అమరావతి రాజధాని ప్రాంతంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభ.. వేదికపై జరిగిన కొన్ని కీలక పరిణా మాలు చూస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్-ప్రధాని నరేంద్ర మోడీల మధ్య ఉన్న వ్యక్తగత బంధం ఎంత ద్రుఢంగా ఉందో అర్థమవుతుంది. వాస్తవానికి ప్రధాని జాతీయస్థాయిలో పట్టుమని 6-10 మంది నాయకులతోనే ఇలాంటి బంధాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో అయితే.. ఇలాంటి బంధం ఉన్న నాయకులే లేరు.
నేరుగా పేరు పెట్టి పిలవడం.. ఏకవచనంతో చొరవ తీసుకుని పలకరించడం వంటివి ప్రధాని డైరీలో చాలా చాలా తక్కువగానే ఉంటాయి. దీనికి కారణం.. ఎప్పుడు ఎలాంటి రాజకీయాలను చూడాల్సి వస్తుందో అన్న వ్యవహారం మోడీకి బాగా తెలుసు. అందుకే.. ఎవరితోనూ పెద్దగా మానసిక సంబంధం పెట్టుకోరు. కానీ.. దేశవ్యాప్తంగా ఆరుగురి నుంచి 10 మంది వరకు నాయకులతో మోడీ అవ్యాజమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో అమిత్ షా, జేపీ నడ్డా వంటి సొంత పార్టీ నాయకులు ఉన్నారు.
ఇతర పార్టీలకు చెందిన వారిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందున్నారని చెప్పాలి. తాజా పరిణామాలు.. దీనిని రుజువు చేస్తున్నాయి. జనసేనాని దగ్గు, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారని తెలిసి.. ఆయనకు కాఫ్ టాబ్లెట్/ చాక్లెట్ అందించడం.. సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. ఇది వారి మధ్య ఉన్న బంధాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు.. పేరు పెట్టి.. చేయి చూపి మరీ పిలుస్తూ.. తన దగ్గరకు రమ్మనడం.. కూడా పవన్-మోడీ ల వ్యక్తిగత బంధాన్ని చాటుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇలా .. సాధారణంగా ప్రధాని మోడీ చేయరు. ఎంతో స్నేహం.. అంతకు మించి సదరు నేతపై అంతకు మించిన విశ్వాసం ఉంటే తప్ప.. ఆయన అలా వ్యవహరించరు. ఇది పవన్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు మించి మరెవరూ ఇలా మోడీ దగ్గర మార్కులు వేయించుకున్న పరిస్థితి లేదు. గతంలో వైసీపీ అధినేత జగన్ను.. మోడీకి దత్తపుత్రుడు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినా.. ఆ తరహా పరిస్థితి బహిరంగ వేదికపై ఎక్కడా జరగలేదు.
అయితే.. పవన్ విషయంలో ఫెవికాల్ను మించిన బంధంతో మోడీ వ్యవహరించారని.. అంటున్నారు. ఆయన అనుసరిస్తున్న సనాతన ధర్మం కావొచ్చు.. కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు పవన్ మద్దతు తెలపడం కావొచ్చు. తమిళనాడులోని ప్రభుత్వంపై పరోక్ష యుద్ధం చేస్తున్న తీరు వంటివి.. మోడీని మెస్మరైజ్ చేస్తుండడమే దీనికి కారణాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
This post was last modified on May 3, 2025 3:59 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…