Political News

అమ‌రావ‌తిని వ‌ద‌ల‌ని జ‌గ‌న్ పాపం..

వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఏ విధంగా వ్యవహరించిందీ అందరికీ తెలిసిందే. వాస్తవానికి 2014 -2019 మధ్య విపక్షంలో ఉన్న వైసిపి అమరావతి రాజధానికి మద్దతు పలికి, అసెంబ్లీ సాక్షిగా రాజ‌ధానికి అనుకూలంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం నాలుగో దఫా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అసెంబ్లీ సాక్షిగా దీనిని నిరూపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో విపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతి రాజధానికి మద్దతిస్తున్నామని, 33 వేల ఎకరాలు చాలదు.. మరింత తీసుకోవాలని చెప్పిన విషయాన్ని కూడా అసెంబ్లీలో టెలికాస్ట్ చేసి చూపించారు.

కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా అటక ఎక్కించడంతోపాటు మూడు రాజధానుల జపాన్ని పాటించారు. ఫలితంగా అమరావతి రైతులకు ఇవ్వవలసిన రిటర్నబుల్ ఫ్లాట్లు సహా వారికి ఇవ్వవలసిన కౌలు సహా విద్య వైద్య రంగాల్లో ఉచిత సేవలను పూర్తిగా విస్మరించారు. ఇది ఒక భాగం అయితే.. ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా జగన్ పాపం, ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలు వంటివి రాజధానిని, రాజధాని రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రైతులకు ఇవ్వవలసిన ఆర్థిక ప్రయోజనాలను తొక్కి పెట్టిన కారణంగా ఇప్పుడు వాటిని వడ్డీతో సహా చెల్లించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.

దీనివల్ల సుమారు 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం పై అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా అంతర్జాతీయ విమానాశ్రయం ఇతర పెట్టుబడిదారుల సంస్థలకు కేటాయించాలని నిర్ణయించుకున్న భూములకు సంబంధించి మరిన్ని భూములను సేకరించే ప్రక్రియ కూడా జగన్ కారణంగా వెనకబడుతోంది. గతంలో భూములు తీసుకున్న రైతులకు ఇప్పటివరకు న్యాయం చేయలేదని, ఇప్పుడు తమ నుంచి తీసుకునే భూములకు ఏ మేరకు న్యాయం చేస్తారని రైతులు ప్రశ్నించటం వెనుక ఇదే కారణం స్పష్టంగా కనిపిస్తుంది.

దీనికి ప్రభుత్వం వైపు నుంచి కూడా సమాధానం స్పష్టంగా కనిపించడం లేదు. మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది అని చెబుతున్నా.. రైతుల్లో మనసికంగా ఆందోళన అయితే నెలకొంది. దీనిని తొలగించి కూటమి పార్టీలు గట్టిగా నిలబడి రైతులకు హామీ ఇస్తే తప్ప మరో 44 వేల ఎకరాల భూములను సేకరించాలి లేదా సమీకరించాలి అని పెట్టుకున్న లక్ష్యం ముందుకు సాగే అవకాశం అయితే కనిపించడం లేదనేది పరిశీలకులు చెబుతున్న మాట. ప్రస్తుతం అదనపు సమీకరణ విషయంలో ఒక్క టీడీపీ నాయకులు టిడిపి మంత్రులు మినహా కూటమిలోని బిజెపి, జనసేన నాయకులు ఎవరు జోక్యం చేసుకోకపోవడం వారు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం ప్రస్తుతం అనేక ప్రశ్నలకు కేరాఫ్ గా మారింది.

ఇది కూడా రైతుల ఆందోళనకు కారణంగా మారుతుంది. దీనిని బట్టి కూటమి నాయకులు ఐక్యంగా ఉండి రైతులను ఒప్పించగలిగితే అమరావతి రాజధానిని వెంటాడుతున్న జగన్ భయం తొలగిపోయి రైతులు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 8, 2025 5:15 pm

Share

Recent Posts

విశ్వదాభిరామా… వినవయ్యా విశ్వంభరా

చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…

6 minutes ago

ఇండోనేషియాలో నౌక గల్లంతు

ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…

11 minutes ago

వినాయక చవితి పూజా విధానం 2026

వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…

1 hour ago

సుమంత్ అదే దారిలో వెళ్తే ఎలా

హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…

3 hours ago

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

4 hours ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

5 hours ago