Political News

యుద్ధ వాతావరణంలో భారత్ పవర్ఫుల్ డీల్

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, భారత రక్షణ వ్యూహానికి మరో భారీ బలం జతకానుంది. భారత్ సముద్ర పరిరక్షణ సామర్థ్యాన్ని పెంచే దిశగా ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం కుదిరింది. రఫేల్ మెరైన్ (Rafale Marine) యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి సుమారు రూ.63,000 కోట్ల విలువైన ఈ డీల్‌పై సోమవారం అధికారికంగా సంతకాలు జరిగాయి.

ఈ ఒప్పందం ప్రకారం, భారత నౌకాదళానికి 22 సింగిల్ సీట్ రఫేల్-ఎం యుద్ధ విమానాలు, 4 ట్విన్ సీట్ శిక్షణ విమానాలు లభించనున్నాయి. ఈ విమానాలు ప్రత్యేకంగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమాన వాహక నౌకల నుంచి కార్యకలాపాలు నిర్వహించబోతున్నాయి. 2031 నాటికి అన్ని విమానాల డెలివరీ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) ఈ ఒప్పందానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రఫేల్-ఎం జెట్స్ అమాంతం భారత్‌కు ఆధునిక సముద్ర రక్షణ సామర్థ్యాన్ని తీసుకురాబోతున్నాయి. ఈ 4.5వ తరం యుద్ధ విమానాలు ఎక్సోసెట్ ఏఎం39 యాంటీ-షిప్ మిస్సైళ్లు, స్కాల్ప్ గగనతలం నుంచి భూమి క్షిపణులు, మెటియోర్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైళ్లు వంటి అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉంటాయి. ఇవి భారత నౌకాదళానికి శత్రు దేశాలపై సుదూర దాడులు నిర్వహించేందుకు, సముద్రంలో వాయు ఆధిపత్యాన్ని చాటేందుకు మునుపెన్నడూ లేని శక్తిని ఇవ్వబోతున్నాయి.

ఇప్పటికే భారత్ వాయుసేనలో రఫేల్ యుద్ధ విమానాల సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. దీంతో లాజిస్టిక్స్, విడిభాగాల నిర్వహణ వంటి అంశాల్లో సౌలభ్యం కలిగించడానికి ఇది కీలక ముందడుగు కావడం విశేషం. పైగా, నౌకాదళానికి ప్రస్తుతం ఉన్న మిగ్-29కె ఫ్లీట్ తరచూ సేవల లోపాలతో ఇబ్బంది పడుతుండటంతో, ఈ కొత్త రఫేల్-ఎం జెట్స్ అత్యవసరంగా అవసరమయ్యాయి.

ప్రస్తుత యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ ఒప్పందం ద్వారా భారత్ మరోసారి తన సైనిక శక్తిని గ్లోబల్ లెవల్లో హైలైట్ చేసుకునే అవకాశాన్ని పొందింది. సముద్ర ప్రాంతాల్లో భారత్ ప్రతాపం మరింత పెరగనుంది. దీని వల్ల పాకిస్థాన్ సహా ప్రత్యర్థి దేశాలకు ఇది బలమైన మానసిక దెబ్బగా పనిచేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో భారత్ తన రక్షణ వ్యూహాన్ని మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు ఈ రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల డీల్ కీలకంగా నిలవనుంది.

This post was last modified on April 28, 2025 7:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

38 minutes ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

1 hour ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

1 hour ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

2 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

3 hours ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

4 hours ago