ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంలో ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను గట్టిగా హెచ్చరించారు. తమ దేశంపై ఎటువంటి దాడిని కూడా సహించేది లేదని.. గతంలో ట్రంప్ చేసిన బెదిరింపులను మరువలేమని అన్నారు. “అంతా మరిచిపోతారని మీరు అనుకోవచ్చు కానీ, ఇరాన్ అంత తేలిగ్గా తీసుకోదు. మీరు ఎక్కడ దాక్కున్నా, మేము చూస్తున్నాం. అమెరికా జోక్యం చేసుకుంటే.. మూల్యం భయంకరంగా ఉంటుంది,” అని ఖమేనీ పేర్కొనడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఇజ్రాయెల్ తాజా దాడుల నేపథ్యంలో ఖమేనీ తన దేశ ప్రజలకు వీడియో సందేశం విడుదల చేశారు. అందులో అమెరికాకు కూడా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. “పశ్చిమాసియాలో ఏదైనా తప్పుడు లెక్కలు వేసుకుంటే.. అది మొత్తంగా అగ్నిపర్వతాన్ని లేపే ప్రమాదం. ఇరాన్పై చేతులు వేసినవారంతా భయంకరమైన మూల్యం చెల్లించాల్సిందే,” అని ఖమేనీ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈసారి మాటల కంటే చర్యలు ముందు ఉంటాయని ఆయన వ్యాఖ్యలు చాలా అర్థవంతంగా మారాయి.
ఒకపక్క అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఖమేనీపై చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్బంగా గుర్తు చేశారు. అప్పట్లో ట్రంప్.. “ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు. కానీ ప్రస్తుతం ఆయన్ను హత్య చేయాలన్న ఉద్దేశం లేదు. అతను ఓ బెదిరింపు ప్రతీక మాత్రమే” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలపై ఖమేనీ కౌంటర్ గా మాట్లాడుతూ, “ఇప్పుడు మీరు నన్ను చూడలేదు.. కానీ నన్ను మరిచిపోవద్దు. ఇరాన్ ఎప్పటికీ తలవంచదు,” అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్ విదేశాంగ శాఖ కూడా అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక చేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఏ యుద్ధ మేఘాలను చీల్చి పారేసినా.. మొదలయ్యే మంటలన్నీ అమెరికాకే వ్యతిరేకంగా మళ్లుతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా పాలక వర్గం కూడా ఇజ్రాయెల్కు పరిమిత మద్దతు ఇచ్చే వ్యూహం వైపు మొగ్గుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఖమేనీ వ్యాఖ్యలు స్పష్టంగా ఒక విషయం చెబుతున్నాయి.. ఈసారి ఇరాన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని. మరి ఈ తరహా మాటల యుద్ధాలు ఇంకా ఎలాంటి పరిస్థితులను తీసుకు వస్తాయో చూడాలి.
This post was last modified on June 18, 2025 7:10 pm
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…