అమరావతి రాజధాని ప్రాంతంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభ.. వేదికపై జరిగిన కొన్ని కీలక పరిణా మాలు చూస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్-ప్రధాని నరేంద్ర మోడీల మధ్య ఉన్న వ్యక్తగత బంధం ఎంత ద్రుఢంగా ఉందో అర్థమవుతుంది. వాస్తవానికి ప్రధాని జాతీయస్థాయిలో పట్టుమని 6-10 మంది నాయకులతోనే ఇలాంటి బంధాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో అయితే.. ఇలాంటి బంధం ఉన్న నాయకులే లేరు.
నేరుగా పేరు పెట్టి పిలవడం.. ఏకవచనంతో చొరవ తీసుకుని పలకరించడం వంటివి ప్రధాని డైరీలో చాలా చాలా తక్కువగానే ఉంటాయి. దీనికి కారణం.. ఎప్పుడు ఎలాంటి రాజకీయాలను చూడాల్సి వస్తుందో అన్న వ్యవహారం మోడీకి బాగా తెలుసు. అందుకే.. ఎవరితోనూ పెద్దగా మానసిక సంబంధం పెట్టుకోరు. కానీ.. దేశవ్యాప్తంగా ఆరుగురి నుంచి 10 మంది వరకు నాయకులతో మోడీ అవ్యాజమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో అమిత్ షా, జేపీ నడ్డా వంటి సొంత పార్టీ నాయకులు ఉన్నారు.
ఇతర పార్టీలకు చెందిన వారిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందున్నారని చెప్పాలి. తాజా పరిణామాలు.. దీనిని రుజువు చేస్తున్నాయి. జనసేనాని దగ్గు, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారని తెలిసి.. ఆయనకు కాఫ్ టాబ్లెట్/ చాక్లెట్ అందించడం.. సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. ఇది వారి మధ్య ఉన్న బంధాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు.. పేరు పెట్టి.. చేయి చూపి మరీ పిలుస్తూ.. తన దగ్గరకు రమ్మనడం.. కూడా పవన్-మోడీ ల వ్యక్తిగత బంధాన్ని చాటుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇలా .. సాధారణంగా ప్రధాని మోడీ చేయరు. ఎంతో స్నేహం.. అంతకు మించి సదరు నేతపై అంతకు మించిన విశ్వాసం ఉంటే తప్ప.. ఆయన అలా వ్యవహరించరు. ఇది పవన్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు మించి మరెవరూ ఇలా మోడీ దగ్గర మార్కులు వేయించుకున్న పరిస్థితి లేదు. గతంలో వైసీపీ అధినేత జగన్ను.. మోడీకి దత్తపుత్రుడు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినా.. ఆ తరహా పరిస్థితి బహిరంగ వేదికపై ఎక్కడా జరగలేదు.
అయితే.. పవన్ విషయంలో ఫెవికాల్ను మించిన బంధంతో మోడీ వ్యవహరించారని.. అంటున్నారు. ఆయన అనుసరిస్తున్న సనాతన ధర్మం కావొచ్చు.. కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు పవన్ మద్దతు తెలపడం కావొచ్చు. తమిళనాడులోని ప్రభుత్వంపై పరోక్ష యుద్ధం చేస్తున్న తీరు వంటివి.. మోడీని మెస్మరైజ్ చేస్తుండడమే దీనికి కారణాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
This post was last modified on May 3, 2025 3:59 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…