వైసీపీ కేసుల స్టోరీ ఇంకా ముగియలేదా? ఆ పార్టీ నాయకులు చేసిన పాపాలు ఇంకా వెంటాడుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు మద్యం కుంభకోణం కేసులో కీలక నాయకులు, గతంలో జగన్ దగ్గర పనిచేసిన ఉన్నతాధికారులు అరెస్టయి జైళ్లకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి వంతు వచ్చింది. ఈయనను కూడా అరెస్టు చేశారు. ఇక, ఇదే కేసులో మాజీ మంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కిళత్తూరు నారాయణ స్వామి వంతు కూడా వచ్చింది.
జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణ స్వామి పనిచేశారు. అయితే.. ఆయనను ముందు పెట్టి కథ మొత్తాన్నీ కీలక నాయకులు, అధికారులు నడిపించారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా .. కూడా ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చి.. విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో నారాయణ స్వామి కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక, గత నెలలో జగన్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే..ఈ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షలను లెక్క చేయకుండా.. వైసీపీ నాయకులు వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. బారీ ఎత్తున కార్యకర్తలను సమీకరించడం తో పాటు.. వివాదాలకు కూడా దారితీశారు. రప్పా రప్పా పోస్టర్లతో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించా రు. ఆయా వ్యవహరాలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీకి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆదేశించారు. రెంటపాళ్లలో ఎంత మందిని సమీకరించారు? మీ పాత్ర ఏంటన్నది ఆమెనుంచి రాబట్టనున్నారు. ఇక, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కూడా ఇదే కేసులో పోలీసులు ఆదివారం నోటీసులు ఇష్యూ చేశారు. సోమవారం విచారణకు రావాలని.. ఆదేశించారు. కార్యకర్తలను మోహరించడంతోపాటు.. పోలీసులపై దురుసుగా వ్యవహరించారన్న కేసులు ఆయనపై నమోదు చేశారు.
This post was last modified on July 20, 2025 3:26 pm
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…