Political News

ముద్ర‌గ‌డ‌కు ఏమైంది.. మ‌రో సారి క్రాంతి ఎంట్రీ!

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం(రెడ్డి) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. గ‌త కొన్నాళ్లు గా తీవ్ర అనారోగ్యంతో ఉన్నార‌న్న వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. అయితే.. పూర్తి వివ‌రాలు అప్ప‌ట్లో ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. తాజాగా ముద్ర‌గ‌డ‌.. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై.. ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న కుమారుడు ముద్ర‌గ‌డ గిరి తెలిపారు. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద న్నారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు.

కాగా.. వైద్యులు తెలిపిన స‌మాచారం మేర‌కు ముద్రగడ గ‌త కొన్నాళ్లుగా కిడ్నీ ఇన్పెక్షన్, యూరిన్ ఇన్స్పెక్షన్ స‌హా ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధ ప‌డుతున్నారు. అంతేకాదు.. కొన్నాళ్లుగా ఆయ‌న కిడ్నీ స‌మ‌స్య‌కు సంబంధించి డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే.. అక‌స్మాత్తుగా శ‌నివారం రాత్రే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు.. 35కి పడిపోయాయి. దీంతో ఆయ‌న ఇంట్లోనే స్పృహ కోల్పోయారు. దీంతో ఆయ‌న‌ను స్థానికంగా ఆసుప‌త్రికి తీసుకువెళ్లినా.. మెరుగైన వైద్యం కోసం.. హైద‌రాబాద్‌కు వెళ్లాల‌ని సూచించారు.

కూతురు ఎంట్రీతో రివ‌ర్స్‌..

ముద్ర‌గడ ఆరోగ్యంపై వ‌చ్చిన వార్త‌లు తెలుసుకున్న ఆయ‌న కుమార్తె, జ‌న‌సేన నాయ‌కురాలు.. ముద్ర‌గ‌డ క్రాంతి.. తండ్రిని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చారు. దీంతో ప‌రిస్థితి మొత్తం యూట‌ర్న్ తీసుకుంది. అప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌కు తీసుకువెళ్లాల‌ని అనుకున్న గిరి ఆయ‌న‌ను కాకినాడ‌కే ప‌రిమితం చేశారు. అంతేకా దు.. సోద‌రి క్రాంతిపై గిరి ప‌రుషంగా వ్య‌వ‌హ‌రించార‌ని తెలుస్తోంది. ఎవ‌రూ రావ‌డానికి వీల్లేద‌ని.. త‌న సోద రితో త‌న‌కు ఎలాంటి బంధుత్వం లేద‌ని ఆయ‌న తెగేసి చెప్పారు. తన అనుమతి లేనిదే తండ్రి దగ్గరికి ఎవరినీ పంపొద్దని కూడా ఆస్పత్రి వ‌ర్గాల‌కు గిరి తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో క్రాంతి తండ్రిని చూడ‌కుండా నే వెనుదిరిగారు.

This post was last modified on July 20, 2025 3:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

16 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

18 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago