అమరావతి రాజధాని ప్రాంతంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభ.. వేదికపై జరిగిన కొన్ని కీలక పరిణా మాలు చూస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్-ప్రధాని నరేంద్ర మోడీల మధ్య ఉన్న వ్యక్తగత బంధం ఎంత ద్రుఢంగా ఉందో అర్థమవుతుంది. వాస్తవానికి ప్రధాని జాతీయస్థాయిలో పట్టుమని 6-10 మంది నాయకులతోనే ఇలాంటి బంధాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో అయితే.. ఇలాంటి బంధం ఉన్న నాయకులే లేరు.
నేరుగా పేరు పెట్టి పిలవడం.. ఏకవచనంతో చొరవ తీసుకుని పలకరించడం వంటివి ప్రధాని డైరీలో చాలా చాలా తక్కువగానే ఉంటాయి. దీనికి కారణం.. ఎప్పుడు ఎలాంటి రాజకీయాలను చూడాల్సి వస్తుందో అన్న వ్యవహారం మోడీకి బాగా తెలుసు. అందుకే.. ఎవరితోనూ పెద్దగా మానసిక సంబంధం పెట్టుకోరు. కానీ.. దేశవ్యాప్తంగా ఆరుగురి నుంచి 10 మంది వరకు నాయకులతో మోడీ అవ్యాజమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో అమిత్ షా, జేపీ నడ్డా వంటి సొంత పార్టీ నాయకులు ఉన్నారు.
ఇతర పార్టీలకు చెందిన వారిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందున్నారని చెప్పాలి. తాజా పరిణామాలు.. దీనిని రుజువు చేస్తున్నాయి. జనసేనాని దగ్గు, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారని తెలిసి.. ఆయనకు కాఫ్ టాబ్లెట్/ చాక్లెట్ అందించడం.. సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. ఇది వారి మధ్య ఉన్న బంధాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు.. పేరు పెట్టి.. చేయి చూపి మరీ పిలుస్తూ.. తన దగ్గరకు రమ్మనడం.. కూడా పవన్-మోడీ ల వ్యక్తిగత బంధాన్ని చాటుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇలా .. సాధారణంగా ప్రధాని మోడీ చేయరు. ఎంతో స్నేహం.. అంతకు మించి సదరు నేతపై అంతకు మించిన విశ్వాసం ఉంటే తప్ప.. ఆయన అలా వ్యవహరించరు. ఇది పవన్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు మించి మరెవరూ ఇలా మోడీ దగ్గర మార్కులు వేయించుకున్న పరిస్థితి లేదు. గతంలో వైసీపీ అధినేత జగన్ను.. మోడీకి దత్తపుత్రుడు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినా.. ఆ తరహా పరిస్థితి బహిరంగ వేదికపై ఎక్కడా జరగలేదు.
అయితే.. పవన్ విషయంలో ఫెవికాల్ను మించిన బంధంతో మోడీ వ్యవహరించారని.. అంటున్నారు. ఆయన అనుసరిస్తున్న సనాతన ధర్మం కావొచ్చు.. కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు పవన్ మద్దతు తెలపడం కావొచ్చు. తమిళనాడులోని ప్రభుత్వంపై పరోక్ష యుద్ధం చేస్తున్న తీరు వంటివి.. మోడీని మెస్మరైజ్ చేస్తుండడమే దీనికి కారణాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
This post was last modified on May 3, 2025 3:59 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…