Political News

ట్రంప్‌కు మరోసారి ఇరాన్ హెచ్చరిక

ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంలో ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గట్టిగా హెచ్చరించారు. తమ దేశంపై ఎటువంటి దాడిని కూడా సహించేది లేదని.. గతంలో ట్రంప్ చేసిన బెదిరింపులను మరువలేమని అన్నారు. “అంతా మరిచిపోతారని మీరు అనుకోవచ్చు కానీ, ఇరాన్ అంత తేలిగ్గా తీసుకోదు. మీరు ఎక్కడ దాక్కున్నా, మేము చూస్తున్నాం. అమెరికా జోక్యం చేసుకుంటే.. మూల్యం భయంకరంగా ఉంటుంది,” అని ఖమేనీ పేర్కొనడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఇజ్రాయెల్ తాజా దాడుల నేపథ్యంలో ఖమేనీ తన దేశ ప్రజలకు వీడియో సందేశం విడుదల చేశారు. అందులో అమెరికాకు కూడా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. “పశ్చిమాసియాలో ఏదైనా తప్పుడు లెక్కలు వేసుకుంటే.. అది మొత్తంగా అగ్నిపర్వతాన్ని లేపే ప్రమాదం. ఇరాన్‌పై చేతులు వేసినవారంతా భయంకరమైన మూల్యం చెల్లించాల్సిందే,” అని ఖమేనీ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈసారి మాటల కంటే చర్యలు ముందు ఉంటాయని ఆయన వ్యాఖ్యలు చాలా అర్థవంతంగా మారాయి.

ఒకపక్క అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఖమేనీపై చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్బంగా గుర్తు చేశారు. అప్పట్లో ట్రంప్.. “ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు. కానీ ప్రస్తుతం ఆయన్ను హత్య చేయాలన్న ఉద్దేశం లేదు. అతను ఓ బెదిరింపు ప్రతీక మాత్రమే” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలపై ఖమేనీ కౌంటర్ గా మాట్లాడుతూ, “ఇప్పుడు మీరు నన్ను చూడలేదు.. కానీ నన్ను మరిచిపోవద్దు. ఇరాన్ ఎప్పటికీ తలవంచదు,” అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఇరాన్ విదేశాంగ శాఖ కూడా అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక చేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఏ యుద్ధ మేఘాలను చీల్చి పారేసినా.. మొదలయ్యే మంటలన్నీ అమెరికాకే వ్యతిరేకంగా మళ్లుతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా పాలక వర్గం కూడా ఇజ్రాయెల్‌కు పరిమిత మద్దతు ఇచ్చే వ్యూహం వైపు మొగ్గుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఖమేనీ వ్యాఖ్యలు స్పష్టంగా ఒక విషయం చెబుతున్నాయి.. ఈసారి ఇరాన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని. మరి ఈ తరహా మాటల యుద్ధాలు ఇంకా ఎలాంటి పరిస్థితులను తీసుకు వస్తాయో చూడాలి.

This post was last modified on June 18, 2025 7:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

6 seconds ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago