Political News

ఆ విష‌యంలో కూట‌మి కూడా త‌ప్పించుకోలేక పోతోందా?

వైసిపి హయాంలోనూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ రాష్ట్ర హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు చర్చకు దారితీస్తున్నాయి. వైసిపి హయాంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులపై అప్పట్లో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అన్నది అందరికీ తెలిసిందే. ఏకంగా న్యాయమూర్తులను… న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను కూడా తప్పుపడుతూ కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ విషయం దుమారానికి దారి తీసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా అప్పట్లో హైకోర్టు తప్పు పట్టింది. కొన్ని రద్దు కూడా చేసింది.

అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవహారంలో మార్పు వస్తుందని చాలామంది అనుకున్నారు. న్యాయవ్యవస్థ పట్ల అలాగే తీర్పుల‌ పట్ల కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. కానీ ఎక్క‌డో తేడా కొడుతోంది. లేకపోతే అధికారుల నిర్లక్ష్య‌మో తెలియదు కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు కూటమి ప్రభుత్వంపై కూడా విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి. నాడు వైసిపి హయాంలో ఏ విధంగా అయితే జరిగిందో.. అంత తీవ్రత ఇప్పుడు లేదని చెబుతున్న.. మొత్తానికి హైకోర్టు దృష్టిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒక సానుకూలత అయితే తప్పుతోంది.

ఇది ముందు ముందు ప్రభుత్వానికి ఇబ్బందికర అంశంగా మారే అవకాశం ఉంటుందనేది న్యాయం నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తిరుపతి లడ్డుకు సంబంధించిన కేసులో నిందితులకు బెయిలు ఇవ్వడం, అలాగే సింగయ్య మృతి కేసులో వైసిపి నాయకులపై జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వటం వంటి పరిణామాలను కొందరు విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. దీనిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది సరికాదు అన్నది ఇటు కూటమిలో ఉన్నటువంటి సీనియర్లు కూడా చెబుతున్న మాట. ఇక మరో ముఖ్య విషయం సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారన్న కారణంగా కేసులు పెట్టడాన్ని హైకోర్టు తాజాగా తప్పు పట్టింది.

వైసిపి హయాంలో సోషల్ మీడియాను బంధీని చేశారని, సోషల్ మీడియాలో స్వేచ్ఛ లేకుండా పోయిందని టిడిపి నాయకులు చాలామంది వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్న వారి పట్ల కేసులు పెట్టడం జైలుకు పంపించడం వంటివి హైకోర్టు దృష్టికి వెళ్లాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెజిస్ట్రేట్లను హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఇలాంటి కేసుల్లో రిమాండ్లు విధించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ పరిణామాలను గమనిస్తే వైసిపి అయినా కూటమి అయినా హైకోర్టుల విషయంలో న్యాయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. లేకపోతే భవిష్యత్తులో ప్రమాదకరమైన అంశాలను నెత్తినెత్తికోవలసిన పరిస్థితి, బాధ్యత వహించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు.

This post was last modified on July 8, 2025 11:08 am

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

1 hour ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

2 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

3 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

3 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

4 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

4 hours ago