Political News

స్వేచ్ఛ ఆత్మహత్య.. అతను లొంగిపోయాడు

తెలుగులో ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్లలో ఒకరైన స్వేచ్ఛ వొటేర్కర్ ఆత్మహత్యకు పాల్పడడం ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాక.. కవిత్వం రాయడం, సామాజిక సమస్యలపై బలంగా గళం విప్పడం లాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఇలా బలవన్మరణానికి పాల్పడడం జర్నలిస్టు వర్గాలను షాక్‌కు గురి చేసింది. చాలా ఏళ్ల కిందటే భర్త నుంచి విడిపోయిన స్వేచ్ఛకు వయసు మీద పడ్డ తల్లిదండ్రులు, 13 ఏళ్ల కూతురు ఉన్నారు. వాళ్లందరికీ ఆధారం లేకుండా చేసి ఆత్మహత్యకు పాల్పడడాన్ని సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

తమ కూతురి మరణానికి పూర్ణ చందర్ అనే వ్యక్తి కారణమని.. ఇప్పటికే పెళ్లయి పిల్లలున్న పూర్ణ చాలా ఏళ్లుగా తమ కూతురితో ఉంటున్నాడని.. స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని.. అతడికి బీఆర్ఎస్ అగ్ర నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని స్వేచ్ఛ తండ్రి ఆరోపించారు. సోషల్ మీడియాలో కూడా చాలామంది స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణ చందరే అంటున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణ చందర్ శనివారం రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం గమనార్హం.

స్వేచ్ఛ తల్లిదండ్రులు పూర్ణచందర్ మీద అక్కడే ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద అతడి మీద కేసులు నమోదైన నేపథ్యంలో అతను అడ్వకేట్ సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంతకంటే ముందు పూర్ణచందర్ తన వెర్షన్ వినిపిస్తూ ఒక లేఖ విడుదల చేశాడు. అందులో కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. స్వేచ్ఛ తనకు 2009 నుంచి తెలుసని.. తామిద్దరం కలిసి ఒక టీవీ ఛానెల్లో పని చేశామని అతను చెప్పాడు. స్వేచ్ఛ వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను తనతో పంచుకునేదన్నాడు. ఐతే 2020 తర్వాతే తమ మధ్య నిజమైన సాన్నిహిత్యం పెరిగిందని అతను తెలిపాడు.

స్వేచ్ఛ మొదటి భర్త నుంచి 2009లో, రెండో భర్త నుంచి 2017లో విడాకులు తీసుకుందని.. 2020 నుంచి తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. తనను ఆమె భర్తగా ఊహించుకుందని పూర్ణ చందర్ పేర్కొన్నాడు. స్వేచ్ఛ మానసిక బాధలకు కారణం తల్లిదండ్రులే అని అతను ఆరోపించాడు. ఉద్యమాల్లో భాగం కావడం వల్ల వాళ్లిద్దరూ స్వేచ్ఛను ఏడాదికి ఒక్కసారి మాత్రమే కలిసేవారని.. దీని గురించి తనతో ఎన్నోసార్లు పంచుకుందని పూర్ణచందర్ తెలిపాడు.

తల్లిదండ్రులతో ఆమెకు తరచూ గొడవలు జరిగేవని.. వాటి వల్లే ఆమె మనోవేదనకు గురయ్యేదని అతనన్నాడు. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుందని.. రెండేళ్ల తర్వాత కూతురిని తన వద్దకు తీసుకొచ్చిందని.. తన భవిష్యత్తు గురించి చాలా ఆందోళనగా ఉండేదని.. తన లాంటి జీవితం కూతురికి వద్దని అనేదని పూర్ణచందర్ తెలిపాడు. కూతురి బాధ్యతలు తనకు అప్పగించిందని.. తాను ఒక తండ్రిలా ఆ అమ్మాయి బాధ్యత తీసుకున్నానని.. స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు తాను ఆమెను పెళ్లి పేరుతో మోసం చేయలేదని పూర్ణ చందర్ స్పష్టం చేశాడు.

This post was last modified on June 29, 2025 2:35 pm

Share

Recent Posts

ఒక్క విషయంలో ఇరుముడికి అపోజిషన్

ఒక తెలుగు సినిమా పాతిక రోజులకు పైగా స్ట్రాంగ్ రన్ చూసి ఎంత కాలమయ్యిందంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం.…

5 minutes ago

ఆ ఒక్క ఫోటో ఆమె కేరీర్ ను దెబ్బతీసింది

సెలబ్రిటీల జీవితం పైకి ఎంత ఆకర్షణగా కనిపిస్తుందో లోపల అంత ఘర్షణ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా…

19 minutes ago

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు….

బీజేపీతో ప్రతిపక్ష బీఆర్ఎస్ లోపాయికారీగా పొత్తు పెట్టుకుందని అధికార కాంగ్రెస్ పార్టీ తరచుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి…

32 minutes ago

ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…

2 hours ago

హైదరాబాద్ బెస్ట్ సింగిల్ స్క్రీన్ రెడీ

థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…

3 hours ago

కొత్త దారులు వెతకాలి విశ్వంభరా

వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…

4 hours ago