Political News

రోశ‌య్యకు చేశారు.. వైఎస్ మాటేంటి:  ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. కొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. మంగ‌ళ‌వారం త‌న తండ్రి, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 76వ జ‌యంతిని పుర‌స్కరించుకుని ష‌ర్మిల తెలంగాణ ప్ర‌భుత్వానికి కొత్త ప్ర‌తిపాద‌న చేశారు. ఇటీవ‌ల కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి కొణిజేటి రోశ‌య్య‌కు తెలంగాణ ప్ర‌భుత్వం స‌మున్న‌త గౌర‌వం ఇచ్చింద‌ని.. ఇది తెలుగు వారిగా అంద‌రికీ సంతోష‌క‌ర‌మేన‌ని చెప్పారు. రోశ‌య్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించార‌ని.. ఆయ‌న పేరుతో స్మార‌క అవార్డుల‌ను కూడా ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు.

ఈ నేప‌థ్యంలో ఏపీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని విస్మ‌రించ‌డం స‌రికాద‌ని.. ష‌ర్మిల పేర్కొన్నారు. సుదీర్ఘ పాద‌యాత్ర చేయ‌డం ద్వారా.. 2004లో ఉమ్మ‌డి ఏపీలో రాజ‌శేఖ‌ర‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చార‌ని తెలిపారు. అనంత‌ర కాలంలో ఎన్నో పార్టీలు కూట‌మిగా వ‌చ్చినా.. కాంగ్రెస్‌ను మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునేలా చేశార‌ని అన్నారు. ఆరోగ్య‌శ్రీ, ఇందిర‌మ్మ ఇళ్లు, ఫీజు రీయింబ‌ర్సు మెంటు వంటి కీల‌క ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టి.. కాంగ్రెస్ పాల‌న‌ను పేద‌ల‌కు చేరువ చేశార‌న్నారు.

ఈ నేప‌థ్యంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ్ఞాప‌కార్ధం.. హైద‌రాబాద్‌లో స్మృతి వ‌నాన్ని ఏర్పాటు చేయాల‌ని ష‌ర్మి ల కోరారు. హైద‌రాబాద్‌లో స్మృతి వ‌నం ఏర్పాటు చేయ‌డ‌మే ఆయ‌న‌కు నిజ‌మైన నివాళి అని పేర్కొన్నా రు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకోవాల‌ని అభ్య‌ర్థించారు. ఇది త‌న కోరిక మాత్ర‌మే కాద‌ని.. యావ‌త్ కాంగ్రెస్ నాయ‌కుల అభిలాష కూడా అని పేర్కొన్నారు. దీనిపై తాను ఇప్ప‌టికే పార్టీ అగ్ర‌నాయ‌కు రాలు సోనియాగాంధీకి లేఖ రాసిన‌ట్టు ష‌ర్మిల‌ తెలిపారు. త‌న డిమాండ్‌పై సీఎం రేవంత్ రెడ్డి త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆశిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

This post was last modified on July 8, 2025 5:17 pm

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

42 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

1 hour ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago