Political News

23 నిమిషాల్లోనే పాకిస్థాన్‌కు చుక్క‌లు చూపించాం: మోడీ

రాజ‌స్థాన్‌లోని బిక‌నీర్‌లో ప‌ర్య‌టిస్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అమృత్ భార‌త్ స్టేష‌న్ల‌ను ప్రారంభించారు. అనంత‌రం.. నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాల‌పై భార‌త్ చేప‌ట్టి న ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. 22 నిమిషాల్లో ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు మ‌న ఆడ‌ప‌డు చుల సిందూరం తుడిచేశారని, పేర్లు అడిగి మ‌రీ కాల్చేశార‌ని అన్నారు. అయితే.. ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా మ‌నం 23 నిమిషాల వ్య‌వ‌ధిలోనే పాకిస్థాన్‌కు చుక్క‌లు చూపించామ‌న్నారు.

పాకిస్థాన్ గ‌డ్డ‌పై ఉగ్ర‌వాదుల‌ను, వారి శిబిరాల‌ను నేల మ‌ట్టం చేశామ‌ని ప్ర‌ధాని చెప్పారు. ఆప‌రేష‌న్ సిం దూర్ ద్వారా ఉగ్ర‌వాదులను, వారి శిబిరాల‌ను కూడా కూల్చేశామ‌ని తెలిపారు. పాకిస్థాన్‌తో చ‌ర్చ లంటూ జ‌రిగితే.. అది పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ పైనేన‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. త‌మ ప్ర‌భుత్వం త్రివిధ ద‌ళాల‌కు పూర్తి స్వేచ్ఛ నిచ్చింద‌ని తెలిపారు. ఉగ్ర‌వాదులు ఊహించ‌ని విధంగా వారికి శిక్ష విధించామ న్నారు.

భార‌త త్రివిధ ద‌ళాలు.. చ‌క్ర‌వ్యూహాన్ని సృష్టించి.. పాకిస్థాన్‌ను మోకాళ్ల‌పై నిల‌బెట్టాయ‌ని ప్ర‌ధాని మోడీ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్ త‌న స్థితి ఏంటో తెలుసుకోక‌పోతే.. త‌న వ్య‌వ‌హారాల‌ను మార్చుకోక‌పోతే.. పైసా పైసాకు వెతుక్కునేలా చేస్తామ‌ని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలో మూడు సూత్రాల‌ను భార‌త్ పాటిస్తుంద‌న్న ఆయ‌న‌.. దౌత్య ప‌రంగా పాకిస్థాన్‌ను ఎండ‌గ‌ట్ట‌డంతోపాటు.. ఉగ్ర‌వాదంపై నిరంత‌ర పోరును కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. కాగా.. ఆప‌రేష‌న్ సిందూర్ విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల యావ‌త్ దేశ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశార‌ని చెప్పారు.

“ఏప్రిల్ 22న, మన సోదరీమణుల మతం గురించి అడిగిన తర్వాత ఉగ్రవాదులు వారి నుదుటిపై ఉన్న సిందూరాన్ని తొలగించారు. పహల్గామ్‌లో బుల్లెట్లు పేలాయి. మ‌న ఆడ‌ప‌డుచుల సిందూరం తొలిగింది. కానీ 140 కోట్ల మంది భారతీయులు ఆ బాధను అనుభవించారు. హర్ దేశ్‌వాసి నే ఏక్ జుట్ హో కర్ సంకల్ప్ లియా థాకి ఆటంక్‌వాదియోం కో మిట్టి మే మిలా దేంగే” (దేశ ప్ర‌జలంతా ఒకే తాటిపైకి వ‌చ్చారు. ఒకే సంక‌ల్పం చెప్పారు. ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టిలో క‌లిపేయ‌డ‌మే వారి సంక‌ల్పం. అదే జ‌రిగింది) అని ప్ర‌ధాని తీవ్ర‌స్వ‌రంతో హెచ్చ‌రించారు.

This post was last modified on May 22, 2025 4:25 pm

Share

Recent Posts

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

15 minutes ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

56 minutes ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

2 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

3 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

6 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

6 hours ago