Political News

ఎస్‌.. వీరి బంధం ఫెవికాల్‌నే మించిందిగా.. !

అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో శుక్ర‌వారం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌.. వేదిక‌పై జ‌రిగిన కొన్ని కీల‌క ప‌రిణా మాలు చూస్తే.. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌-ప్ర‌ధాని న‌రేంద్ర మోడీల మ‌ధ్య ఉన్న వ్య‌క్త‌గ‌త బంధం ఎంత ద్రుఢంగా ఉందో అర్థ‌మవుతుంది. వాస్త‌వానికి ప్ర‌ధాని జాతీయ‌స్థాయిలో ప‌ట్టుమ‌ని 6-10 మంది నాయ‌కుల‌తోనే ఇలాంటి బంధాన్ని కొన‌సాగిస్తున్నారు. తెలంగాణ‌లో అయితే.. ఇలాంటి బంధం ఉన్న నాయ‌కులే లేరు.

నేరుగా పేరు పెట్టి పిల‌వ‌డం.. ఏక‌వ‌చ‌నంతో చొర‌వ తీసుకుని ప‌ల‌క‌రించ‌డం వంటివి ప్ర‌ధాని డైరీలో చాలా చాలా త‌క్కువ‌గానే ఉంటాయి. దీనికి కార‌ణం.. ఎప్పుడు ఎలాంటి రాజ‌కీయాల‌ను చూడాల్సి వ‌స్తుందో అన్న వ్య‌వ‌హారం మోడీకి బాగా తెలుసు. అందుకే.. ఎవ‌రితోనూ పెద్ద‌గా మాన‌సిక సంబంధం పెట్టుకోరు. కానీ.. దేశ‌వ్యాప్తంగా ఆరుగురి నుంచి 10 మంది వ‌ర‌కు నాయ‌కుల‌తో మోడీ అవ్యాజ‌మైన అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు. వీరిలో అమిత్ షా, జేపీ న‌డ్డా వంటి సొంత పార్టీ నాయ‌కులు ఉన్నారు.

ఇత‌ర పార్టీల‌కు చెందిన వారిలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందున్నార‌ని చెప్పాలి. తాజా ప‌రిణామాలు.. దీనిని రుజువు చేస్తున్నాయి. జ‌న‌సేనాని దగ్గు, గొంతు నొప్పితో ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిసి.. ఆయ‌న‌కు కాఫ్ టాబ్లెట్‌/  చాక్లెట్ అందించ‌డం.. సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయింది. ఇది వారి మ‌ధ్య ఉన్న బంధాన్ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. పేరు పెట్టి.. చేయి చూపి మ‌రీ పిలుస్తూ.. త‌న ద‌గ్గ‌ర‌కు ర‌మ్మ‌న‌డం.. కూడా ప‌వ‌న్‌-మోడీ ల వ్య‌క్తిగ‌త బంధాన్ని చాటుతున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇలా .. సాధార‌ణంగా ప్ర‌ధాని మోడీ చేయ‌రు. ఎంతో స్నేహం.. అంత‌కు మించి స‌ద‌రు నేత‌పై అంత‌కు మించిన విశ్వాసం ఉంటే త‌ప్ప‌.. ఆయ‌న అలా వ్య‌వ‌హ‌రించ‌రు. ఇది ప‌వ‌న్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈయ‌న‌కు మించి మ‌రెవ‌రూ ఇలా మోడీ ద‌గ్గ‌ర మార్కులు వేయించుకున్న ప‌రిస్థితి లేదు. గ‌తంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను.. మోడీకి ద‌త్త‌పుత్రుడు అని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పినా.. ఆ త‌ర‌హా ప‌రిస్థితి బ‌హిరంగ వేదిక‌పై ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు.

అయితే.. ప‌వ‌న్ విష‌యంలో ఫెవికాల్‌ను మించిన బంధంతో మోడీ వ్య‌వ‌హ‌రించార‌ని.. అంటున్నారు. ఆయ‌న అనుస‌రిస్తున్న స‌నాత‌న ధ‌ర్మం కావొచ్చు.. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు తెల‌ప‌డం కావొచ్చు. త‌మిళ‌నాడులోని ప్ర‌భుత్వంపై ప‌రోక్ష యుద్ధం చేస్తున్న తీరు వంటివి.. మోడీని మెస్మ‌రైజ్ చేస్తుండ‌డమే దీనికి కార‌ణాల‌ని పరిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.

This post was last modified on May 3, 2025 3:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

4 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

5 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

5 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

7 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

8 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

9 hours ago