ఈ రోజుల్లో చిన్న సినిమాలకు సైతం వర్కింగ్ డేస్ పెరిగిపోతున్నాయి. ఇక కొంచెం స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా అంటే చాలు.. నెలలు నెలలు తీస్తూ పోతారు. పెద్ద సినిమా సంగతైతే చెప్పాల్సిన పని లేదు. సంవత్సరాలు గడిచిపోతాయి. తీరా చూస్తే అంత గొప్ప ఔట్ పుట్ ఏమీ కనిపించదు. సినిమాను వేగంగా పూర్తి చేస్తే బడ్జెట్లు ఎలా నియంత్రణలో ఉంటాయి, సినిమా క్లిక్ అయితే ఎంత మంచి లాభాలు వస్తాయన్నది ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి చిత్రాలు ఉదాహరణ. ఇప్పుడు రవితేజ కొత్త చిత్రానికి ఇదే సూత్రాన్ని పాటించబోతున్నట్లు సమాచారం.
నేను శైలజ, చిత్రలహరి లాంటి హిట్ మూవీస్ తీసి.. మధ్యలో కొంచెం డౌన్ అయిన కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఏ హడావుడి లేకుండా ఉన్నట్లుండి ఈ చిత్రాన్ని ప్రకటించారు. నేరుగా సంక్రాంతి రిలీజ్ అని పోస్టర్ మీద వేసేశారు కూడా. అనౌన్స్ చేసిన ఏడు నెలల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 12న రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. ఈ సినిమాను ఒకప్పటి స్టయిల్లో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయడానికి చిత్ర బృందం పక్కా ప్లాన్తో రంగంలోకి దిగుతోందట. జులై నెల చివరికల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసేలా టైట్ షెడ్యూల్స్ మధ్య పని చేయబోతున్నారు.
స్క్రిప్టు పకడ్బందీగా రెడీ కావడం.. షూటింగ్ షెడ్యూళ్లు కూడా పక్కాగా ప్లాన్ చేయడంతో అనుకున్నట్లే షూట్ పూర్తి చేస్తామని చిత్ర బృందం ధీమాగా ఉంది. రవితేజ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చేశాడట. ఇక దర్శకుడు, నిర్మాత అనుకున్నట్లుగా షూట్ పూర్తి చేయడమే మిగిలింది. ముందు టాకీ పార్ట్ పూర్తి చేస్తే.. తర్వాత పాటల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు సాఫీగా చేసుకోవచ్చని అనుకుంటున్నారు. ప్లాన్ ప్రకారం అన్నీ జరిగితే ఈ సినిమా ఒక రోల్ మోడల్గా మారే అవకాశముంది. ఈ చిత్రాన్ని ‘దసరా’ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
This post was last modified on June 6, 2025 6:33 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…