Political News

షాకింగ్‌: ద‌స్త‌గిరి భార్య‌పై దాడి.. చంపుతామ‌ని బెదిరింపు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌లో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవ‌ర్‌గా మారిన షేక్ ద‌స్త‌గిరి భార్య షాబానాపై దాడి జ‌రిగింది. అయితే.. ఈ విష‌యం ఆల‌స్యంగా ఆమె వెల్ల‌డించారు. దాడి చేసిన వారు వైసీపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌ల‌ని, వారు కూడా ముస్లిం సామాజిక వ‌ర్గానికి చెందిన వారేన‌ని తెలిపారు. త‌న‌ను బెదిరించి.. దాడి చేయ‌డంతో పాటు.. జ‌గ‌న్‌, ఎంపీ అవినాష్ రెడ్డిల జోలికి వ‌స్తే.. ద‌స్త‌గిరిని కూడా లేపేస్తామ‌ని హెచ్చ‌రించిన‌ట్టు ఆమె చెప్పారు. మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. ఈ దాడి జ‌రిగిన త‌ర్వాత‌ పోలీసుల‌ను ఆశ్ర‌యించినా.. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌క‌పోగా.. కేసు కూడా న‌మోదు చేయ‌లేద‌ని షాబానా ఆరోపించారు.

షాబానా మాట‌ల్లో..

“క‌డ‌ప జిల్లా పులివెందుల‌లోని మ‌ల్యాల‌లో మా బంధువుల ఇంటికి వెళ్లాల‌ని అనుకున్నాం. మా ఆయ‌న పిల్లలు ముందుగానే వెళ్లిపోయారు. నేను ఆల‌స్యంగా బ‌య‌లుదేరా. ఈ స‌మ‌యంలో అనూహ్యంగా ఇద్ద‌రు మ‌హిళ‌లు మా ఇంట్లోకి చొర‌బ‌డ్డారు. నా పై దాడి చేశారు. రెండు చెంప‌లపై కొట్టారు. డొక్క‌ల్లో త‌న్నారు. దాడి చేసిన వారు మాల్యాల‌కు చెందిన శంషూన్‌, ప‌ర్వీన్‌గా గుర్తించారు. వారు దాడి చేయ‌డంతో బిగ్గ‌ర‌గా అరిచా. నా అరుపులు విని కొంద‌రు మా ఆయ‌న‌కు(ద‌స్త‌గిరి) ఫోన్ చేశారు. ఆయ‌న కొద్ది సేప‌టికి అక్క‌డ‌కు చేరుకున్నారు. కానీ, మ‌హిళ‌లు ఆయ‌న‌పైనా దాడికి ప్ర‌య‌త్నించి.. వెళ్లిపోయారు” అని వివ‌రించారు.

త‌న‌ను దారుణంగా దూషించార‌ని షాబానా తెలిపారు. అంతేకాదు.. ఈ కేసులో జ‌గ‌న్‌, ఎంపీ అవినాష్ రెడ్డి పేర్లు ఎందుకు చెబుతున్నారంటూ ప్ర‌శ్నించార‌ని చెప్పారు. వారి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తే.. ద‌స్త‌గిరిని కూడా న‌రికేస్తామ‌ని హెచ్చ‌రించిన‌ట్టు షాబానా పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై తాను స్వ‌యంగా పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా.. పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని.. కేసు న‌మోదు చేసి.. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరినా మౌనంగా ఉన్నార‌ని షాబానా తెలిపారు. వివేకా వాచ్‌మ‌న్ రంగ‌య్య అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించిన త‌ర్వాత‌.. ద‌స్త‌గిరిని కూడా చంపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆరోపించారు.

పోలీసుల వాద‌న ఇదీ..

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై మాల్యాల పోలీసులు స్పందించారు. త‌మ‌కు ఎలాంటి ఫిర్యాదు రాలేద‌ని.. వ‌స్తే ప‌రిశీలించి కేసు న‌మోదు చేస్తామ‌ని చెప్పారు. షాబానాకు ఎలాంటి భ‌యం అవ‌స‌రం లేద‌న్నారు. ఇది కేవ‌లం వ్య‌క్తిగ‌త కార‌ణంతోనే జ‌రిగిన దాడిగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అయినా.. ఫిర్యాదు అందితే ప‌రిశీలిస్తామ‌న్నారు. దీనిపై ఉన్న‌తాధికారులు స్పందించాల్సి ఉంది.

This post was last modified on March 16, 2025 9:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

2 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

2 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

2 hours ago

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

3 hours ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

3 hours ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

4 hours ago