వైసీపీ అధినేత జగన్ తాజాగా తెనాలిలో పర్యటించడం, పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న యువకుల కుటుంబాన్ని పరామర్శించడం ఎలా ఉన్నా, వైసీపీ హయాంలో జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించి ఆయన వివరణ ఇస్తే బాగుంటుందన్న ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వ పెద్దలకు విధేయులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న చర్చ ఎప్పుడూ ఉంటుంది. అయితే దీనిని జగన్ తప్పుబడుతున్నారు.
కానీ వైసీపీ హయాంలోనూ ఇలానే జరిగింది. విశాఖలో డాక్టర్ సుధాకర్ను నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి కట్టి స్టేషన్కు తరలించడం, ఆయనపై కేసులు పెట్టడం వంటివి జగన్ మరిచిపోయారా అనేది ప్రశ్న. అలాగే కర్నూలు జిల్లాలో 2023లో ఓ యువకుడిని సీఐ నడిరోడ్డుపై తన్నుకుంటూ వెళ్లిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందన్నది ఎవరికీ తెలియదు.
ఇక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ కారు డ్రైవర్ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అందరికీ తెలుసు. సో.. వైసీపీ హయాంలో తప్పులు జరిగలేదని చెప్పుకునే అవకాశం జగన్కు లేదు. అయితే ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు తప్పులు కనిపిస్తున్నాయి. మంచిదే. కానీ గత పాలనలో జరిగిన వాటిపై కూడా మాట్లాడితే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు ఏం చేయాలి?
నిజానికి తెనాలి యువకుల ఘటనపై నిష్పాక్షికంగా జగన్ స్పందించాలంటే ఆయనకు రెండు మార్గాలు ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు.
తద్వారా సమస్యకు పూర్తి పరిష్కారం తీసుకురావచ్చు. కానీ జగన్ అలా చేయకుండా, ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇది ఆయనకు మైనస్ అవుతుందే తప్ప బాధితులకు ప్లస్ కాబోదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on June 4, 2025 9:08 am
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…
లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…
శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…
తమిళనాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ విజయదుందుభి మోగించారు. ఏకపక్షంగా 110 స్థానాల్లో ఆయన విజయం దక్కించుకునే దిశగా…
నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…