టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం బస్సు డ్రైవర్ గా అవతారం ఎత్తారు. భారత పారిశ్రామిక దిగ్గజం హిందూజా గ్రూప్ నకు చెందిన అశోక్ లేల్యాండ్ బస్సు ఎక్కిన ఆయన వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. అంతేనా ఏకంగా స్టీరింగ్ కూడా పట్టేశారు. గేర్ రాడ్ పైనా చేయేశారు. ఇగ్నిషన్ ఒక్కటే తిప్పలేదు. అది కూడా జరిగి ఉంటే.. నిజంగానే మనం లోకేశ్ ను డ్రైవర్ గానూ చూసేవాళ్లం. అయితే ఆ పనిని లోకేశ్ చేయలేదు. బస్సు డ్రైవర్ సీట్లో కూర్చుని ఆయన ఫొటోలకు ఫోజులిచ్చి బస్సు నుంచి దిగిపోయారు. ఈ సందర్భంగా బస్సు ప్రత్యేకతలను ఆయన అశోక్ లేల్యాండ్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటన బుధవారం విజయవాడ పరిధిలోని మల్లవల్ల పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. అశోక్ లేల్యాండ్ సంస్థ మల్లవల్లిలో బారీ బస్ బాడీ బిల్డింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని బుదవారం ప్రారంభించిన లోకేశ్.. అనంతరం సరదాగా అలా బస్సులోకి ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. మల్లవల్లి అశోక్ లేల్యాండ్ కేంద్రలోనే సదరు బస్సుకు బాడీని కట్టారు. ఆ బస్సునే లోకేశ్ పరిశీలించారు. బస్సు బాడీని పరిశీలించిన లోకేశ్.. అందులో కొత్తగా ఏమేం సౌకర్యాలను ఏర్పాటు చేశారన్న దాని గురించి కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అదే బస్సులో ముందు సీట్లో కూర్చుని ఆయన కొంతదూరం ప్రయాణించారు. బస్సులో సుఖమయ ప్రయాణానికి మంచి ఏర్పాట్లు జరిగాయని ఆయన కంపెనీ ప్రతినిధులను అభినందించారు. సీటింగ్ గానీ, లెగ్ స్పేస్, వాతావరణం అంతా బాగుంందని కూడా లోకేశ్ తెలిపారు. మొన్నటి ఎన్నికలకు ముందు యువగళం పేరిట పాదయాత్ర చేసిన సందర్భంగా మల్లవల్లిని సందర్శించిన లోకేశ్… తాము అధికారంలోకి రాగానే… మల్లవల్లికి నూతన జవజీవాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే కూటమి అధికారంలోకి రాగానే మల్లవల్లిలో పరిశ్రమలు కార్యకలాపాలు మొదలుపెట్టేలా ఆయన చర్యలు చేపట్టారు. ఇదే విషయాన్ని ఆయన కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా పేర్కొన్నారు.
This post was last modified on March 19, 2025 10:00 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…