Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు..సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారుకు మద్దతు ఇస్తున్న టీడీపీ.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. సహా ఇతర పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేవారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పైపార్లమెంటులో చర్చకు పెట్టాలని సూచించారు.
అలాగే.. 9 ప్రధాన అంశాలతో కూడిన అజెండాను ఎంపీలకు అందించారు. పార్లమెంటు సమావేశాల్లో బనకచర్ల ప్రాజెక్టు సహా.. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం ప్రాజెక్టులపై చర్చించి.. నిధులు తెచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు వచ్చేలాకేంద్ర సహకారాన్ని కూడా.. పార్లమెంటు సమావేశాల్లోనే రాబట్టాలని తెలిపారు. అలాగే.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని.. ఈ విషయాన్ని పార్లమెంటు వేదికగా చర్చిస్తే.. దేశవ్యాప్తంగా అందరికీ తెలుస్తుందని.. ఆ బాధ్యతలను పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు చూడాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో మహిళా నేతలపై వైసీపీ నాయకులు అసభ్య ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయాన్ని కూడా పార్లమెంటులో చర్చకు పెట్టి వైసీపీని ఎండగట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతి అభివృద్ధికి చర్యలు, మామిడిరైతులపై పార్లమెంటులో చర్చ పెట్టడం ద్వారా సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్పా రు. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు రాబట్టేలా.. ఎంపీలు వ్యవహరించాలన్నారు. కేంద్ర ప్రవేశ పెట్టిన… కొత్తగా తీసుకువస్తున్న కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని.. వాటిని కూడా ప్రస్తావించి.. కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా ప్రయత్నించాలని సూచించారు.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…