Political News

జ‌గ‌న్.. ఈ విష‌యాలు మ‌రిచిపోతే ఎలా స‌ర్!?

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా తెనాలిలో ప‌ర్య‌టించడం, పోలీసుల చేతిలో దెబ్బ‌లు తిన్న యువ‌కుల కుటుంబాన్ని పరామ‌ర్శించ‌డం ఎలా ఉన్నా, వైసీపీ హ‌యాంలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తే బాగుంటుంద‌న్న ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా ఆ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు విధేయులుగా పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చ ఎప్పుడూ ఉంటుంది. అయితే దీనిని జ‌గ‌న్ తప్పుబడుతున్నారు.

కానీ వైసీపీ హ‌యాంలోనూ ఇలానే జ‌రిగింది. విశాఖలో డాక్టర్ సుధాకర్‌ను న‌డిరోడ్డుపై పెడ‌రెక్క‌లు విరిచి క‌ట్టి స్టేష‌న్‌కు త‌ర‌లించ‌డం, ఆయ‌నపై కేసులు పెట్ట‌డం వంటివి జ‌గ‌న్ మ‌రిచిపోయారా అనేది ప్ర‌శ్న. అలాగే కర్నూలు జిల్లాలో 2023లో ఓ యువ‌కుడిని సీఐ న‌డిరోడ్డుపై త‌న్నుకుంటూ వెళ్లిన ఘ‌ట‌న అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. ఆ ఘ‌ట‌నపై ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంద‌న్నది ఎవ‌రికీ తెలియ‌దు.

ఇక వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు తన మాజీ కారు డ్రైవర్‌ను చంపి శ‌వాన్ని డోర్ డెలివ‌రీ చేసిన ఘ‌ట‌నలో ఆయ‌నపై ఎలాంటి చర్య‌లు తీసుకున్నారో అంద‌రికీ తెలుసు. సో.. వైసీపీ హ‌యాంలో త‌ప్పులు జ‌రిగ‌లేద‌ని చెప్పుకునే అవ‌కాశం జ‌గ‌న్‌కు లేదు. అయితే ఇప్పుడు విప‌క్షంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు త‌ప్పులు కనిపిస్తున్నాయి. మంచిదే. కానీ గత పాల‌నలో జ‌రిగిన వాటిపై కూడా మాట్లాడితే మంచిద‌న్న అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి.

ఇప్పుడు ఏం చేయాలి?

నిజానికి తెనాలి యువ‌కుల ఘ‌ట‌నపై నిష్పాక్షికంగా జ‌గ‌న్ స్పందించాలంటే ఆయ‌న‌కు రెండు మార్గాలు ఉన్నాయ‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు.

  1. పోలీసుల‌కు ఉన్న అధికారాలను హైకోర్టులో స‌వాల్ చేయ‌డం.
  2. ఈ ఘ‌ట‌నపై ప్రజాసంఘాలను ఏకం చేయ‌డం.

తద్వారా సమస్య‌కు పూర్తి పరిష్కారం తీసుకురావ‌చ్చు. కానీ జ‌గ‌న్ అలా చేయ‌కుండా, ఈ విష‌యాన్ని రాజ‌కీయంగా వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇది ఆయ‌న‌కు మైన‌స్ అవుతుందే త‌ప్ప బాధితుల‌కు ప్ల‌స్ కాబోద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on June 4, 2025 9:08 am

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

1 hour ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

1 hour ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago