Political News

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే సిట్ అధికారులు ఆయనను ఆన్ కెమెరా విచారణ జరిపారు. అయితే, సిట్ విచారణకు ముందు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ లంచ్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది.

ఈ గదిలో కూర్చొని ఈ ఇంట్లో నుంచే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ రచన చేశానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారట. ఉద్యమానికి ఊపిరి పోసిన ఈ గదిలోనే ఈ తరహా ఆరోపణలపై విచారణ ఎదురుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ ఎమోషనల్ అయ్యారట.

ఇటువంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని బాధపడ్డారట. ప్రత్యేక తెలంగాణ కోసం ఈ గదిలోనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, ఎంతో మందితో చర్చలు జరిపానని గుర్తు చేసుకున్నారట. ఇక్కడ ఆ విచారణను ఎదుర్కోవడం దురదృష్టకరమని అన్నారట.

విచారణ నేపథ్యంలో నంది నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాగా, కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టగా…ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.

నాలుగున్నర గంటల సుదీర్ఘ విచారణ తరువాత సిట్ అధికారులు కేసీఆర్ నివాసాన్ని విడిచి వెళ్ళారు. ఐతే చట్టప్రకారం 65 సంవత్సరాల పైబడిన వారిని సాయంత్రం 6 గంటల తరువాత ప్రశ్నించడానికి వీల్లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై సిట్ అధికారులు స్పందించాల్సి ఉంది.

This post was last modified on February 1, 2026 8:39 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago