Political News

ఎస్‌.. వీరి బంధం ఫెవికాల్‌నే మించిందిగా.. !

అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో శుక్ర‌వారం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌.. వేదిక‌పై జ‌రిగిన కొన్ని కీల‌క ప‌రిణా మాలు చూస్తే.. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌-ప్ర‌ధాని న‌రేంద్ర మోడీల మ‌ధ్య ఉన్న వ్య‌క్త‌గ‌త బంధం ఎంత ద్రుఢంగా ఉందో అర్థ‌మవుతుంది. వాస్త‌వానికి ప్ర‌ధాని జాతీయ‌స్థాయిలో ప‌ట్టుమ‌ని 6-10 మంది నాయ‌కుల‌తోనే ఇలాంటి బంధాన్ని కొన‌సాగిస్తున్నారు. తెలంగాణ‌లో అయితే.. ఇలాంటి బంధం ఉన్న నాయ‌కులే లేరు.

నేరుగా పేరు పెట్టి పిల‌వ‌డం.. ఏక‌వ‌చ‌నంతో చొర‌వ తీసుకుని ప‌ల‌క‌రించ‌డం వంటివి ప్ర‌ధాని డైరీలో చాలా చాలా త‌క్కువ‌గానే ఉంటాయి. దీనికి కార‌ణం.. ఎప్పుడు ఎలాంటి రాజ‌కీయాల‌ను చూడాల్సి వ‌స్తుందో అన్న వ్య‌వ‌హారం మోడీకి బాగా తెలుసు. అందుకే.. ఎవ‌రితోనూ పెద్ద‌గా మాన‌సిక సంబంధం పెట్టుకోరు. కానీ.. దేశ‌వ్యాప్తంగా ఆరుగురి నుంచి 10 మంది వ‌ర‌కు నాయ‌కుల‌తో మోడీ అవ్యాజ‌మైన అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు. వీరిలో అమిత్ షా, జేపీ న‌డ్డా వంటి సొంత పార్టీ నాయ‌కులు ఉన్నారు.

ఇత‌ర పార్టీల‌కు చెందిన వారిలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందున్నార‌ని చెప్పాలి. తాజా ప‌రిణామాలు.. దీనిని రుజువు చేస్తున్నాయి. జ‌న‌సేనాని దగ్గు, గొంతు నొప్పితో ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిసి.. ఆయ‌న‌కు కాఫ్ టాబ్లెట్‌/  చాక్లెట్ అందించ‌డం.. సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయింది. ఇది వారి మ‌ధ్య ఉన్న బంధాన్ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. పేరు పెట్టి.. చేయి చూపి మ‌రీ పిలుస్తూ.. త‌న ద‌గ్గ‌ర‌కు ర‌మ్మ‌న‌డం.. కూడా ప‌వ‌న్‌-మోడీ ల వ్య‌క్తిగ‌త బంధాన్ని చాటుతున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇలా .. సాధార‌ణంగా ప్ర‌ధాని మోడీ చేయ‌రు. ఎంతో స్నేహం.. అంత‌కు మించి స‌ద‌రు నేత‌పై అంత‌కు మించిన విశ్వాసం ఉంటే త‌ప్ప‌.. ఆయ‌న అలా వ్య‌వ‌హ‌రించ‌రు. ఇది ప‌వ‌న్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈయ‌న‌కు మించి మ‌రెవ‌రూ ఇలా మోడీ ద‌గ్గ‌ర మార్కులు వేయించుకున్న ప‌రిస్థితి లేదు. గ‌తంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను.. మోడీకి ద‌త్త‌పుత్రుడు అని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పినా.. ఆ త‌ర‌హా ప‌రిస్థితి బ‌హిరంగ వేదిక‌పై ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు.

అయితే.. ప‌వ‌న్ విష‌యంలో ఫెవికాల్‌ను మించిన బంధంతో మోడీ వ్య‌వ‌హ‌రించార‌ని.. అంటున్నారు. ఆయ‌న అనుస‌రిస్తున్న స‌నాత‌న ధ‌ర్మం కావొచ్చు.. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు తెల‌ప‌డం కావొచ్చు. త‌మిళ‌నాడులోని ప్ర‌భుత్వంపై ప‌రోక్ష యుద్ధం చేస్తున్న తీరు వంటివి.. మోడీని మెస్మ‌రైజ్ చేస్తుండ‌డమే దీనికి కార‌ణాల‌ని పరిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.

This post was last modified on May 3, 2025 3:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

2 hours ago

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

6 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

10 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

11 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

12 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

12 hours ago