గత ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని సీఎం చద్రబాబు గురువారం నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దీని కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తాజా శుక్రవారం నుంచి లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ అవుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి తల్లికి వందనం పథకం కింద 52 వేల రూపాయలను ప్రభుత్వం వారి ఖాతాలో వేసింది. ఈ ఆనందాన్ని పంచుకుంటూ.. సదరు కుటుంబం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. గతంలో వైసీపీ హయాంలో తమకు ఒక్క చిన్నారికి మాత్రమే అమ్మ ఒడి పడిందని.. ఇప్పుడు నలుగురికి తల్లికి వందనం అందిందని ఆ కుటుంబం పేర్కొంది. చెప్పిన మాటకు కట్టుబడి చంద్రబాబు చేసిన సాయంతో తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటామన్నారు.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. దాదాపు 32 లక్షల మందికి శుక్రవారం ఈ సొమ్ములు వారి వారి ఖాతాల్లో పడ్డాయి. మరికొందరికి వివిధ కారణాలతో ఆలస్యమవుతున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో ఆ సొమ్ములతో తమ చిన్నారులకు పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
“నలుగురు పిల్లలు ఉన్న తల్లికి, “తల్లికి వందనం” కింద చంద్రన్న రూ.52 వేలు పంపించాడు. జగన్ రెడ్డి 5 ఏళ్ళలో వేసిన డబ్బు, చంద్రబాబు గారు ఒక్క ఏడాదిలో వేసారు. మా కుటుంబానికి ఒక్కసారిగా రూ.52 వేలు వచ్చాయి.” అని తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on June 13, 2025 2:12 pm
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…
సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…