Political News

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇటీవ‌ల ఈ కేసు విచార‌ణ‌ను పూర్తి చేసిన సీబీఐ నేతృత్వంలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక ఇచ్చింది. దీనిలో అది నెయ్యే కాద‌ని.. అలాగ‌ని పంది కొవ్వు, ఆవు కొవ్వు క‌లిసిన‌ట్టు ఆన‌వాళ్లు లేవ‌ని పేర్కొన్న‌ట్టు వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇది గ‌త కొన్నాళ్లుగా తీవ్ర వివాదంగా మారింది. ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

వైసీపీ నేత‌లు చేస్తున్న ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా సీఎం చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌లో స్పందించారు. గ‌తంలో ఎన్‌డీడీబీ(నేష‌న‌ల్ డెయిరీ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు) ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాను వ్యాఖ్యానించాన‌ని చెప్పారు.

అప్ప‌ట్లో ఈవో శ్యామ‌ల‌రావు.. ఎన్‌డీడీబీ నుంచి నివేదిక తెప్పించార‌ని.. దీనినితాను అధ్య‌య‌నం చేశాన‌ని తెలిపారు. ఆ నివేదిక‌లో పొందుప‌రిచిన అంశాల‌పైనే తాను స్పందించాన‌న్నారు. జంతువుల కొవ్వు నెయ్యిలో క‌లిసింద‌ని ఈ నివేదిక స్ప‌ష్టం చేసింద‌న్నారు. దేశంలోనే అత్యంత విశ్వ‌స‌నీయ ఎన్‌డీడీబీ నివేదిక‌ను ఎవ‌రైనా చ‌దువుకోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు.

కానీ, త‌న‌పై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. తాను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. ఇలాంటి వారిని(వైసీపీ) ఏమ‌నాల‌ని ప్ర‌శ్నించారు. తిరుమ‌ల శ్రీవారితో పెట్టుకున్న వారు.. ఈ జ‌న్మ‌లోనే అనుభ‌విస్తార‌ని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వైసీపీ నేత‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో నిన్న ఘ‌ట‌నే(అంబ‌టి రాంబాబు) ఉదాహ‌ర‌ణ అని పేరు ఎత్తకుండానే చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలోనే కాకుండా.. అనేక అంశాల్లో అప‌చారం చేశార‌ని అన్నారు.

కాగా.. గ‌తంలో తిరుమ‌ల ప్ర‌క్షాళ‌న‌లో భాగంగానే అప్ప‌టి ఈవో శ్యామ‌ల‌రావును బ‌దిలీ చేశామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ప్ర‌స్తుత ఈవో సింఘాల్ బ‌దిలీపై త‌ర్వాత మాట్లాడ‌తాన‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on February 1, 2026 7:48 pm

Share

Recent Posts

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

39 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

47 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

59 minutes ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

3 hours ago