Political News

చంద్రబాబుకు సాయిరెడ్డి లొంగిపోయారు: జగన్

వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సాయిరెడ్డికి క్రెడిబులిటీ లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో కసిరెడ్డి రాజ శేఖర్ తో తనకు సంబంధం లేదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోని తాజాగా విజయసాయిరెడ్డిపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి లొంగిపోయారని జగన్ షాకింగ్ కామెంట్ చేశారు.

వైసీపీకి సరిపడా ఎమ్మెల్యే లేరని, మరోసారి రాజ్యసభ అవకాశం తనకు ఉండదని విజయసాయి రెడ్డి భావించారని ఆరోపించారు. కాబట్టే కూటమి, చంద్రబాబుకు మేలు జరిగేలాగా ప్రలోభాలకు లొంగిపోయారని జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అటువంటి విజయసాయిరెడ్డి చెప్పిన స్టేట్మెంట్ కు విలువ ఎక్కడ ఉంటుందని జగన్ ప్రశ్నించారు. లోక్ సభ ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుతో ఏం సంబంధం ఉందని జగన్ ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ లను జైల్లో పెట్టిన చరిత్ర లేదని, సీనియర్ అధికారులకు పోస్టింగ్ లేకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.

లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఒక ఫైల్ అయినా సరే సీఎంవోలోకి వచ్చి సంతకం అయినట్లు చూపించగలరా అని చంద్రబాబుకు జగన్ సవాల్ చేశారు. అరెస్టయిన ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకి ఈ వ్యవహారంతో ఏం సంబంధం అని ప్రశ్నించారు. అప్రూవర్ గా మారలేదన్న కారణంతోనే కసిరెడ్డిని నిందితుడిగా చేర్చారని జగన్ ఆరోపించారు. ఇక, ఐపీఎస్ లు కాంతి రాణా, జాషువా, విశాల్ గున్నిలను కూడా కూటమి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని జగన్ ఆరోపించారు.

లిక్కర్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఈరోజు బెయిల్ పై బయట ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో గల్లీగల్లీకి బెల్ట్ షాపులు వెలిశాయని, మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో అవి నడుస్తున్నాయని ఆరోపించారు. మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా అని జగన్ ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, మోసాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకే లిక్కర్ కుంభకోణం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

This post was last modified on May 22, 2025 3:10 pm

Share

Recent Posts

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

7 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

1 hour ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

5 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

6 hours ago