తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలపై వరుసబెట్టి విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఈ విచారణలకు బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కేసీఆర్ లాంటి నేతలే హాజరు అవుతున్నారు. తాజాగా ఇప్పటికే ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఓ దఫా ఏసీపీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఏసీబీ మరోమారు నోలీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో సోమవారం విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో ఆ సంస్థ కేటీఆర్ ను కోరింది.
వాస్తవానికి ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఇదివరకే ఓ దఫా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నాడు ఈ కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదంటూ ఊహాగానాలు వినిపించాయి. తాను అరెస్టు కావడం ఖాయమన్న దిశగా కేటీఆర్ ఓ అంచనాకు వచ్చారు. తనను అరెస్టు చేస్తున్నారు కదా… ఇంకెప్పుడు చేస్తారంటూ ఆయన నేరుగా తనను విచారిస్తున్న ఏసీబీ అదికారులనే ఆయన పదే పదే ప్రశ్నించిన వైనం కూడా నాడు కనిపించింది. అయితే నాడు కేటీఆర్ ను ఏసీబీ అరెస్టు చేయకపోగా… విచారణకు కేటీఆర్ ఓ మోస్తరుగా సహకరించారని చెప్పడం గమనార్హం.
తొలి విచారణ జరిగిన చాలా కాలం తర్వాత మరోమారు విచారణకు రావాలంటూ ఏసీబీ నుంచి కేటీఆర్ కు ఇప్పుడు నోటీసులు జారీ కావడంపై పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కారు రేసుల్లో మరింత పటిష్టమైన ఆధారాలను సేకరించిన నేపథ్యంలోనే ఏసీబీ కేటీఆర్ ను మరోమారు విచారణకు పిలుస్తోందా? అంటూ ఓ వర్గం భావిస్తోంది. మరికొందరేమో.. ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఆయనను తాజాగా విచారణకు పిలుస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇక మూడో వర్గమైతే.. బీఆర్ఎస్ నేతలు నిత్యం విచారణల భయంలోనే కొనసాగేలా కాంగ్రెస్ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని భావిస్తోంది.
గతంలో మాదిరిగా బీఆర్ఎస్ ఇప్పుడు ఏకతాటిపై లేదనే చెప్పాలి. కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బయటకు రావడం, ఆ లేఖ బయటకు వచ్చిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత… తన సోదరుడు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు నోటీసులు వస్తే బీఆర్ఎస్ ఆందోళనలకు దిగింది గానీ… కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎందుకు అంతగా పట్టించుకోలేదని కూడా ఆమె ఓ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు. మొత్తంగా పార్టీలో ఓ విభజన రేఖను ఆమె గీశారు. ఇప్పుడు కేటీఆర్ విచారణకు హాజరైతే… మునుపటి మాదిరిగా బీఆర్ఎస్ నుంచి మద్దతు లబిస్తుందా? అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
This post was last modified on June 13, 2025 4:03 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…