ఏపీలో 2019 నుంచి ఐదేళ్ల పాటు సాగిన వైసీపీ పాలనను వైరి వర్గాలు దౌర్జన్య పాలనగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని 2024 ఎన్నికల్లో ప్రజల వద్దకు తీసుకెళ్లి… దౌర్జన్యకాండకు పాల్పడుతున్న వైసీపీని విపక్షంలోకి కూటమి పార్టీలు నెట్టేశాయి. అంతటితో వైసీపీ దౌర్జన్యాలు ఆగుతాయిలే అని అంతా అనుకున్నారు. అలా అనుకున్న వారి ఆశలు అడియాశలే అయ్యాయని చెప్పక తప్పదు. ఇప్పటికీ మెజారిటీ శాఖల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులే చక్రం తిప్పుతున్నారన్న వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వైసీపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి భర్త… కూటమి నేతలపై విరుచుకుడిపోయారు. ఏకంగా పురపాలక సమావేశంలోనే వారిపై దౌర్జన్యానికి దిగారు.
ఈ ఘటన ఎక్కడో మారుమూల జిల్లాల్లో జరిగింది కాదు. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోని గుంటూరు జిల్లా తెనాలి మునిసిపాలిటీలో శనివారం చోటుచేసుకోవడం గమనార్హం. శనివారం పురపాలక సర్వసభ్వ సమావేశం జరిగింది. మునిసిపల్ చైర్మన్ హోదాలో వైసీపీకి చెందిన రాధిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పురపాలక సంఘంలో ఎలాంటి హోదా లేకున్నా… ఆమె భర్త రమేశ్ దర్జాగా ఎంట్రీ ఇచ్చేశారు. చైర్ పర్సన్ భర్తగా డాబూ దర్పం ఒలకబోస్తూ జనరల్ బాడీ మీటింగ్ లోకి రమేశ్ ఎంట్రీ ఇచ్చిన తీరు ఒక ఎత్తు అయితే… నేరుగా చర్చలో పాలుపంచుకుంటూ టీడీపీ కౌన్సిలర్లపై ఆయన ఒంటికాలిపై లేచారు. ఒకానొక సందర్భంలో ఆయన ఏకంగా టీడీపీ సభ్యులపై దాడికి యత్నించారు.
తెనాలి మునిసిపల్ జనరల్ బాడీ మీటింగ్ లో తనకు ప్రవేశ అర్హతే లేదని తెలిసినా కూడా సమావేశానికి వచ్చిన రమేశ్… సమావేశంలో టీడీపీ సభ్యులపై బూతుల దండకం అందుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన రమేశ్ అనుచరులు ఆయనను బలవంతాన బయటకు తీసుకెళ్లారు. చైర్ పర్సన్ కుర్చీలో ఎంచక్కా ఆసీనులైన రాధిక.. తన కళ్లెదుటే ఇంత జరుగుతున్నా కూడా పల్లెత్తు మాట అనలేదు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశానికి రావడమే కాకుండా కౌన్సిలర్లపై విరుచుకుపడిన తన భర్తను ఆమె నిలువరించే యత్నమే చేయలేదు. చైర్ పర్సన్ కుర్చీలో ఆమె అలా ఉత్సవ విగ్రహంగా కూర్చుండిపోయారు.
ఇక ఎలాగోలా రమేశ్ ను ఆయన అనుచరులు బయటకు తీసుకెళ్లగా… పురపాలికలో ఎలాంటి హోదా లేకున్నా సమావేశానికి హాజరై… తమపైనే విరుచుకుపడిన రమేశ్ తీరుపై టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా తెనాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురపాలికలో కౌన్సిలర్ కాకున్నా సమావేశానికి రమేశ్ హాజరయ్యారని, తమపై దాడికి యత్నించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వారు సదరు ఫిర్యాదులో పోలీసులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా… ఇక్కడ జనసేనకు చెందిన కీలక నేత, సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి నియోజకవర్గంలో విపక్షానికి చెందిన ఓ నేత ఇంత బరితెగింపునకు పాల్పడిన తీరుపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
This post was last modified on June 1, 2025 3:06 pm
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…
ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…