Political News

బాబు మార్కు!… ఇకపై ‘సీడ్ రాఖీ’లదే ట్రెండ్!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అంతా విజనరీ అని అంటూ ఉంటారు గానీ… బాబు విజనరీ మాత్రమే కాదు ట్రెండ్ సెట్టర్ కూడా. ఏ కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన తనదైన శైలి సూచనలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు బాబు నోట ఓ కొత్త మాట వినిపించింది. అదే సీడ్ రాఖీ. దేశంలో 2018లోనే సీడ్ రాఖీ మాట వినిపించినా ఇప్పటికీ అది దేశవ్యాప్తంగా విస్తరించలేదనే చెప్పాలి. మెజారిటీ జనం ఇప్పటిదాకా ఈ పేరే వినలేదంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఇప్పుడు బాబు చలవతో ఇకపై చాలా ఏళ్ల పాటు సీడ్ రాఖీ ఓ ట్రెండ్ మారే అవకాశాలు లేకపోలేదు.

అసలు ఈ సీడ్ రాఖీ అంటే ఏమిటి? అన్న విషయానికి వస్తే… ఇప్పటిదాకా ఏదో ప్లాస్టిక్, ఇతరత్రా వస్తువులతో చేసిన రాఖీలను మనం చూశాం. వీటినే రక్షా బంధన్ నాడు అన్నాతమ్ముళ్లకు… అక్కాచెల్లెళ్లు కడుతున్నారు. సైజులు, రూపాలను బట్టి ఏటికేడు కొత్త రాఖీలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా పర్యావరణానికి హానీ చేసేవే. ఎందుకంటే ఇవన్నీ వేస్టేజీ కింద డంప్ యార్డులకు చేరతాయి. వెరసి ఇవన్నీ చెత్తగా మారిపోతాయన్న మాట. అయితే ఇతరత్రా వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల పరిమాణం కంటే ఇవి ఒకింత చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనం పట్టించుకోవడం లేదు.

అదే సీడ్ రాఖీ అయితే అక్కాచెల్లెళ్లు కట్టే రాఖీలను ఆ తర్వాత అన్నాతమ్ముళ్లు… భూమిలో పాతి పెడతారు. అందులో ఉండే వస్తువులన్నీ భూమిలో కరిగిపోతాయి. దానిపై ఉండే విత్తనం మొలకెత్తి మొక్కగా, ఆపై మహావృక్షంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. అంటే సీడ్ రాఖీలో వేస్టేజీ అనే మాటే ఉండదన్న మాట. ఇలాంటి రాఖీలతో పర్యావరణానికి మంచి లాభం చేకూరుతుంది తప్పించి ఇసుమంత నష్టం కూడా ఉండదు. పనిలో పనిగా ఒక్కో రాఖీ ఒక్కో వృక్షంగా మారిపోతూ ఉండటంతో పచ్చదనం కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంటుందని చెప్పక తప్పదు.

గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతి పరిధిలోని అనంతవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే చంద్రబాబు నోట సీడ్ రాఖీ మాట వినిపించింది. కొన్ని సీడ్ రాఖీలను కూడా అక్కడికి తెప్పించిన బాబు..  వాటిని జనానికి చూపిస్తూ ఇకపై మీ సోదరులకు సీడ్ రాఖీలే కట్టండి అంటూ మహిళా లోకానికి పిలుపునిచ్చారు. ఫలితంగా జరిగే ప్రయోజనాల గురించి కూడా బాబు వివరించారు. మీ సోదరుల జన్మ నక్షత్రాలను తెలుసుకుని, ఆ నక్షత్రంతో జోడి కట్టే చెట్టు విత్తనాలతో తయారయ్యే రాఖీలను వాడండని ఆయన పిలుపునిచ్చారు. జన్మ నక్షత్రంతో కూడిన సీడ్ రాఖీలతో మీ సోదరులకు మంచి జరగడమే కాకుండా సమాజానికి కూడా మంచి జరుగుతుందని ఆయన తెలిపారు.

This post was last modified on June 6, 2025 6:26 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago