Political News

చంద్రబాబుకు సాయిరెడ్డి లొంగిపోయారు: జగన్

వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సాయిరెడ్డికి క్రెడిబులిటీ లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో కసిరెడ్డి రాజ శేఖర్ తో తనకు సంబంధం లేదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోని తాజాగా విజయసాయిరెడ్డిపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి లొంగిపోయారని జగన్ షాకింగ్ కామెంట్ చేశారు.

వైసీపీకి సరిపడా ఎమ్మెల్యే లేరని, మరోసారి రాజ్యసభ అవకాశం తనకు ఉండదని విజయసాయి రెడ్డి భావించారని ఆరోపించారు. కాబట్టే కూటమి, చంద్రబాబుకు మేలు జరిగేలాగా ప్రలోభాలకు లొంగిపోయారని జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అటువంటి విజయసాయిరెడ్డి చెప్పిన స్టేట్మెంట్ కు విలువ ఎక్కడ ఉంటుందని జగన్ ప్రశ్నించారు. లోక్ సభ ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుతో ఏం సంబంధం ఉందని జగన్ ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ లను జైల్లో పెట్టిన చరిత్ర లేదని, సీనియర్ అధికారులకు పోస్టింగ్ లేకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.

లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఒక ఫైల్ అయినా సరే సీఎంవోలోకి వచ్చి సంతకం అయినట్లు చూపించగలరా అని చంద్రబాబుకు జగన్ సవాల్ చేశారు. అరెస్టయిన ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకి ఈ వ్యవహారంతో ఏం సంబంధం అని ప్రశ్నించారు. అప్రూవర్ గా మారలేదన్న కారణంతోనే కసిరెడ్డిని నిందితుడిగా చేర్చారని జగన్ ఆరోపించారు. ఇక, ఐపీఎస్ లు కాంతి రాణా, జాషువా, విశాల్ గున్నిలను కూడా కూటమి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని జగన్ ఆరోపించారు.

లిక్కర్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఈరోజు బెయిల్ పై బయట ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో గల్లీగల్లీకి బెల్ట్ షాపులు వెలిశాయని, మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో అవి నడుస్తున్నాయని ఆరోపించారు. మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా అని జగన్ ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, మోసాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకే లిక్కర్ కుంభకోణం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

This post was last modified on May 22, 2025 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

58 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago