Political News

కేంద్రం సమక్షంలో త్వరలో బాబు, రేవంత్ భేటీ

తెలుగు రాష్ట్రాల మద్య ఇప్పుడు పోలవరం- బానకచర్ల ప్రాజెక్టు పెద్ద సమస్యగా మారిపోయింది. గోదావరి నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల్లో కేవలం 200 టీఎంసీల వినియోగం కోసం చేపట్టే ఈ ప్రాజెక్టుతో రాయలసీమ రతనాల సీమగా మారుతుందని ఏపీ వాదిస్తోంది. అయితే తమ ప్రాజెక్టులకు అభ్యంతరాలు తెలుపుతూ.. మాకు నష్టం కలిగించే ప్రాజెక్టును నిర్మిస్తామంటే మేమెలా ఒప్పుకుంటామంటూ తెలంగాణ వాదిస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు వ్యవహారం ఇప్పుడు నేరుగా కేంద్రం వద్దకు చేరింది. 

బానకచర్లకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని ఏపీ కోరగా.. ఆ దిశగా కేంద్రం కూడా పరిశీలనలు మొదలుపెట్టింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దంటూ తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి కోరారు. ఈ భేటీలో తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాలుపంచుకున్నారు. తెలంగాణ వాదనలను సావదానంగా విన్న పాటిల్… ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సి ఉందని అభిప్రాయపడినట్టు సమాచారం.

పాటిల్ తో భేటీ ముగిసిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడిన ఉత్తమ్… బానకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి తమ అభ్యంతరాలను సావదానంగా విన్నారని తెలిపారు. అంతేకాకుండా ఏపీ ప్రయోజనాలతో పాటుగా తెలంగాణ ప్రయోజనాలు కూడా తమకు ముఖ్యమేనని కూడా ఆయన అన్నారని పేర్కొన్నారు. ఈ దిశగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో త్వరలోనే ఓ భేటీ నిర్వహిస్తామని ఆయన చెప్పారన్నారు. ఈ భేటీ తుది ఫలితాన్ని ఇస్తుందని తాను భావిస్తున్నానని పాటిల్ అభిప్రాయపడినట్టు ఆయన తెలిపారు.

వాస్తవానికి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్న చంద్రబాబు, రేవంత్ గతంలో ఒకే పార్టీలో ఉన్నారు. చంద్రబాబు వద్దే రేవంత్ రాజకీయంగా రాటుదేలారు కూడా. ఇలాంటి నేపథ్యంలో బానకచర్ల ప్రాజెక్టుపై నెలకొన్న పీఠముడి కేంద్రం సమక్షంలో జరిగితే ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ వీడిపోనుందన్న వాదనలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి.

This post was last modified on June 19, 2025 6:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

1 hour ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

2 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

3 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

4 hours ago

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

6 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

7 hours ago