Political News

మహానాడు లో ఆ వంటలు పెట్టండి: మోడీ సలహా

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో సీఎం చంద్ర‌బాబు శ‌నివారం రాత్రి భేటీ అయ్యారు. ఉద‌యం అంతా.. నీతి ఆయోగ్ స‌మావేశంలో ప్ర‌ధానితో పాటే పాల్గొన్న సీఎం చంద్ర‌బాబు.. మంచి ప్రెజెంటేష‌న్ ఇచ్చార‌ని ప్ర‌ధానితో కితాబు అందుకున్నారు. అనంత‌రం.. మ‌రోసారి ఐదు నిమిషాల పాటు.. ప్ర‌ధాని అప్పాయింట్ మెంటు తీసుకుని ఆయ‌న‌ను క‌లుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి టీడీపీ నిర్వ‌హిస్తున్న మ‌హానాడుపై ఆరాతీశారని తెలిసింది. మ‌హానాడు నిర్వ‌హిస్తున్నార‌ట‌గా.. అని ఆయ‌న ప్ర‌శ్నించ‌గా.. ఇది పార్టీ కార్య‌క్ర‌మ‌మ‌ని.. ప్ర‌తిసారీ నిర్వ‌హించుకుంటా మని చంద్ర‌బాబు బ‌దులిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సిద్ధాంతం ప్ర‌కారం ప‌నిచేస్తోంద‌ని.. దీనిని కొన‌సాగిస్తున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ స‌మ‌యంలో ఎంత మంది వ‌స్తారు? ఎన్ని రోజులు చేస్తార‌న్న చ‌ర్చ జ‌రిగింది.

ఈ క్ర‌మంలో మోడీ స్పందిస్తూ..మ‌హానాడుకు వ‌చ్చే అతిథుల‌కు తృణ‌ధాన్యాల‌తో చేసిన వంట‌కాలు రుచి చూపించాల‌ని కోరార‌ని తెలిసింది. తృణ ధాన్యాల సాగును, విక్ర‌యాల‌ను కూడా కేంద్రం ప్రోత్స‌హిస్తోందని.. ప్ర‌స్తుత ప్ర‌పంచానికి తృణ‌ధాన్యాలతోనే ఆరోగ్యం సిద్ధిస్తుంద‌ని చెప్పారు. అంతేకాదు.. మ‌హానాడులో మూడు రోజుల పాటు ఏదో ఒక ప్ర‌త్యేక వంట‌కంగా తృణ ధాన్యాల‌తో చేసిన ప‌దార్థాల‌ను వ‌డ్డించాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌ధాని సూచ‌న‌ల‌ను సీఎం చంద్ర‌బాబు కూడా అంగీక‌రించార‌ని తెలిసింది. తాజాగా తృణ ధాన్యాల‌తో కూడిన వంట‌కాల‌ను త‌యారు చేసే నిపుణుల కోసం. టీడీపీ నాయ‌కులు ఆరా తీస్తున్నారు. దీనిని బ‌ట్టి ప్ర‌ధాని సూచ‌న‌ను సీఎం చంద్ర‌బాబు తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటిస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతోంది.

This post was last modified on May 25, 2025 2:42 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

3 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

3 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

4 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

4 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

4 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

5 hours ago