Political News

`పీ-4`కు టార్గెట్‌.. అర్ధ‌రాత్రి వ‌ర‌కు చంద్ర‌బాబు స‌మీక్ష‌!

పీ-4కు సంబంధించి.. సీఎం చంద్ర‌బాబు బుధ‌వారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు స‌మీక్ష నిర్వ‌హించారు. దీనికి సంబంధించి కీల‌క ల‌క్ష్యం కూడా నిర్దేశించారు. వ‌చ్చే ఆగ‌స్టు 15 నాటికి 15 ల‌క్ష‌ల కుటుంబాల‌ను `మార్గ‌ద‌ర్శులు` ద‌త్త‌త తీసుకునేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు రెడీ చేసుకోవాల‌ని పేర్కొన్నారు. పీ-4 కేవ‌లం ప్ర‌క‌ట‌న కాద‌ని.. ఇది ఎంతో ఉదాత్త ఆశ‌యంతో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మ‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఇప్ప‌టికే చాలా మంది పారిశ్రామిక వేత్త‌లు.. ఎన్నారైలు కూడా ద‌త్త‌త‌కు ముందుకు వ‌స్తున్నార‌ని పేర్కొన్నారు.

“పీ-4 అనేది.. రాష్ట్ర చ‌రిత్ర గ‌తిని మార్చేస్తుంది. పేద‌ల‌ను ఉన్న‌త వ‌ర్గాలుగా తీర్చిదిద్దేందుకు, పెద్ద ఎత్తున వారిని అభివృద్ది చేసేందుకు నిర్దేశించిన కార్య‌క్ర‌మం. దీనిని చాలా సీరియ‌స్‌గా తీసుకోవాలి. ఈ విష‌యంలో అధికారులు సొంతగానే కొన్ని ల‌క్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆగ‌స్టు 15 నాటికి రాష్ట్రంలో కీల‌క కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నాం. ఆ స‌మ‌యానికి 15 ల‌క్ష‌ల మంది పేద‌ల‌ను ఉన్న‌త వ‌ర్గాలు ద‌త్త‌త తీసుకునేలా ఏర్పాట్లు చేయాలి.“ అని సీఎం చంద్ర‌బాబు నిర్దేశించారు. ప్ర‌జ‌లు-ప్ర‌భుత్వం-ప్రైవేటు-భాగ‌స్వామ్యం(పీ-4)ను ఎవ‌రూ అశ్ర‌ద్ధ‌గా చూడొద్ద‌ని పేర్కొన్నారు.

పీ-4 ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 70 వేల కుటుంబాల‌ను మార్గ‌ద‌ర్శ‌కులు ద‌త్త‌త తీసుకున్న‌ట్టు చంద్ర‌బాబు వివ‌రించారు. అయితే.. ఇంకా మరింత మంది ముందుకు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని.. దీనిని స‌ద్వినియోగం చేసుకుని ముందుకు సాగాల‌ని సూచించారు. రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం రైతుల‌ను ఏవిధంగా ఒప్పించామో.. ఒక‌సారి వెన‌క్కి వెళ్లి ప‌రిశీలించాల‌ని పేర్కొన్నారు. నాడు రైతుల‌ను ఒప్పించిన‌ట్టుగానే నేడు పారిశ్రామిక వేత్త‌ల‌ను ఒప్పించి.. వ‌చ్చే రెండు మాసాల్లో 15 ల‌క్ష‌ల మంది పేద‌ల‌ను ధ‌నిక వ‌ర్గాలు ద‌త్త‌త తీసుకునేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు.

మీరు కూడా తీసుకోవ‌చ్చు!

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ల‌ను ఉన్న‌త స్థాయి అధికారుల‌ను కూడా చంద్ర‌బాబు పీ-4లో భాగం కావాల‌ని సూచించారు. మీకు కుదిరితే.. మీ ఆర్థిక ప‌రిస్థితి బాగుంటే.. ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క‌రు ద‌త్త‌త తీసుకున్నా.. రాష్ట్రంలో మెరుగైన విధంగా పేద‌లు జీవించే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో క‌లెక్ట‌ర్లు కూడా ఆలోచ‌న చేయాల‌ని సూచించారు. పైగా క‌లెక్ట‌ర్లు కూడా పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకుంటే.. మ‌రింత మందికి మార్గ‌ద‌ర్శ‌కులుగా వుంటార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల ఆర్థిక‌ ప‌రిస్థితిని అర్ధం చేసుకుని వారికి స‌హ‌క‌రించాల‌ని సూచించారు.

This post was last modified on June 5, 2025 2:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

36 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

44 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

5 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 hours ago