Political News

రోశ‌య్యకు చేశారు.. వైఎస్ మాటేంటి:  ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. కొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. మంగ‌ళ‌వారం త‌న తండ్రి, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 76వ జ‌యంతిని పుర‌స్కరించుకుని ష‌ర్మిల తెలంగాణ ప్ర‌భుత్వానికి కొత్త ప్ర‌తిపాద‌న చేశారు. ఇటీవ‌ల కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి కొణిజేటి రోశ‌య్య‌కు తెలంగాణ ప్ర‌భుత్వం స‌మున్న‌త గౌర‌వం ఇచ్చింద‌ని.. ఇది తెలుగు వారిగా అంద‌రికీ సంతోష‌క‌ర‌మేన‌ని చెప్పారు. రోశ‌య్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించార‌ని.. ఆయ‌న పేరుతో స్మార‌క అవార్డుల‌ను కూడా ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు.

ఈ నేప‌థ్యంలో ఏపీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని విస్మ‌రించ‌డం స‌రికాద‌ని.. ష‌ర్మిల పేర్కొన్నారు. సుదీర్ఘ పాద‌యాత్ర చేయ‌డం ద్వారా.. 2004లో ఉమ్మ‌డి ఏపీలో రాజ‌శేఖ‌ర‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చార‌ని తెలిపారు. అనంత‌ర కాలంలో ఎన్నో పార్టీలు కూట‌మిగా వ‌చ్చినా.. కాంగ్రెస్‌ను మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునేలా చేశార‌ని అన్నారు. ఆరోగ్య‌శ్రీ, ఇందిర‌మ్మ ఇళ్లు, ఫీజు రీయింబ‌ర్సు మెంటు వంటి కీల‌క ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టి.. కాంగ్రెస్ పాల‌న‌ను పేద‌ల‌కు చేరువ చేశార‌న్నారు.

ఈ నేప‌థ్యంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ్ఞాప‌కార్ధం.. హైద‌రాబాద్‌లో స్మృతి వ‌నాన్ని ఏర్పాటు చేయాల‌ని ష‌ర్మి ల కోరారు. హైద‌రాబాద్‌లో స్మృతి వ‌నం ఏర్పాటు చేయ‌డ‌మే ఆయ‌న‌కు నిజ‌మైన నివాళి అని పేర్కొన్నా రు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకోవాల‌ని అభ్య‌ర్థించారు. ఇది త‌న కోరిక మాత్ర‌మే కాద‌ని.. యావ‌త్ కాంగ్రెస్ నాయ‌కుల అభిలాష కూడా అని పేర్కొన్నారు. దీనిపై తాను ఇప్ప‌టికే పార్టీ అగ్ర‌నాయ‌కు రాలు సోనియాగాంధీకి లేఖ రాసిన‌ట్టు ష‌ర్మిల‌ తెలిపారు. త‌న డిమాండ్‌పై సీఎం రేవంత్ రెడ్డి త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆశిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

This post was last modified on July 8, 2025 5:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago