Political News

‘వెధవ పనుల వల్లే వైసీపీకి 11 సీట్లు’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి సర్కారుపై చేసిన విమర్శలకు వెనువెంటనే కౌంటర్లు వచ్చి పడ్డాయి. ఆ కౌంటర్లు కూడా నేరుగా టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు నుంచే రావడం గమనార్హం. గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు… వెధవ పనులు చేసిన కారణంగానే వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని ఓ సంచలన కామెంట్ చేశారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన వైసీీపీ ఆ మరుసటి ఎన్నికల్లోనేఅతి తక్కువ సీట్లకు పడిపోయిందని బాబు అన్నారు.

ఏపీలో ఇప్పుడు జగన్ చేస్తున్న ఓదార్పు, పరామర్శ యాత్రలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకోవాలంటే 40 వేల మంది కార్యకర్తలను వెంటేసుకుని వెళతారా? అంటూ ఆయన ఆగ్రహించారు. అలా వెళ్లిన 40 వేల మంది కారణంగా మిర్చీ టిక్కీలు, పొగాకు బేళ్లు ఏ మేర నష్టపోయాయో జగన్ కు తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. అయినా రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లే రాజకీయ నేతను ఏమంటారని బాబు ప్రశ్నించారు. నేర స్వభావం ఉన్న వారే ఈ పనులు చేస్తారని బాబు ఓ రూలింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా పాలకుల వల్ల జరిగే అభివృద్ధి గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి తాను పునాది రాయి వేస్తే… ఆ తర్వాత సీఎంగా పదవి చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి కొనసాగించారని తెలిపారు. ప్రజల పట్ల మమకారం, అభివృద్ధి పట్ల ఆసక్తి, ఎన్నికల్లో ఓట్లు కోల్పోతామన్న భయం… ఇలా అన్నీ అంచనా వేసుకున్న తర్వాతే లౌక్యంగా వ్యవహరించి హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారన్నారు. ఈ కారణంగానే వైఎస్ వరుసగా రెండో సారి కూడా విజయం సాధించారని ఆయన తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ అభివృద్దిని నిర్లక్ష్యం చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు.

వైఎస్ కుమారుడిని అని చెప్పుకునే జగన్ లో తండ్రి లక్షణాలే లేవని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదికారం చేతికి వచ్చేదాకా ఒక మాట మాట్లాడిన జగన్… అదికారం చేతికి అందగానే మాట మార్చేశారని… అమరావతితో పాటు పోలవరం పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలను భయపెట్టి మరీ పరుగులు పెట్టేలా చేశారని ధ్వజమెత్తారు. ఇంతటి నేరస్వభావం ఉన్న జగన్ ను ఐదేళ్ల పాటు ఎలాగోలా భరించిన జనం.. తమకు అవకాశం రాగానే జగన్ కు తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. ఇకనైనా జగన్ పరిణతి కలిగిన రాజకీయనేతగా వ్యవహరించాలని, అలాకాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే మాత్రం తాట తీస్తానని హెచ్చరించారు.

This post was last modified on June 19, 2025 5:42 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

6 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

21 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

21 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago