ఏపీ సీఎం చంద్రబాబు.. వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఆయన స్పందించారు. పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు వైసీపీ మద్యం కుంభకోణం.. ఈ కేసును విచారి స్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు, వారు చేస్తున్న అరెస్టులు వంటివాటిని ప్రస్తావించారు.
ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చిందని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు కూడా వెనక్కి తగ్గిన విషయాన్ని ప్రస్తావించారు. బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు వెనక్కి తగ్గాయంటే.. కేసు తీవ్రత ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు.
ఈ క్రమంలో అసలు దొంగలు దొరుకుతున్నారని, ముఖ్యంగా గత పాలకుడు(జగన్) కూడా దొరికిపోయాడని చంద్రబాబు చెప్పారు. దీనిని వదిలి పెట్టేది లేదన్న ఆయన.. త్వరలోనే దీనిని ప్రజలకు వివరించేందుకు నాయకులు ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు.
ఇప్పటి వరకు తాను మాట్లాడకపోవడానికి కారణం.. సిట్ విచారణ జరుగుతుండడమేనని, తాను ఏం చెప్పినా.. ఆ ప్రభావం విచారణపై పడుతుందన్న ఉద్దేశంతోనే మాట్లాడలేదన్నారు. ఇప్పుడు అంతా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
జగన్ తాను.. తప్పులు చేసి.. వాటిని టీడీపీ నేతల పైనా.. తనపైనా వేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయంలో నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ.. విష ప్రచారం చేస్తున్న జగన్ను, ఆయన పరివారాన్ని ఎక్కడికక్కడ నిలువరించాలన్నారు.
ఈ విషయంలో ఎవరూ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అవసరమైతే.. పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ మద్యం కుంభకోణం విషయాన్ని కూడా లేవనెత్తి.. చర్చకు పెట్టాలన్నారు. సిట్ కూడా.. త్వరలోనే నివేదిక ఇస్తుందన్న చంద్రబాబు.. జగన్ చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి ఎప్పటికప్పుడు.. కౌంటర్ ఇచ్చేలా నాయకులు వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.
This post was last modified on July 19, 2025 11:11 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…