Political News

23 నిమిషాల్లోనే పాకిస్థాన్‌కు చుక్క‌లు చూపించాం: మోడీ

రాజ‌స్థాన్‌లోని బిక‌నీర్‌లో ప‌ర్య‌టిస్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అమృత్ భార‌త్ స్టేష‌న్ల‌ను ప్రారంభించారు. అనంత‌రం.. నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాల‌పై భార‌త్ చేప‌ట్టి న ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. 22 నిమిషాల్లో ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు మ‌న ఆడ‌ప‌డు చుల సిందూరం తుడిచేశారని, పేర్లు అడిగి మ‌రీ కాల్చేశార‌ని అన్నారు. అయితే.. ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా మ‌నం 23 నిమిషాల వ్య‌వ‌ధిలోనే పాకిస్థాన్‌కు చుక్క‌లు చూపించామ‌న్నారు.

పాకిస్థాన్ గ‌డ్డ‌పై ఉగ్ర‌వాదుల‌ను, వారి శిబిరాల‌ను నేల మ‌ట్టం చేశామ‌ని ప్ర‌ధాని చెప్పారు. ఆప‌రేష‌న్ సిం దూర్ ద్వారా ఉగ్ర‌వాదులను, వారి శిబిరాల‌ను కూడా కూల్చేశామ‌ని తెలిపారు. పాకిస్థాన్‌తో చ‌ర్చ లంటూ జ‌రిగితే.. అది పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ పైనేన‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. త‌మ ప్ర‌భుత్వం త్రివిధ ద‌ళాల‌కు పూర్తి స్వేచ్ఛ నిచ్చింద‌ని తెలిపారు. ఉగ్ర‌వాదులు ఊహించ‌ని విధంగా వారికి శిక్ష విధించామ న్నారు.

భార‌త త్రివిధ ద‌ళాలు.. చ‌క్ర‌వ్యూహాన్ని సృష్టించి.. పాకిస్థాన్‌ను మోకాళ్ల‌పై నిల‌బెట్టాయ‌ని ప్ర‌ధాని మోడీ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్ త‌న స్థితి ఏంటో తెలుసుకోక‌పోతే.. త‌న వ్య‌వ‌హారాల‌ను మార్చుకోక‌పోతే.. పైసా పైసాకు వెతుక్కునేలా చేస్తామ‌ని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలో మూడు సూత్రాల‌ను భార‌త్ పాటిస్తుంద‌న్న ఆయ‌న‌.. దౌత్య ప‌రంగా పాకిస్థాన్‌ను ఎండ‌గ‌ట్ట‌డంతోపాటు.. ఉగ్ర‌వాదంపై నిరంత‌ర పోరును కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. కాగా.. ఆప‌రేష‌న్ సిందూర్ విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల యావ‌త్ దేశ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశార‌ని చెప్పారు.

“ఏప్రిల్ 22న, మన సోదరీమణుల మతం గురించి అడిగిన తర్వాత ఉగ్రవాదులు వారి నుదుటిపై ఉన్న సిందూరాన్ని తొలగించారు. పహల్గామ్‌లో బుల్లెట్లు పేలాయి. మ‌న ఆడ‌ప‌డుచుల సిందూరం తొలిగింది. కానీ 140 కోట్ల మంది భారతీయులు ఆ బాధను అనుభవించారు. హర్ దేశ్‌వాసి నే ఏక్ జుట్ హో కర్ సంకల్ప్ లియా థాకి ఆటంక్‌వాదియోం కో మిట్టి మే మిలా దేంగే” (దేశ ప్ర‌జలంతా ఒకే తాటిపైకి వ‌చ్చారు. ఒకే సంక‌ల్పం చెప్పారు. ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టిలో క‌లిపేయ‌డ‌మే వారి సంక‌ల్పం. అదే జ‌రిగింది) అని ప్ర‌ధాని తీవ్ర‌స్వ‌రంతో హెచ్చ‌రించారు.

This post was last modified on May 22, 2025 4:25 pm

Share
Show comments
Published by
Satya
Tags: PM Modi

Recent Posts

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

35 minutes ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

4 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

4 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

4 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

5 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

6 hours ago