వైసీపీ ఒకటి అంటే.. కూటమి నాలుగు వాయించేస్తోంది. వైసీపీ నుంచి ఒక్కరు బయటకు వస్తే.. కూటమి పార్టీల నుంచి బలమైన నాయకులు నలుగురు వస్తున్నారు. వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే రాజకీయం. వైసీపీ ఏడాది పాటు మౌనంగా ఉండి.. తర్వాత.. చేపట్టిన కార్యక్రమం వెన్నుపోటు దినం. అయితే.. దీనికి పోటీగా కూటమి కూడా పలు కార్యక్రమాలు చేపట్టింది. పీడ విరగడైందని.. పేర్కొంటూ.. జనసేన నాయకులు రోడ్డెక్కారు.
ఇక, సమతా పాలన.. సుదినం.. అంటూ.. టీడీపీ నాయకులు వీధులెక్కి కార్యక్రమాలు చేశారు. అటు నుంచి ఇద్దరు మాట్లాడితే.. ఇటు నుంచి నలుగురుకాదు.. నలభై మంది అన్నట్టుగా నాయకులు మైకు పుచ్చుకున్నారు. అంతేకాదు.. వైసీపీ లోపాలను ఎండగట్టే పత్రికలు, మీడియా కూడా.. భారీగానే విజృంభించింది. అదేసమయంలో పాజిటివిటీ కంటే కూడా.. వ్యతిరేకతను పెంచే వారు కూడా పెరుగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి ఛాన్స్ చిక్కడం లేదన్న చర్చ జోరుగానే సాగుతోంది.
ఈ క్రమంలో వైసీపీ ఇప్పటికిప్పుడు చేయాల్సింది ఏంటి? ఎలా ముందుకు సాగాలన్న విషయంపై ఆ పార్టీలోనే చర్చ వస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడం అలా ఉంచితే.. బల మైన గళాలను వెతికి పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఎప్పటి నుంచో పరిశీలకులు చెబుతున్న మాట. అదేసమయంలో కౌంటర్ ఎటాక్ చేయగల సైన్యాన్ని వైసీపీ సిద్ధం చేసుకోవాలి. ఈ విషయంలో ఎప్పటి కప్పుడు జగన్ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.
ఇక, ప్రజలకు వైసీపీ వాయిస్ చేరే సమయం కంటే ముందే.. కూటమి అలెర్ట్ అవుతోంది. ఇది రాజకీయం. దీనిని ఎవరూ కాదనరు. కానీ.. దీనికి తగిన విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం నాయకులకు ఉంది. భవిష్యత్తులో ఒక క్యాలెండర్ పెట్టుకుంటారో.. నాయకులను తయారు చేసుకుంటారో.. వైసీపీ ఇష్టం. కానీ.. బలమైన వాయిస్ వినిపించేవారు.. దూకుడుగా కౌంటర్లు ఇచ్చేవారు లేకపోతే.. పక్కాగా పార్టీకి నష్టమనే భావన సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…