మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరిగా అమర్చుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ఈ మేరకు రవాణాశాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. సెప్టెంబర్ 30వ తేదీని తుదిగడువుగా ప్రకటించింది. అందులోగా హెచ్ఎస్ఆర్పీ ప్లేట్ బిగించనివారు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేట్ వల్ల వాహన దొంగతనాలను, నకిలీ నంబర్ల వాడకాన్ని నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ఇది రోడ్డు భద్రతకూ ఎంతో మేలుకాలిగిస్తుందని తెలిపారు. ఇప్పటికే 2019 తర్వాత తయారైన వాహనాలపై ఈ నిబంధన అమలులో ఉంది. కానీ ఇప్పుడు పాత వాహనాలకూ తప్పనిసరి చేశారు.
దీని ధర వాహన రకాన్ని బట్టి మారుతుంది. ద్విచక్ర వాహనాలకు ₹320-₹380 వరకు, కార్లకు ₹590-₹700 వరకు, ట్రక్కులు, కమర్షియల్ వాహనాలకు ₹600-₹860 వరకు ధరలు నిర్ణయించారు. ఇంటికే వచ్చి ప్లేట్ అమర్చినట్లయితే అదనపు ఛార్జీ వసూలు చేయవచ్చని తెలిపారు. వాహన యజమానులే తమ వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ అమర్చుకోవాల్సిన బాధ్యత వహించాలి.
అది లేకపోతే వాహన బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్లను పొందడం సాధ్యం కాదు. రవాణా కార్యాలయంలో పేరుమార్చాలన్నా, వాహనం అమ్మాలన్నా ఈ ప్లేట్ తప్పనిసరి. గడువు తర్వాత బోర్డు లేకుండా తిరిగితే నేరుగా కేసు నమోదు చేస్తారు. వాహనదారులు www.siam.in వెబ్సైట్ ద్వారా తమ వాహన వివరాలు నమోదు చేసి, నంబర్ ప్లేట్ను బుక్ చేసుకోవాలి. బిగించిన తర్వాత ఫొటోను అదే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఇక ఆలస్యం ఎందుకు? మీరు నడిపే వాహనం చట్టబద్ధంగా ఉండాలంటే వెంటనే హెచ్ఎస్ఆర్పీ ప్లేట్ బిగించండి.
This post was last modified on April 10, 2025 9:45 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…