Political News

`పీ-4`కు టార్గెట్‌.. అర్ధ‌రాత్రి వ‌ర‌కు చంద్ర‌బాబు స‌మీక్ష‌!

పీ-4కు సంబంధించి.. సీఎం చంద్ర‌బాబు బుధ‌వారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు స‌మీక్ష నిర్వ‌హించారు. దీనికి సంబంధించి కీల‌క ల‌క్ష్యం కూడా నిర్దేశించారు. వ‌చ్చే ఆగ‌స్టు 15 నాటికి 15 ల‌క్ష‌ల కుటుంబాల‌ను `మార్గ‌ద‌ర్శులు` ద‌త్త‌త తీసుకునేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు రెడీ చేసుకోవాల‌ని పేర్కొన్నారు. పీ-4 కేవ‌లం ప్ర‌క‌ట‌న కాద‌ని.. ఇది ఎంతో ఉదాత్త ఆశ‌యంతో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మ‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఇప్ప‌టికే చాలా మంది పారిశ్రామిక వేత్త‌లు.. ఎన్నారైలు కూడా ద‌త్త‌త‌కు ముందుకు వ‌స్తున్నార‌ని పేర్కొన్నారు.

“పీ-4 అనేది.. రాష్ట్ర చ‌రిత్ర గ‌తిని మార్చేస్తుంది. పేద‌ల‌ను ఉన్న‌త వ‌ర్గాలుగా తీర్చిదిద్దేందుకు, పెద్ద ఎత్తున వారిని అభివృద్ది చేసేందుకు నిర్దేశించిన కార్య‌క్ర‌మం. దీనిని చాలా సీరియ‌స్‌గా తీసుకోవాలి. ఈ విష‌యంలో అధికారులు సొంతగానే కొన్ని ల‌క్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆగ‌స్టు 15 నాటికి రాష్ట్రంలో కీల‌క కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నాం. ఆ స‌మ‌యానికి 15 ల‌క్ష‌ల మంది పేద‌ల‌ను ఉన్న‌త వ‌ర్గాలు ద‌త్త‌త తీసుకునేలా ఏర్పాట్లు చేయాలి.“ అని సీఎం చంద్ర‌బాబు నిర్దేశించారు. ప్ర‌జ‌లు-ప్ర‌భుత్వం-ప్రైవేటు-భాగ‌స్వామ్యం(పీ-4)ను ఎవ‌రూ అశ్ర‌ద్ధ‌గా చూడొద్ద‌ని పేర్కొన్నారు.

పీ-4 ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 70 వేల కుటుంబాల‌ను మార్గ‌ద‌ర్శ‌కులు ద‌త్త‌త తీసుకున్న‌ట్టు చంద్ర‌బాబు వివ‌రించారు. అయితే.. ఇంకా మరింత మంది ముందుకు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని.. దీనిని స‌ద్వినియోగం చేసుకుని ముందుకు సాగాల‌ని సూచించారు. రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం రైతుల‌ను ఏవిధంగా ఒప్పించామో.. ఒక‌సారి వెన‌క్కి వెళ్లి ప‌రిశీలించాల‌ని పేర్కొన్నారు. నాడు రైతుల‌ను ఒప్పించిన‌ట్టుగానే నేడు పారిశ్రామిక వేత్త‌ల‌ను ఒప్పించి.. వ‌చ్చే రెండు మాసాల్లో 15 ల‌క్ష‌ల మంది పేద‌ల‌ను ధ‌నిక వ‌ర్గాలు ద‌త్త‌త తీసుకునేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు.

మీరు కూడా తీసుకోవ‌చ్చు!

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ల‌ను ఉన్న‌త స్థాయి అధికారుల‌ను కూడా చంద్ర‌బాబు పీ-4లో భాగం కావాల‌ని సూచించారు. మీకు కుదిరితే.. మీ ఆర్థిక ప‌రిస్థితి బాగుంటే.. ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క‌రు ద‌త్త‌త తీసుకున్నా.. రాష్ట్రంలో మెరుగైన విధంగా పేద‌లు జీవించే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో క‌లెక్ట‌ర్లు కూడా ఆలోచ‌న చేయాల‌ని సూచించారు. పైగా క‌లెక్ట‌ర్లు కూడా పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకుంటే.. మ‌రింత మందికి మార్గ‌ద‌ర్శ‌కులుగా వుంటార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల ఆర్థిక‌ ప‌రిస్థితిని అర్ధం చేసుకుని వారికి స‌హ‌క‌రించాల‌ని సూచించారు.

This post was last modified on June 5, 2025 2:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

1 hour ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

3 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

3 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

3 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

3 hours ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

3 hours ago