ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు శనివారం రాత్రి భేటీ అయ్యారు. ఉదయం అంతా.. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానితో పాటే పాల్గొన్న సీఎం చంద్రబాబు.. మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారని ప్రధానితో కితాబు అందుకున్నారు. అనంతరం.. మరోసారి ఐదు నిమిషాల పాటు.. ప్రధాని అప్పాయింట్ మెంటు తీసుకుని ఆయనను కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఆరాతీశారని తెలిసింది. మహానాడు నిర్వహిస్తున్నారటగా.. అని ఆయన ప్రశ్నించగా.. ఇది పార్టీ కార్యక్రమమని.. ప్రతిసారీ నిర్వహించుకుంటా మని చంద్రబాబు బదులిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సిద్ధాంతం ప్రకారం పనిచేస్తోందని.. దీనిని కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సమయంలో ఎంత మంది వస్తారు? ఎన్ని రోజులు చేస్తారన్న చర్చ జరిగింది.
ఈ క్రమంలో మోడీ స్పందిస్తూ..మహానాడుకు వచ్చే అతిథులకు తృణధాన్యాలతో చేసిన వంటకాలు రుచి చూపించాలని కోరారని తెలిసింది. తృణ ధాన్యాల సాగును, విక్రయాలను కూడా కేంద్రం ప్రోత్సహిస్తోందని.. ప్రస్తుత ప్రపంచానికి తృణధాన్యాలతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు. అంతేకాదు.. మహానాడులో మూడు రోజుల పాటు ఏదో ఒక ప్రత్యేక వంటకంగా తృణ ధాన్యాలతో చేసిన పదార్థాలను వడ్డించాలని కోరినట్టు సమాచారం.
ప్రధాని సూచనలను సీఎం చంద్రబాబు కూడా అంగీకరించారని తెలిసింది. తాజాగా తృణ ధాన్యాలతో కూడిన వంటకాలను తయారు చేసే నిపుణుల కోసం. టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. దీనిని బట్టి ప్రధాని సూచనను సీఎం చంద్రబాబు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నట్టు అర్ధమవుతోంది.
This post was last modified on May 25, 2025 2:42 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…