ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి చీపురు పట్టారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రతి నెలా మూడో శనివారం రాష్ట్రంలో నిర్వ హిస్తున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం చంద్రబాబు.. తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కపిలేశ్వరస్వామి(తిరుమల అలిపిరి వద్ద ఉంటుంది) ఆలయాన్ని సందర్శించారు. తొలుత స్వామిని దర్శించిప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. అక్కడే పారిశుధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. సుమారు గంటన్నర పాటు.. పరిశరాలను ఆయన శుభ్రం చేసి..కార్మికులతో కలివిడిగా మాట్లాడారు.
వారి సమస్యలు తెలుసుకున్నారు. గతంలోనూ.. సీఎం చంద్రబాబు.. పారిశుద్ధ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రతి నెలా మూడో శనివారం ఏదొ ఒక జిల్లాను ఎంపిక చేసుకుని అక్కడ పర్యటించి.. పారిశుధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతు న్నారు. ప్రధానంగా.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, అనంతపురం వంటి ముఖ్య జిల్లాల్లో నిషేధించారు. అయితే.. ఇది అక్టోబరు 2 నుంచి అమలు చేయనున్నారు. ఈ మధ్య కాలంలో దీనిపై ప్రజల కు సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై కూడా చంద్రబాబు స్థానికులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించామన్నారు. తద్వారా భూతాపాన్ని తగ్గిం చేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. దీనిని అందరూ అర్ధం చేసుకోవాలని, అక్టోబరు 2 తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే పరిశ్రమలు.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చా క.. స్వచ్ఛ సర్వేక్షణ్లో కేంద్రం 5 ప్రతిష్టాత్మక అవార్డులు తమకు ఇచ్చిందన్నారు.
This post was last modified on July 20, 2025 5:49 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…