జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మంగళవారం ఓ కేసు నమోదు అయ్యింది. అది కూడా సాదాసీదా కేసు కాదు. ఏకంగా క్రిమినల్ కేసే పవన్ పై నమోదు అయిపోయింది. అదేంటీ?… పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఆయనపైనా కేసులు నమోదు అవుతాయా? అన్న రీతిలో జనం.. ప్రత్యేకించి జనసైనికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇందులో ఆశ్చర్యపోవడానికేమీ లేదు. ఎందుకంటే.. ఈ కేసు నమోదు అయ్యింది ఏపీలో కాదు. తమిళనాడులో ఈ కేసు నమోదు అయ్యింది.
కేసు వివరాల్లోకి వెళితే…గతనెల మురుగన్ మానాడు పేరిట బీజేపీ నేతలు తమిళనాడులోని మధురైలో భారీ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమ్మేళనానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పవన్ కల్యాణ్ హాజరుకావాల్సి ఉండగా…యోగి డుమ్మా కొట్టగా.. పవన్ మాత్రం నేరుగా మధురై వెళ్లి మురుగన్ సమ్మేళనంలో కీలకోపన్యాసం చేశారు. ఈ ప్రసంగంలో సూడో లౌకికవాదులు అంటూ పవన్ ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఈ సమ్మేళనాన్ని బీజేపీ తమిళనాడు శాఖ ఆధ్వర్యంలో జరిగింది.
సరే… నాడు ఆ సభ ముగిసింది. పవన్ తిరిగి ఏపీకి చేరుకున్నారు. తన పాలనలో తను బిజీ అయిపోయారు. ఇప్పుడు మంగళవారం తమిళనాడుకు చెందిన ఓ న్యాయవాది వాంజినాథన్ కు పవన్ వ్యాఖ్యలు గుర్తుకు వచ్చినట్టున్నాయి. వెంటనే ఆయన తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పవన్ పై ఫిర్యాదు చేశారు. మురుగన్ భక్తుల సదస్సులో పవన్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. వాంజినాథన్ ఫిర్యాదు ఆధారంగా అన్నానగర్ పోలీసులు పవన్ పై ఏకంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇక పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో మతం, ప్రాంతం ఆధారంగా పవన్ విద్వేషాలను రెచ్చగొట్టే యత్నం చేశారని కొన్ని కీలక ఆరోపణలు చేశారు. మరి ఈ కేసు ఏ తీరానికి చేరుతుందో చూడాలి. వాస్తవానికి ఎన్డీఏలో జనసేన కీలక భాగస్వామే. అది కూడా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే… ఆయా రాష్ట్రాల్లో పవన్ కున్న ఫాలోయింగ్ ను వినియోగించుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ముఖ్య కార్యక్రమం ఉన్నా బీజేపీ నేతలు పవన్ నే ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే.
This post was last modified on July 2, 2025 10:54 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…