ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తుల అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం… రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించే వ్యవసాయోత్పత్తులతో పాటుగా వారు తయారు చేసే వ్యవసాయేతర ఉత్పత్తులకు విలువను జోడిండచంతో పాటుగా వాటిని ఆన్ లైన్ ద్వారా విశ్వవ్యాప్తంగా అమ్మేందుకు ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తోడ్పాటు అందించనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఫ్లిప్ కార్ట్ సంస్థ ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇక ఇదే విషయంలో మరో సంస్థ కూడా ఏపీ సర్కారుతో మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమ వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు ప్యాపార శిక్షణను అందించేందుకు కేటలిస్టు మేనేజ్ మెంట్ సర్వీసెస్ అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ రెండు ఒప్పందాలతో డ్వాక్రా మహిళల జీవన పరిస్థితులు మెరుగు కానున్నాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా తొలుత డ్వాక్రా మహిళలు పండించిన వేరుశనగను ఫ్లిప్ కార్ట్ విశ్వ విఫణిలో విక్రయించనుంది. అంతకుముందు డ్వాక్రా మహిళలు పండించే వేరుశనగను ఆ సంస్థ ప్రాసెసింగ్ చేసి పంట ఉత్పత్తులకు విలువను జోడించనుంది. ఫలితంగా డ్వాక్రా మహిళలకు మరింత ఆదాయం సమకూరనుంది.
ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ రెండు ఒప్పందాలు కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ఉపయోగపడటం లేదు. రాష్ట్రంలో పండే పంట ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయి మార్కెట్లోకి తీసుకువెళుతున్నాయి. తొలి దశలో కేవలం వేరుశనగను మాత్రమే విక్రయించనున్న ఫ్లిప్ కార్ట్… భవిష్యత్తులో డ్వాక్రా మహిళలు పండించే ఇతరత్రా పంట ఉత్పత్తులు, వ్యవసాయేతర ఉత్పత్తులను కూడా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించనుంది. ఫలితంగా అటు డ్వాక్రా మహిళలతో పాటుగా రాష్ట్రంలో పండే పంటలకు కూడా అంతర్జాతీయంగా డిమాండ్ రానుంది. ఫలితంగా రాష్ట్ర వ్యవస్తాయ ఉత్పత్తులకు మరింత మేర మంచి ధరలు రానున్నాయి. అంటే…ఈ ఒప్పందాలు ఉభయతారకమన్నమాట.
This post was last modified on March 16, 2025 9:57 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…