా కక్ష సాధింపు ధోరణి కొనసాగుతోందన్నారు. తన కుమారుడు ఇప్పటికి వరుసగా మూడు సార్లు ఎంపీగా విజయం సాధించారని.. ఎలాంటి మచ్చా లేదని పేర్కొన్నారు.
అయినా.. మిథున్ రెడ్డిని వేధించాలని కక్ష పూరితంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఎయిర్ పోర్ట్ మేనేజర్ను కొట్టాడని కేసు పెట్టారని.. కానీ, అది నిలబడలేదన్నారు. ఆ తర్వాత.. తనపై అటవీ భూముల కేసు అంటూ మీడియాలో హడావుడి చేశారని, కానీ.. అది కూడా నిలబడలేదని చెప్పారు. మరికొన్నాళ్లకు మదనపల్లెలో ఫైళ్లను తగల బెట్టామని బురద జల్లే ప్రయత్నాలు చేశారని.. అప్పుడు కూడా తాము న్యాయం వైపే నిలబడినట్టు పెద్దిరెడ్డి చెప్పకొచ్చారు. ఇప్పటి వరకు ఎన్నో కేసులు పెట్టినా.. తమ కుటుంబం తట్టుకుని నిలబడినట్టు పెద్దిరెడ్డి వివరించారు.
ఈ నేపథ్యంలో అసలు ఏ తప్పూ లేని లిక్కర్ పై.. కుంభకోణం అనే పేరుతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. మిథున్ రెడ్డికి జగన్ సన్నిహితుడు కావడం వల్లే.. కేసు పెట్టారని.. ఈ కేసు న్యాయ వ్యవస్థ ముందు నిలబడబోదని చెప్పారు. “మా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారు. తప్పు చేయలేదు కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు.” అని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
సజ్జల కూడా..
ఎంపీ మిథున్ రెడ్డికి జైలు విధించడం పట్ల సీనియర్ నాయకుడు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్లో ఆధారాలు లేవని సిట్ అంగీకరిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారని, వేధింపుల కోసమే ఈ తప్పుడు అరెస్ట్లు చేస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబుకు ధైర్యం ఉంటే తన హయాంలో లిక్కర్ స్కాంపై కేంద్ర దర్యాప్తు కోరాలని అన్నారు. ఈ రెండు కేసులపైనా కేంద్ర దర్యాప్తు కోసం డిమాండ్ చేయగలరా? అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేయడం గమనార్హం.
This post was last modified on July 20, 2025 9:43 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…