తనను సొంత పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచారని.. బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా ఆయన పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో గత 2023 ఎన్నికల్లో జరిగిన పరిణామాలు సహా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కూడా వివరించారు. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు.. ఆయనకు మధ్య వివాదాలు ముసురుకున్న విషయం తెలిసిందే. హుజూరాబాద్లో ఈటలకు చెక్ పెట్టే విధంగా మంత్రి వ్యవహరిస్తున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
2023 ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి తాను పోటీ చేసినప్పుడు.. సొంత పార్టీ నాయకులే తనకు వెన్నుపోటు పొడిచారని ఈటల వ్యాఖ్యానించారు. అయినా.. తాను ప్రజల మనసులు గెలుచుకుని ఎంపీగా విజయం దక్కించుకున్నానన్నారు. వ్యక్తుల పై తాను ఎప్పుడూ ఆధారపడలేదన్న ఆయన.. పార్టీని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని చెప్పారు. కార్యకర్తలే తనకు కొండంత బలమని ఈటల వ్యాఖ్యానించారు. వారిని కూడా తనకు దూరం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు.
తనపైనా.. తన కుటుంబంపైనా కూడా.. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తూ.. తన ఇమేజ్కు భంగం కలిగించేలా కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే..ఎక్కడా ఎవరి పేరును ఈటల ప్రస్తావించలేదు. బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి చాలానే కారణాలు ఉన్నాయన్నారు. అయితే..ఎక్కడ ఉన్నా.. ఆ పార్టీ బాగుండాలని.. కార్యకర్తలు ప్రజలు బాగుండాలని తాను కోరుకుంటానని ఈటల వ్యాఖ్యానించారు. తాను పదవుల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదన్నారు. పదవుల కోసం పార్టీలు మారలేదని చెప్పారు.
“గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్కు నా నిర్ణయాలు మొహమాటం లేకుండా చెప్పాను. గతంలో హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ప్రజల ఆత్మగౌరవం గెలిచింది. నేను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తున్నా. కానీ.. కొందరికి ఇది నచ్చడం లేదు. అయినా.. నేను ప్రజలనే నమ్ముకున్నా.. నా కార్యకర్తలే నాబలం” అని ఈటల తేల్చి చెప్పారు.
This post was last modified on July 19, 2025 2:43 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…