Political News

‘డ్రైవర్’ సీట్లో మంత్రి నారా లోకేశ్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం బస్సు డ్రైవర్ గా అవతారం ఎత్తారు. భారత పారిశ్రామిక దిగ్గజం హిందూజా గ్రూప్ నకు చెందిన అశోక్ లేల్యాండ్ బస్సు ఎక్కిన ఆయన వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. అంతేనా ఏకంగా స్టీరింగ్ కూడా పట్టేశారు. గేర్ రాడ్ పైనా చేయేశారు. ఇగ్నిషన్ ఒక్కటే తిప్పలేదు. అది కూడా జరిగి ఉంటే.. నిజంగానే మనం లోకేశ్ ను డ్రైవర్ గానూ చూసేవాళ్లం. అయితే ఆ పనిని లోకేశ్ చేయలేదు. బస్సు డ్రైవర్ సీట్లో కూర్చుని ఆయన ఫొటోలకు ఫోజులిచ్చి బస్సు నుంచి దిగిపోయారు. ఈ సందర్భంగా బస్సు ప్రత్యేకతలను ఆయన అశోక్ లేల్యాండ్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటన బుధవారం విజయవాడ పరిధిలోని మల్లవల్ల పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. అశోక్ లేల్యాండ్ సంస్థ మల్లవల్లిలో బారీ బస్ బాడీ బిల్డింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని బుదవారం ప్రారంభించిన లోకేశ్.. అనంతరం సరదాగా అలా బస్సులోకి ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. మల్లవల్లి అశోక్ లేల్యాండ్ కేంద్రలోనే సదరు బస్సుకు బాడీని కట్టారు. ఆ బస్సునే లోకేశ్ పరిశీలించారు. బస్సు బాడీని పరిశీలించిన లోకేశ్.. అందులో కొత్తగా ఏమేం సౌకర్యాలను ఏర్పాటు చేశారన్న దాని గురించి కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అదే బస్సులో ముందు సీట్లో కూర్చుని ఆయన కొంతదూరం ప్రయాణించారు. బస్సులో సుఖమయ ప్రయాణానికి మంచి ఏర్పాట్లు జరిగాయని ఆయన కంపెనీ ప్రతినిధులను అభినందించారు. సీటింగ్ గానీ, లెగ్ స్పేస్, వాతావరణం అంతా బాగుంందని కూడా లోకేశ్ తెలిపారు. మొన్నటి ఎన్నికలకు ముందు యువగళం పేరిట పాదయాత్ర చేసిన సందర్భంగా మల్లవల్లిని సందర్శించిన లోకేశ్… తాము అధికారంలోకి రాగానే… మల్లవల్లికి నూతన జవజీవాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే కూటమి అధికారంలోకి రాగానే మల్లవల్లిలో పరిశ్రమలు కార్యకలాపాలు మొదలుపెట్టేలా ఆయన చర్యలు చేపట్టారు. ఇదే విషయాన్ని ఆయన కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా పేర్కొన్నారు.

This post was last modified on March 19, 2025 10:00 pm

Share
Show comments
Published by
Satya
Tags: Nara Lokesh

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

26 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago