నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యం లో తెలుగు వారి ఆరాధ్య కథానాయకుడు.. పేదల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న అన్నగారు.. ఎన్టీ ఆర్ విగ్రహాన్ని దేశంలోనే అత్యంత ఎత్తయిన రీతిలో.. రికార్డు స్థాయిలో నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి కొన్ని ఫొటోలను ప్రభుత్వం విడుదల చేసింది.
విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తాడేపల్లి ప్రాంతాలను కలుపుతూ.. మెగా సిటీగా రూపొందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో కృష్ణానదిని కలుపుతూ.. అమరావతిలో ఏర్పడే.. ప్రాంతంలో అన్నగారి విగ్రహాన్నినిర్మించాలని సంకల్పించారు. దీనిని దేశంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా రూపొందించాలని భావించారు. తాజాగా ఈ విషయంపైనే.. రాజధాని వ్యవహారాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణ తన బృందంతో గుజరాత్లో పర్యటించి వచ్చారు.
గుజరాత్లో ఉక్కు మనిషి.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దీనిలోనే గ్రంథాలయం, వైద్య శాల సహా.. విగ్రహం కింది భాగంలో అత్యంత అపురూపమైన వన్యప్రాణులతో కూడిన జూను కూడా ఏర్పాటు చేశారు. ఇది గుజరాత్కే మకుటాయమానమైన పర్యాటక కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో అలాంటిదే ఏపీలోనూ..ముఖ్యంగా రాజధానిలోనూ నిర్మించనున్నారు. దీనికి సంబంధించి అన్నగారి విగ్రహం ఇలా నిర్మించబోతున్నామని ప్రభుత్వం పలు ఫొటోలను విడుదల చేసింది.
అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) అమరావతిలోని నీరుకొండలో నందమూరి తారక రామారావు విగ్రహం మరియు స్మారక చిహ్నం కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) సిద్ధం చేయడానికి కన్సల్టెంట్ను నియమించడానికి టెండర్లు వేసింది. దీంతో అమరావతిలో అన్నగారి విగ్రహంఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది.
This post was last modified on April 22, 2025 8:14 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…