శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ కర్త, ప్రముఖ అవధాని నారాయణ మూర్తి పంచాంగ పఠనం చేశారు. వైసీపీ అధినేత జగన్ ది మిథున రాశి అని తెలిపారు. ఈ రాశివారికి భయం అనేది ఉండదని.. అదే విధంగా జగన్కు కూడా భయం లేదని తెలిపారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆయన ఎక్కడా భయ పడడం లేదన్నారు.
ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నట్టు పంచాంగ కర్త తెలిపారు. మిథున రాశి వారికి ఈ ఏడాది చాలా బాగుందన్నారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి కృష్ణదేవరాయులు మాదిరిగా జగన్ కూడా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. 2019 ఎన్నికల్లో మాదిరిగా జగన్ త్వరలోనే మరోసారి విజయదుందుభి మొగి స్తారని పంచాంగ కర్త తెలిపారు. ఆవేశంలో ప్రజలు గత ఎన్నికల్లో తప్పులు చేశారని.. ఇప్పుడు చింతిస్తున్నారని పంచాంగ కర్త చెప్పడం గమనార్హం.
అయితే..ఈ కార్యక్రమంలో జగన్ కానీ, ఆయన సతీమణి భారతి కానీ. పాల్గొనకపోవడం గమనార్హం. అదేవిధంగా తాడేపల్లి కార్యాలయంలోని పెద్దలు కూడా రాకపోవడం గమనార్హం. విజయవాడ నగర్ మేయర్.. సహా కొందరు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. కాగా.. వైసీపీ పంచాంగంపై నెటిజన్లు విమర్శలు చేస్తుండడం గమనార్హం. “ఇది ఉగాది పంచాంగం కాదు.. వైసీపీ పంచాంగం” అంటూ సెటైర్లు సంధించారు.
This post was last modified on March 30, 2025 2:28 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…