Political News

రాజీ బాటలో రోజా సక్సెస్ అయ్యారా..?

ఆర్కే రోజా పేరు వింటేనే కూటమి పార్టీలు అంతెత్తున ఎగిరి పడుతున్నాయి. వైసీపీ అదికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలపై ఓ రేంజిలో విరుచుకుపడిన రోజా వీడియోలను గుర్తుకు తెచ్చుకుని కూటమి పార్టీల నేతలు కుతకుతలాడి పోతున్నారు. అలాంటి రోజా కూటమి సర్కారుతో… ప్రత్యేకించి టీడీపీతో రాజీ కుదుర్చుకున్నారని, ఇప్పటికే ఈ రాజీ కుదరిపోయిందని, ప్రస్తుతం రోజా అరెస్టు నుంచి బయటపడిపోయారని, ఎంచక్కా ఆమె అరెస్టు భయం నుంచి బయట పడి ఊపిరి పీల్చుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బుధవారం సాయంత్రం నుంచి ఈ దిశగా ఓ రేంజిలో ప్రచారం జరుగుతోంది.

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రోజా… టీడీపీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మంచి వాగ్ధాటితో పాటు ఆయా విషయాలను క్షణాల్లో అర్థం చేసుకుని సాగే తీరుతో టీడీపీలో రోజాకు మంచి గుర్తింపే దక్కింది. 2004లో నగరి సీటు, 2009లో ఏకంగా చంద్రగిరి సీటు దక్కినా.. రోజాకు విజయం మాత్రం దరి చేరలేదు. ఈ క్రమంలో 2009 ఎన్నికల తర్వాత రోజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జగన్ వెంట నడిచి వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా.. జగన్ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024లో వైసీపీ మాదిరిగానే రోజా కూడా అపజయం పాలయ్యారు.

కూటమి అధికారంలో రాగా.. వైసీపీ జమానాలో జరిగిన ఆడుదాం ఆంధ్రా పేరిట భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రాగా… ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రోజా అరెస్టు ఖాయమని కూడా కూటమి పార్టీల నేతలు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తాను టీడీపీలో ఉండగా… తనతో సన్నిహితంగా మెలగిన నేతల జాబితా తీసిన రోజా…రాయలసీమ జిల్లాలకు చెందిన కీలక మంత్రితో రాజీ యత్నాలు మొదలుపెట్టారట. తొలుత ఆ మంత్రి అంతగా పట్టించుకోకున్నా… రోజా పలుమార్లు అభ్యర్థించడంతో ఆయన రోజాను విజయవాడలోని తన ఇంటికి ఆహ్వానించారట. ఈ సందర్భంగా తన మనసులోని రాజీ బాటను రోజా బయటపెట్టారని సమాచారం.

రోజా సంప్రదించిన మంత్రి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నేతగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సదరు మంత్రిపై చంద్రబాబుకు అపారమైన విశ్వాసం కూడా ఉన్నాయట. ఈ క్రమంలో సదరు మంత్రి ఓకే అంటే… చంద్రబాబు ఓకే అన్నట్టేనన్న భావనతోనే రోజా తన రాజీ బాటను ఆ మంత్రి ద్వారానే నడిపించినట్లుగా తెలుస్తోంది. గతంలో దాదాపుగా పదేళ్ల పాటు టీడీపీలో కొనసాగిన ఆమె టీడీపీలోని పట్టు విడుపులను ఇప్పుడు బాగా వినియోగించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబుతో పాటు లోకేశ్ లపై ఓ రేంజిలో విరుచుకుపడిన రోజాను ఎలా క్షమించేస్తారంటూ ఆ సీమ మంత్రిపై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

This post was last modified on April 10, 2025 6:23 am

Share
Show comments
Published by
Satya
Tags: RojaTDPYSRCP

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

10 minutes ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

2 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

2 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

3 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago