గత ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని సీఎం చద్రబాబు గురువారం నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దీని కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తాజా శుక్రవారం నుంచి లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ అవుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి తల్లికి వందనం పథకం కింద 52 వేల రూపాయలను ప్రభుత్వం వారి ఖాతాలో వేసింది. ఈ ఆనందాన్ని పంచుకుంటూ.. సదరు కుటుంబం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. గతంలో వైసీపీ హయాంలో తమకు ఒక్క చిన్నారికి మాత్రమే అమ్మ ఒడి పడిందని.. ఇప్పుడు నలుగురికి తల్లికి వందనం అందిందని ఆ కుటుంబం పేర్కొంది. చెప్పిన మాటకు కట్టుబడి చంద్రబాబు చేసిన సాయంతో తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటామన్నారు.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. దాదాపు 32 లక్షల మందికి శుక్రవారం ఈ సొమ్ములు వారి వారి ఖాతాల్లో పడ్డాయి. మరికొందరికి వివిధ కారణాలతో ఆలస్యమవుతున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో ఆ సొమ్ములతో తమ చిన్నారులకు పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
“నలుగురు పిల్లలు ఉన్న తల్లికి, “తల్లికి వందనం” కింద చంద్రన్న రూ.52 వేలు పంపించాడు. జగన్ రెడ్డి 5 ఏళ్ళలో వేసిన డబ్బు, చంద్రబాబు గారు ఒక్క ఏడాదిలో వేసారు. మా కుటుంబానికి ఒక్కసారిగా రూ.52 వేలు వచ్చాయి.” అని తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
స్టార్లు లేకపోయినా సరే ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో భారీగా తెరకెక్కి, కళ్లు చెదిరే విజువల్స్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…