Political News

చెప్పి ఒప్పిద్దాం.. అమ‌రావ‌తిపై బాబు డెసిష‌న్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని జాతీయ స్థాయిలో కాకుండా.. అంత‌ర్జాతీయ స్థాయికి విస్త‌రించాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న ప్లాన్ వేరైతే.. ఇప్పుడు దానిని హైలెవిల్‌కు తీసుకు వెళ్లారు. ఐటీ, ఏఐ, క్వాంట‌మ్ వ్యాలీ స‌హా.. అనేక రంగాల‌కు.. అమ‌రావ‌తిని హ‌బ్‌గా మార్చాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పం. ఈ క్ర‌మంలోనే.. ఇప్ప‌టికే తీసుకున్న 34 వేల ఎక‌రాల‌కు అనుబంధంగా మ‌రో 44 వేల ఎక‌రాల‌ను సమీక‌రించేందుకు(పూలింగ్‌) సిద్ధ‌మ‌య్యారు.

అయితే.. దీనికి సంబంధించి 20 వేల ఎక‌రాలు మాత్ర‌మే ఇచ్చేందుకు రైతులు ముందుకు వ‌చ్చారు. మిగిలిన 24 వేల ఎక‌రాల సంగ‌తి సందిగ్ధంలో ప‌డింది. రైతులు దీనిని ఇచ్చేందుకు ముందుకు రావ‌డం లేదు. పైగా.. కేసులు వేసేందుకు రెడీ అవుతున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం భూస‌మీక‌ర‌ణ‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల‌లో సీఎం చంద్ర‌బాబు సింగపూర్ వెళ్లేలోపే దీనిపై ఒక నిర్ణ‌యం తీసుకుంటారు. కొత్త‌గా తీసుకునే భూమిని తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల నుంచి సమీక‌రించాల‌ని నిర్ణ‌యించారు.

ఈ నేప‌థ్యంలో అక్క‌డ గ్రామ స‌భ‌లు కూడా నిర్వ‌హించారు. కానీ, ఏడు గ్రామాల్లో 3 ముందుకు వ‌చ్చి.. భూములు ఇచ్చేందుకు ఓకే చెప్పినా.. మిగిలిన 4 గ్రామాల్లోనే వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. అయితే.. వీరిని బ‌ల‌వంతంగా దారికి తెచ్చుకునేందుకు సీఎం చంద్ర‌బాబు ససేమిరా అంటున్నారు. వారిని న‌యాన ఒప్పించి.. అమ‌రావ‌తికి సంబంధించిన భూములు తీసుకుందామ‌ని ఆయ‌న మంత్రి వ‌ర్గానికి తేల్చి చెప్పారు. ఇదే విష‌యంపై సీఆర్డీఏ అధికారులు స‌హా.. జిల్లా కలెక్ట‌ర్‌కు కూడా వివ‌రించారు. రైతుల‌ను బెదిరించో.. బాధ పెట్టో భూములు తీసుకోవ‌డం మంచిది కాద‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

ఈ నేప‌థ్యంలో ఈనెలాఖరులోపే పూలింగు నోటిఫికేషన్ ఇచ్చి.. దీనికి ముందు రైతుల‌తో స‌మావేశం కావాల‌ని.. కూట‌మి పార్టీల నాయ‌కుల‌ను కూడా క‌లుపుకొని వెళ్లి రైతుల‌ను ఒప్పించి భూములు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.న ఒక్కో రెవెన్యూ గ్రామానికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ల నియామక ప్రక్రియను వేగవంతం చేశారు. వీరిని ప్ర‌తి రైతుతో ప్ర‌త్యేకంగా మాట్లాడించి.. రైతుల‌ను ఒప్పించాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహం. త‌ద్వారా.. వివాద ర‌హితంగా భూములు తీసుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.

This post was last modified on July 18, 2025 3:05 pm

Share

Recent Posts

రామాయ‌ణం.. ర‌ణ‌బీర్… ర‌బ్బ‌ర్ చెప్పులు

పురాణ గాథ‌ల‌ను తెర‌కెక్కించేట‌పుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని తెర‌పైకి తీసుకురావ‌డం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విష‌యం…

1 hour ago

జ‌గ‌న్ భద్రతపై వైసీపీ నేతల ఆందోళన

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా బుధ‌వారం తూర్పుగోదావ‌రి జిల్లా దేవ‌ర‌ప‌ల్లిలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి పొగాకు రైతుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. తొలుత…

1 hour ago

ఆన్ లైన్లో తండ్రి అంత్యక్రియలకు హాజరు

రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…

1 hour ago

దర్శకుడు చనిపోయినా సినిమా బ్రతుకుతోంది

ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా…

2 hours ago

రాజ్యసభలో జగన్ కేసులను ప్రస్తావించిన టీడీపీ యువ రక్తం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…

2 hours ago

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…

5 hours ago