ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి.. కీలక మార్పులు తెరమీదికి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు అమరావతి అంటే.. కేవలం ప్రభుత్వ కార్యాలయాలు.. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు.. అధికారుల నివాసాలకే పరిమితమని అనుకున్నారు. అసలు వాస్తవ ప్లాన్ కూడా అక్కడికే పరిమితం అయింది. కానీ, ఇప్పుడు ఈ ప్రణాళిక పూర్తిగా మారనుంది. గతంలో చేపట్టిననిర్మాణాలు.. వేసిన ప్లాన్లు అలానే సాగినా.. ఇప్పుడు సేకరించనున్న 44 వేల ఎకరాల్లో చేసే నిర్మాణాలు.. అదేవిధంగా ఇప్పటికే తీసుకున్న భూములకు సంబంధించి వేసిన ప్లాన్లలో కొన్ని మారనున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
తాజాగా అమరావతి అభివృద్ధి, ఆర్థిక పరమైన సంస్థల నిర్మాణాలపై టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో ఇచ్చిన స్వర్ణాంధ్ర-2047లో కీలక ప్రాజెక్టులను కొత్తగా ప్రతిపాదించారు. వీటిలో హైటెక్ సిటీ, ఏఐ యూనివర్సిటీ, సెమీ కండెక్టర్ల నిర్మాణ సంస్థలు వంటివి ఉన్నాయి. అదేవిధంగా దేశ రక్షణ రంగానికి సంబంధించిన పలు సంస్థలు కూడా ఉన్నాయి. వీటిని ఇక్కడ డెవలప్ చేయాలన్నది టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది. అమరావతిని అంతర్జాతీయస్థాయికి చేర్చాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు.. సెమీకండెక్టర్ల నిర్మాణ సంస్థలను అమరావతిలో ఏర్పాటు చేయడాన్ని టాస్క్ ఫోర్స్ ప్రధానంగా ప్రస్తావించింది.
ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీని మించి.. అమరావతిలో హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలన్న సంకల్పం కూడా.. దీనిలోనే ఉంది. తద్వారా.. అమరావతి అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. అలానే.. ఐటీ పార్కులను అమరావతిలో ఏర్పాటు చేయడం కాకుండా.. తిరుపతి, విశాఖ, అనంతపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని టాస్క్ ఫోర్స్ ప్రతిపాదించింది. అలాగే ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా పేర్కొంది. ఈ ప్రతిపాదనలు సాకారం అయితే.. అమరావతి ఇప్పుడు అనుకుంటున్న దానికంటే కూడా.. ఎక్కువ ఖ్యాతిని సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
This post was last modified on July 18, 2025 9:30 am
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…