Political News

‘వెధవ పనుల వల్లే వైసీపీకి 11 సీట్లు’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి సర్కారుపై చేసిన విమర్శలకు వెనువెంటనే కౌంటర్లు వచ్చి పడ్డాయి. ఆ కౌంటర్లు కూడా నేరుగా టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు నుంచే రావడం గమనార్హం. గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు… వెధవ పనులు చేసిన కారణంగానే వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని ఓ సంచలన కామెంట్ చేశారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన వైసీీపీ ఆ మరుసటి ఎన్నికల్లోనేఅతి తక్కువ సీట్లకు పడిపోయిందని బాబు అన్నారు.

ఏపీలో ఇప్పుడు జగన్ చేస్తున్న ఓదార్పు, పరామర్శ యాత్రలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకోవాలంటే 40 వేల మంది కార్యకర్తలను వెంటేసుకుని వెళతారా? అంటూ ఆయన ఆగ్రహించారు. అలా వెళ్లిన 40 వేల మంది కారణంగా మిర్చీ టిక్కీలు, పొగాకు బేళ్లు ఏ మేర నష్టపోయాయో జగన్ కు తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. అయినా రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లే రాజకీయ నేతను ఏమంటారని బాబు ప్రశ్నించారు. నేర స్వభావం ఉన్న వారే ఈ పనులు చేస్తారని బాబు ఓ రూలింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా పాలకుల వల్ల జరిగే అభివృద్ధి గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి తాను పునాది రాయి వేస్తే… ఆ తర్వాత సీఎంగా పదవి చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి కొనసాగించారని తెలిపారు. ప్రజల పట్ల మమకారం, అభివృద్ధి పట్ల ఆసక్తి, ఎన్నికల్లో ఓట్లు కోల్పోతామన్న భయం… ఇలా అన్నీ అంచనా వేసుకున్న తర్వాతే లౌక్యంగా వ్యవహరించి హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారన్నారు. ఈ కారణంగానే వైఎస్ వరుసగా రెండో సారి కూడా విజయం సాధించారని ఆయన తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ అభివృద్దిని నిర్లక్ష్యం చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు.

వైఎస్ కుమారుడిని అని చెప్పుకునే జగన్ లో తండ్రి లక్షణాలే లేవని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదికారం చేతికి వచ్చేదాకా ఒక మాట మాట్లాడిన జగన్… అదికారం చేతికి అందగానే మాట మార్చేశారని… అమరావతితో పాటు పోలవరం పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలను భయపెట్టి మరీ పరుగులు పెట్టేలా చేశారని ధ్వజమెత్తారు. ఇంతటి నేరస్వభావం ఉన్న జగన్ ను ఐదేళ్ల పాటు ఎలాగోలా భరించిన జనం.. తమకు అవకాశం రాగానే జగన్ కు తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. ఇకనైనా జగన్ పరిణతి కలిగిన రాజకీయనేతగా వ్యవహరించాలని, అలాకాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే మాత్రం తాట తీస్తానని హెచ్చరించారు.

This post was last modified on June 19, 2025 5:42 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

60 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago