టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీలో పాలనను చేపట్టి అప్పుడే ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో తాము చేసిందేమిటి? సాధించిన ప్రగతి ఏమిటి? ఇంకా చేపట్టాల్సిన చర్యలేమిటి? అన్న వాటిపై సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం వ్యవసాయం, అనుబంధ రంగాలపైనా ఆయన సమీక్ష చేశారు. ఈ సమీక్ష ఓకే గానీ… చంద్రబాబు ఏడాది పాలనలో రైతాంగం ఎలా ఉంది? అన్న విషయాన్ని పరిశీలిస్తే… చాలా ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి.
కూటమి పాలన చేపట్టాక తొలుత ఖరీఫ్, ఆ తర్వాత రబీ…ఒక ఏడాదిలో వచ్చే రెండు పంట సీజన్లు ముగిశాయి. వచ్చే నెల నుంచి రెండో ఖరీఫ్ సీజన్ మొదలు కానుంది. మరి ఇది వరకే ముగిసిన ఖరీఫ్ గానీ, రబీ సీజన్లలో రైతుల పరిస్థితి ఏమిటి? అంటే… కూటమి పాలనలో రాష్ట్ర రైతాంగం ఫుల్ హ్యాపీ అని చెప్పక తప్పదు. సమృద్దిగా వర్షాలు, పొలాల నిండా పంటలు, అన్నింటికీ కాకున్నా మెజారిటీ పంటలన్నింటికీ మంచి గిట్టుబాటు ధరలు లబించాయనే చెప్పాలి.
ధాన్యం విషయానికే వస్తే… అటు ఖరీఫ్ లో గానీ, ఇటు రబీలో గానీ… ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతలు పండించిన పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఆ ధాన్యం సొమ్ములను సకాలంలోనే నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది. ఇతర పంటల పరిస్థితి కూడా ఇదే రీతిన సాగింది. ఈ రబీలో పండిన మిర్చి ఒక్కటి మాత్రం అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా ప్రభుత్వం అంతగా సాయం చేయలేకపోయినా… చేయాల్సినదంతా చేసిందనే చెప్పక తప్పదు.
ఇక ఎక్కడైనా సాగు గురించి ఆలోచిస్తే… వర్షాల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. గత ఖరీఫ్, రబీలో సకాలంలో వర్షాలు పడ్డాయి. పంటలన్నీ పండి, కోతలు పూర్తి అయి, కొనుగోళ్లు కూడా పూర్తి అయిన తర్వాతే వర్షాలు మొదలయ్యాయి. ఇది మంచి సంకేతమని చెప్పక తప్పదు ఖరీఫ్ కు సరైన స్వాగతమని చెప్పాలి. ఇక ఆక్వా రంగానికి వస్తే… అంతర్జాతీయంగా ఎదురైన పరిణామాలను తట్టుకుని నిలబడేలా ఆక్వా రంగానికి ప్రభుత్వం చేయూతను ఇచ్చింది. ఫలితంగా ఇతర రంగాల మాదిరే ఇప్పుడు ఆక్వా రైతులు కూడా మంచి లాభాలనే సంపాదిస్తున్నారు.
This post was last modified on May 22, 2025 4:20 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…