Political News

2 నుంచి ఏపీలో రప్పా…. ర‌ప్పా!!

మ‌రో రెండు రోజులు.. ఖ‌చ్చితంగా జూలై 2వ తేదీ నుంచి ఏపీలో రాజ‌కీయాలు నిజంగానే ర‌ప్పా… ర‌ప్పా.. డైలాగును గుర్తుకు తేనున్నాయి. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య మ‌రింత జోరుగా హోరుగా రాజ‌కీయ ర‌గ‌డ చోటు చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఎక్క‌డా లేని విధంగా ప్ర‌తిప‌క్ష‌-అధికార పార్టీ మ‌ధ్య రాజ‌కీయం మ‌రింత సెగ పెర‌గ‌నుంది. ఇప్ప‌టికే వైసీపీ.. రీకాలింగ్ చంద్ర‌బాబూస్ మేనిఫెస్టో పేరుతో ఇంటింటికీ వైసీపీ కార్య‌క్ర‌మాన్ని లాంచ్ చేసింది. ప‌లు జిల్లాల్లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. దీనిపై తాజాగా జ‌గ‌న్ స‌మీక్ష కూడా నిర్వ‌హించారు.

ప‌లు జిల్లాల్లో కొంద‌రు నాయ‌కులు ముందుకురాని విష‌యం పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి.. త‌నే స్వ‌యంగా ఫోన్లు చేస్తాన‌ని.. ఎక్క‌డ‌కు వెళ్తున్నారో.. ఏ రూపంలో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారో తెలుసుకుంటాన‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు పేర్కొన్నాయి. అంటే.. ఇంటింటికీ వైసీపీ కార్య‌క్ర‌మం ఇక నుంచి మ‌రింత వాడి వేడిగా సాగ‌నుంద‌న్న‌ది తెలుస్తోంది. అయితే.. ఇదే స‌మ‌యంలో కూట‌మి ప్ర‌భుత్వానికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీ కూడా.. “ఇది మంచి ప్ర‌భుత్వం” పేరుతో జూలై 2వ తేదీ నుంచి వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుంది.

ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఏడాది పాల‌న‌లో చేసిన మంచిని.. తీసుకువ‌చ్చిన పెట్టుబ‌డుల‌ను నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స‌హా అంద‌రూ.. గ్రామ గ్రామాన ఇంటింటికీ తిరిగి ప్ర‌చారం చేయ‌నున్నారు. అంతేకాదు.. వైసీపీ చేసే దుష్ఫ్ర‌చారాన్ని కూడా అడ్డుకోవాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. తాను కూడా స్వ‌యంగా తొలి వారం రోజులు గ్రామాల్లో తిరుగుతాన‌ని చెప్పారు. ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లో వారుప‌ర్య‌టించాల‌ని అల్టిమేటం ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేసిన క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇస్తామ‌ని కూడా ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. దీంతో వైసీపీకి దీటుగా టీడీపీ నాయ‌కులు కూడా ఇంటింటికీ తిరిగేందుకు.. పాల‌న‌పై ప్ర‌చారం చేసేందుకు రెడీ అవుతున్నారు.

అంటే.. మ‌రో రెండు రోజుల్లోనే ఈ కార్య‌క్ర‌మం కూడా ఊపందుకోనుంది. టీడీపీ నాయ‌కుల‌తోపాటు.. అన్ని జిల్లాల పోలీసుల‌ను కూడా.. ప్ర‌భుత్వం అలెర్ట్ చేసింది. వైసీపీ నాయ‌కులు ఎక్క‌డైనా అడ్డు ప‌డితే క్రిమినల్ కేసులు న‌మోదు చేయాల‌ని సూచించింది. త‌క్ష‌ణ‌మే అరెస్టు కూడా జ‌ర‌గాల‌ని పేర్కొంది. ఈ విష‌యం తెలిసిన వైసీపీ ఎలాంటి ప‌రిస్థితి వ‌చ్చినా.. ఎదుర్కొనేందుకు రెడీ కావాల‌ని.. నాయ‌కులు ధైర్యంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను గుర్తు చేయాల‌ని పేర్కొంది. సో.. 2వ తేదీ నుంచి రాజ‌కీయం మ‌రింత గ‌రంగ‌రంగా మారిపోతుంద‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on June 29, 2025 10:55 am

Share

Recent Posts

ఓటుకు నోటు తీసుకోవడం మానేయలేమా

ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…

60 minutes ago

సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…

2 hours ago

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

4 hours ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

5 hours ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

11 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

11 hours ago