వైసీపీ కీలక నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వైసీపీ మద్యం కుంభకోణాన్ని విచారి స్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అరెస్టు చేసేందుకు ఆగమేఘాలపై నిర్ణయాలు తీసు కుంటున్నారు. ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టుల్లో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు రద్దయిపోవడంతో.. మరో సారి ఆయన తప్పించుకోకుండా.. చూసేలా సిట్ అధికారులు స్థానిక కోర్టులో అరెస్టుపై వారెంట్ జారీ కోసం.. మెమో దాఖలు చేశారు.
ప్రస్తుతం మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆయన అరెస్టు కోసం కోర్టు నుంచి వారెంటు తీసుకోవా లి. దీనిని పార్లమెంటు స్పీకర్ ఓంబిర్లా కార్యాలయానికి పంపించి.. అక్కడ నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ.. వాయువేగ మనోవేగాలతో అధికారులు పూర్తి చేస్తున్నారు. వాస్తవానికి స్థానిక కోర్టులో అరెస్టు కోసం మెమో దాఖలు చేసినా.. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను..తమకు సమర్పించాలని స్థానిక కోర్టు సిట్ అదికారులను కోరింది. దీంతో ఆయా తీర్పుల కాపీలను అధికారులు సేకరించే పనిలో ఉన్నారు.
ఇది పూర్తయితే.. స్థానిక కోర్టు మెమో ను పరిశీలించి.. అరెస్టుకు వారెంటు జారీ చేసే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. మరోవైపు.. ఈ కేసులో 4వ నిందితుడుగా ఉన్న మిథున్ రెడ్డి.. శనివారం.. సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఇతర ఎంపీలతో కలిసి విజయవాడకు చేరుకున్న మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో సిట్ అధికారులు ఆయనను మధ్యాహ్నం 1 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో మాస్టర్ మైండ్ సహా.. నిధులు దారి మళ్లించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్థానిక కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…