Political News

‘త‌ల్లికి వంద‌నం’.. జనం టాక్ ఇదే!

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన సూప‌ర్ 6 హామీల్లో కీల‌క‌మైన త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని సీఎం చ‌ద్ర‌బాబు గురువారం నుంచి అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కూట‌మి ప్ర‌భుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు. దీని కింద ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. తాజా శుక్ర‌వారం నుంచి ల‌బ్ధిదారులైన త‌ల్లుల ఖాతాల్లో త‌ల్లికి వంద‌నం నిధులు జ‌మ అవుతున్నాయి.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం కింద 52 వేల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం వారి ఖాతాలో వేసింది. ఈ ఆనందాన్ని పంచుకుంటూ.. స‌ద‌రు కుటుంబం ప్ర‌భుత్వానికి ధ‌న్యవాదాలు తెలిపింది. గ‌తంలో వైసీపీ హ‌యాంలో త‌మ‌కు ఒక్క చిన్నారికి మాత్ర‌మే అమ్మ ఒడి పడింద‌ని.. ఇప్పుడు న‌లుగురికి త‌ల్లికి వంద‌నం అందింద‌ని ఆ కుటుంబం పేర్కొంది. చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి చంద్ర‌బాబు చేసిన సాయంతో త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు బంగారు బాటలు వేసుకుంటామ‌న్నారు.

ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. దాదాపు 32 ల‌క్ష‌ల మందికి శుక్ర‌వారం ఈ సొమ్ములు వారి వారి ఖాతాల్లో ప‌డ్డాయి. మ‌రికొంద‌రికి వివిధ కార‌ణాల‌తో ఆల‌స్య‌మ‌వుతున్న‌ట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం స్కూళ్లు తెరిచిన నేప‌థ్యంలో ఆ సొమ్ముల‌తో త‌మ చిన్నారుల‌కు పుస్త‌కాలు, దుస్తులు కొనుగోలు చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

“నలుగురు పిల్లలు ఉన్న తల్లికి, “తల్లికి వందనం” కింద చంద్రన్న రూ.52 వేలు పంపించాడు. జగన్ రెడ్డి 5 ఏళ్ళలో వేసిన డబ్బు, చంద్రబాబు గారు ఒక్క ఏడాదిలో వేసారు. మా కుటుంబానికి ఒక్కసారిగా రూ.52 వేలు వచ్చాయి.” అని త‌ల్లులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on June 13, 2025 2:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

3 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

5 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

8 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

8 hours ago

ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయిందా?

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…

8 hours ago

పైరసీని ఆపడానికి యాప్

సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…

9 hours ago