Political News

స్వేచ్ఛ ఆత్మహత్య.. అతను లొంగిపోయాడు

తెలుగులో ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్లలో ఒకరైన స్వేచ్ఛ వొటేర్కర్ ఆత్మహత్యకు పాల్పడడం ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాక.. కవిత్వం రాయడం, సామాజిక సమస్యలపై బలంగా గళం విప్పడం లాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఇలా బలవన్మరణానికి పాల్పడడం జర్నలిస్టు వర్గాలను షాక్‌కు గురి చేసింది. చాలా ఏళ్ల కిందటే భర్త నుంచి విడిపోయిన స్వేచ్ఛకు వయసు మీద పడ్డ తల్లిదండ్రులు, 13 ఏళ్ల కూతురు ఉన్నారు. వాళ్లందరికీ ఆధారం లేకుండా చేసి ఆత్మహత్యకు పాల్పడడాన్ని సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

తమ కూతురి మరణానికి పూర్ణ చందర్ అనే వ్యక్తి కారణమని.. ఇప్పటికే పెళ్లయి పిల్లలున్న పూర్ణ చాలా ఏళ్లుగా తమ కూతురితో ఉంటున్నాడని.. స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని.. అతడికి బీఆర్ఎస్ అగ్ర నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని స్వేచ్ఛ తండ్రి ఆరోపించారు. సోషల్ మీడియాలో కూడా చాలామంది స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణ చందరే అంటున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణ చందర్ శనివారం రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం గమనార్హం.

స్వేచ్ఛ తల్లిదండ్రులు పూర్ణచందర్ మీద అక్కడే ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద అతడి మీద కేసులు నమోదైన నేపథ్యంలో అతను అడ్వకేట్ సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంతకంటే ముందు పూర్ణచందర్ తన వెర్షన్ వినిపిస్తూ ఒక లేఖ విడుదల చేశాడు. అందులో కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. స్వేచ్ఛ తనకు 2009 నుంచి తెలుసని.. తామిద్దరం కలిసి ఒక టీవీ ఛానెల్లో పని చేశామని అతను చెప్పాడు. స్వేచ్ఛ వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను తనతో పంచుకునేదన్నాడు. ఐతే 2020 తర్వాతే తమ మధ్య నిజమైన సాన్నిహిత్యం పెరిగిందని అతను తెలిపాడు.

స్వేచ్ఛ మొదటి భర్త నుంచి 2009లో, రెండో భర్త నుంచి 2017లో విడాకులు తీసుకుందని.. 2020 నుంచి తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. తనను ఆమె భర్తగా ఊహించుకుందని పూర్ణ చందర్ పేర్కొన్నాడు. స్వేచ్ఛ మానసిక బాధలకు కారణం తల్లిదండ్రులే అని అతను ఆరోపించాడు. ఉద్యమాల్లో భాగం కావడం వల్ల వాళ్లిద్దరూ స్వేచ్ఛను ఏడాదికి ఒక్కసారి మాత్రమే కలిసేవారని.. దీని గురించి తనతో ఎన్నోసార్లు పంచుకుందని పూర్ణచందర్ తెలిపాడు.

తల్లిదండ్రులతో ఆమెకు తరచూ గొడవలు జరిగేవని.. వాటి వల్లే ఆమె మనోవేదనకు గురయ్యేదని అతనన్నాడు. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుందని.. రెండేళ్ల తర్వాత కూతురిని తన వద్దకు తీసుకొచ్చిందని.. తన భవిష్యత్తు గురించి చాలా ఆందోళనగా ఉండేదని.. తన లాంటి జీవితం కూతురికి వద్దని అనేదని పూర్ణచందర్ తెలిపాడు. కూతురి బాధ్యతలు తనకు అప్పగించిందని.. తాను ఒక తండ్రిలా ఆ అమ్మాయి బాధ్యత తీసుకున్నానని.. స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు తాను ఆమెను పెళ్లి పేరుతో మోసం చేయలేదని పూర్ణ చందర్ స్పష్టం చేశాడు.

This post was last modified on June 29, 2025 2:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

1 hour ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

2 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

2 hours ago

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

3 hours ago

చిరుపై విమర్శకులకు లావణ్య కౌంటర్

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…

3 hours ago

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

3 hours ago