Political News

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే సిట్ అధికారులు ఆయనను ఆన్ కెమెరా విచారణ జరిపారు. అయితే, సిట్ విచారణకు ముందు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ లంచ్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది.

ఈ గదిలో కూర్చొని ఈ ఇంట్లో నుంచే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ రచన చేశానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారట. ఉద్యమానికి ఊపిరి పోసిన ఈ గదిలోనే ఈ తరహా ఆరోపణలపై విచారణ ఎదురుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ ఎమోషనల్ అయ్యారట.

ఇటువంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని బాధపడ్డారట. ప్రత్యేక తెలంగాణ కోసం ఈ గదిలోనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, ఎంతో మందితో చర్చలు జరిపానని గుర్తు చేసుకున్నారట. ఇక్కడ ఆ విచారణను ఎదుర్కోవడం దురదృష్టకరమని అన్నారట.

విచారణ నేపథ్యంలో నంది నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాగా, కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టగా…ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.

నాలుగున్నర గంటల సుదీర్ఘ విచారణ తరువాత సిట్ అధికారులు కేసీఆర్ నివాసాన్ని విడిచి వెళ్ళారు. ఐతే చట్టప్రకారం 65 సంవత్సరాల పైబడిన వారిని సాయంత్రం 6 గంటల తరువాత ప్రశ్నించడానికి వీల్లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై సిట్ అధికారులు స్పందించాల్సి ఉంది.

This post was last modified on February 1, 2026 8:39 pm

Share

Recent Posts

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

1 hour ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

2 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

2 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

4 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

5 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

12 hours ago