Political News

చెప్పి ఒప్పిద్దాం.. అమ‌రావ‌తిపై బాబు డెసిష‌న్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని జాతీయ స్థాయిలో కాకుండా.. అంత‌ర్జాతీయ స్థాయికి విస్త‌రించాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న ప్లాన్ వేరైతే.. ఇప్పుడు దానిని హైలెవిల్‌కు తీసుకు వెళ్లారు. ఐటీ, ఏఐ, క్వాంట‌మ్ వ్యాలీ స‌హా.. అనేక రంగాల‌కు.. అమ‌రావ‌తిని హ‌బ్‌గా మార్చాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పం. ఈ క్ర‌మంలోనే.. ఇప్ప‌టికే తీసుకున్న 34 వేల ఎక‌రాల‌కు అనుబంధంగా మ‌రో 44 వేల ఎక‌రాల‌ను సమీక‌రించేందుకు(పూలింగ్‌) సిద్ధ‌మ‌య్యారు.

అయితే.. దీనికి సంబంధించి 20 వేల ఎక‌రాలు మాత్ర‌మే ఇచ్చేందుకు రైతులు ముందుకు వ‌చ్చారు. మిగిలిన 24 వేల ఎక‌రాల సంగ‌తి సందిగ్ధంలో ప‌డింది. రైతులు దీనిని ఇచ్చేందుకు ముందుకు రావ‌డం లేదు. పైగా.. కేసులు వేసేందుకు రెడీ అవుతున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం భూస‌మీక‌ర‌ణ‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల‌లో సీఎం చంద్ర‌బాబు సింగపూర్ వెళ్లేలోపే దీనిపై ఒక నిర్ణ‌యం తీసుకుంటారు. కొత్త‌గా తీసుకునే భూమిని తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల నుంచి సమీక‌రించాల‌ని నిర్ణ‌యించారు.

ఈ నేప‌థ్యంలో అక్క‌డ గ్రామ స‌భ‌లు కూడా నిర్వ‌హించారు. కానీ, ఏడు గ్రామాల్లో 3 ముందుకు వ‌చ్చి.. భూములు ఇచ్చేందుకు ఓకే చెప్పినా.. మిగిలిన 4 గ్రామాల్లోనే వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. అయితే.. వీరిని బ‌ల‌వంతంగా దారికి తెచ్చుకునేందుకు సీఎం చంద్ర‌బాబు ససేమిరా అంటున్నారు. వారిని న‌యాన ఒప్పించి.. అమ‌రావ‌తికి సంబంధించిన భూములు తీసుకుందామ‌ని ఆయ‌న మంత్రి వ‌ర్గానికి తేల్చి చెప్పారు. ఇదే విష‌యంపై సీఆర్డీఏ అధికారులు స‌హా.. జిల్లా కలెక్ట‌ర్‌కు కూడా వివ‌రించారు. రైతుల‌ను బెదిరించో.. బాధ పెట్టో భూములు తీసుకోవ‌డం మంచిది కాద‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

ఈ నేప‌థ్యంలో ఈనెలాఖరులోపే పూలింగు నోటిఫికేషన్ ఇచ్చి.. దీనికి ముందు రైతుల‌తో స‌మావేశం కావాల‌ని.. కూట‌మి పార్టీల నాయ‌కుల‌ను కూడా క‌లుపుకొని వెళ్లి రైతుల‌ను ఒప్పించి భూములు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.న ఒక్కో రెవెన్యూ గ్రామానికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ల నియామక ప్రక్రియను వేగవంతం చేశారు. వీరిని ప్ర‌తి రైతుతో ప్ర‌త్యేకంగా మాట్లాడించి.. రైతుల‌ను ఒప్పించాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహం. త‌ద్వారా.. వివాద ర‌హితంగా భూములు తీసుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.

Satya

Recent Posts

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

2 hours ago

బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…

6 hours ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

8 hours ago

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…!

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…

8 hours ago

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

8 hours ago

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

8 hours ago