వైసీపీ కీలక నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వైసీపీ మద్యం కుంభకోణాన్ని విచారి స్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అరెస్టు చేసేందుకు ఆగమేఘాలపై నిర్ణయాలు తీసు కుంటున్నారు. ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టుల్లో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు రద్దయిపోవడంతో.. మరో సారి ఆయన తప్పించుకోకుండా.. చూసేలా సిట్ అధికారులు స్థానిక కోర్టులో అరెస్టుపై వారెంట్ జారీ కోసం.. మెమో దాఖలు చేశారు.
ప్రస్తుతం మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆయన అరెస్టు కోసం కోర్టు నుంచి వారెంటు తీసుకోవా లి. దీనిని పార్లమెంటు స్పీకర్ ఓంబిర్లా కార్యాలయానికి పంపించి.. అక్కడ నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ.. వాయువేగ మనోవేగాలతో అధికారులు పూర్తి చేస్తున్నారు. వాస్తవానికి స్థానిక కోర్టులో అరెస్టు కోసం మెమో దాఖలు చేసినా.. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను..తమకు సమర్పించాలని స్థానిక కోర్టు సిట్ అదికారులను కోరింది. దీంతో ఆయా తీర్పుల కాపీలను అధికారులు సేకరించే పనిలో ఉన్నారు.
ఇది పూర్తయితే.. స్థానిక కోర్టు మెమో ను పరిశీలించి.. అరెస్టుకు వారెంటు జారీ చేసే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. మరోవైపు.. ఈ కేసులో 4వ నిందితుడుగా ఉన్న మిథున్ రెడ్డి.. శనివారం.. సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఇతర ఎంపీలతో కలిసి విజయవాడకు చేరుకున్న మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో సిట్ అధికారులు ఆయనను మధ్యాహ్నం 1 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో మాస్టర్ మైండ్ సహా.. నిధులు దారి మళ్లించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్థానిక కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
This post was last modified on July 20, 2025 5:48 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…