Political News

అమ‌రావ‌తిని వ‌ద‌ల‌ని జ‌గ‌న్ పాపం..

వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఏ విధంగా వ్యవహరించిందీ అందరికీ తెలిసిందే. వాస్తవానికి 2014 -2019 మధ్య విపక్షంలో ఉన్న వైసిపి అమరావతి రాజధానికి మద్దతు పలికి, అసెంబ్లీ సాక్షిగా రాజ‌ధానికి అనుకూలంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం నాలుగో దఫా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అసెంబ్లీ సాక్షిగా దీనిని నిరూపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో విపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతి రాజధానికి మద్దతిస్తున్నామని, 33 వేల ఎకరాలు చాలదు.. మరింత తీసుకోవాలని చెప్పిన విషయాన్ని కూడా అసెంబ్లీలో టెలికాస్ట్ చేసి చూపించారు.

కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా అటక ఎక్కించడంతోపాటు మూడు రాజధానుల జపాన్ని పాటించారు. ఫలితంగా అమరావతి రైతులకు ఇవ్వవలసిన రిటర్నబుల్ ఫ్లాట్లు సహా వారికి ఇవ్వవలసిన కౌలు సహా విద్య వైద్య రంగాల్లో ఉచిత సేవలను పూర్తిగా విస్మరించారు. ఇది ఒక భాగం అయితే.. ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా జగన్ పాపం, ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలు వంటివి రాజధానిని, రాజధాని రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రైతులకు ఇవ్వవలసిన ఆర్థిక ప్రయోజనాలను తొక్కి పెట్టిన కారణంగా ఇప్పుడు వాటిని వడ్డీతో సహా చెల్లించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.

దీనివల్ల సుమారు 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం పై అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా అంతర్జాతీయ విమానాశ్రయం ఇతర పెట్టుబడిదారుల సంస్థలకు కేటాయించాలని నిర్ణయించుకున్న భూములకు సంబంధించి మరిన్ని భూములను సేకరించే ప్రక్రియ కూడా జగన్ కారణంగా వెనకబడుతోంది. గతంలో భూములు తీసుకున్న రైతులకు ఇప్పటివరకు న్యాయం చేయలేదని, ఇప్పుడు తమ నుంచి తీసుకునే భూములకు ఏ మేరకు న్యాయం చేస్తారని రైతులు ప్రశ్నించటం వెనుక ఇదే కారణం స్పష్టంగా కనిపిస్తుంది.

దీనికి ప్రభుత్వం వైపు నుంచి కూడా సమాధానం స్పష్టంగా కనిపించడం లేదు. మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది అని చెబుతున్నా.. రైతుల్లో మనసికంగా ఆందోళన అయితే నెలకొంది. దీనిని తొలగించి కూటమి పార్టీలు గట్టిగా నిలబడి రైతులకు హామీ ఇస్తే తప్ప మరో 44 వేల ఎకరాల భూములను సేకరించాలి లేదా సమీకరించాలి అని పెట్టుకున్న లక్ష్యం ముందుకు సాగే అవకాశం అయితే కనిపించడం లేదనేది పరిశీలకులు చెబుతున్న మాట. ప్రస్తుతం అదనపు సమీకరణ విషయంలో ఒక్క టీడీపీ నాయకులు టిడిపి మంత్రులు మినహా కూటమిలోని బిజెపి, జనసేన నాయకులు ఎవరు జోక్యం చేసుకోకపోవడం వారు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం ప్రస్తుతం అనేక ప్రశ్నలకు కేరాఫ్ గా మారింది.

ఇది కూడా రైతుల ఆందోళనకు కారణంగా మారుతుంది. దీనిని బట్టి కూటమి నాయకులు ఐక్యంగా ఉండి రైతులను ఒప్పించగలిగితే అమరావతి రాజధానిని వెంటాడుతున్న జగన్ భయం తొలగిపోయి రైతులు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 8, 2025 5:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

3 hours ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

3 hours ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

3 hours ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

3 hours ago

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

5 hours ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

6 hours ago